కేజ్రీవాల్ మీద జైట్లీ పరువునష్టం దావా

 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశారు. డీడీసీఏలో తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో తనకు పరువు నష్టం జరిగిందని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో 10 కోట్ల రూపాయలకు జైట్లీ దావా వేశారు. తనతోపాటు తన కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ జైట్లీ కేజ్రీవాల్‌తోపాటు మరో ఐదుగురి మీద దావా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu