మా ఫొటోలు మార్ఫింగ్ చేశారు...

 

హర్యానాలోని రోహతక్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు తమను బస్సులో ఏడిపించిన ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. తమ మీద కక్ష సాధించడానికి ఆ ఆకతాయిలు తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టారని, వారిని అరెస్టు చేయాలని ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు పూజ, ఆరతి ఆందోళన చేపట్టారు. వీరిద్దరూ తండ్రితో కలసి రోహతక్ జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ విషయంలో ఒక నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. నిందితులందర్నీ అరెస్టు చేసేవరకూ ఎస్పీ కార్యాలయం ముందు నుంచి కదలమని అక్కాచెల్లెళ్ళు పట్టుదలగా వున్నారు.