వైసీపీకి మరో షాక్ ... వాసిరెడ్డి పద్మ రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.  ఆ పార్టీకి మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు . ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు,ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు   మాజీ మంత్రులు ,  మాజీలు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఫైర్ బ్రాండ్ పేరు ఉన్న వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు . ఎన్నికల తర్వాత వాసిరెడ్డి ఎక్కడ కనిపించలేదు    వాసిరెడ్డి గత ఎన్నికల్లో జగ్గయ్య పేట సీటు ఆశించి భంగపడ్డారు. జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరడంతో జగ్గయ్య పేట ఇన్ చార్జి పదవి ఆశించిన  వాసిరెడ్డికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్య పేట ఇన్ చార్జిగా నియమిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు ఇవ్వడంతో వాసిరెడ్డి మనస్థాపానికి గురయ్యారు.   దీంతో తన రాజీనామా లేఖను జగన్ కు పంపారు.