పార్కింగ్ గొడవ.. 9 మంది మృతి

 

అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించారు. టెక్సాస్‌లోని ట్విన్‌పీక్సీ రెస్టారెంట్ వద్ద ఈ దారుణం జరిగింది. మూడు గ్రూపుల మధ్య పార్కింగ్ స్థలం వద్ద జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసింది. ఈ సందర్భంగా ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరికీ చికిత్స జరుగుతోంది. ఈ ఘటనా స్థలంలో ఘర్షణ పడిన యువకులు వదలి వెళ్ళిన దాదాపు వంద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్నారు. అమెరికాలో పెరిగిపోయిన గన్ కల్చర్ వికృత స్వరూపానికి ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు.