సంధ్య థియేటర్ శ్రీ తేజ ఘటనపై దిల్ రాజు స్పందన

 

ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్యా థియేటర్లో పుష్ప2 సినిమా చూడడానికి చూడడానికి వచ్చిన ఓ కుటుంబ సభ్యుల్లో శ్రీ తేజ తల్లి  మరణించగా... శ్రీ తేజ తీవ్రస్థాయిలో గాయపడ్డాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే ఇప్పుడు ఈ ఘటనపై దిల్ రాజ్ స్పందిస్తూ శ్రీ తేజ తండ్రిని కలిసి మాట్లాడారు.

సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో, నిర్మాత దిల్ రాజు ఆయన కుటుంబానికి అందిస్తున్న సహాయంపై వివరాలు వెల్లడించారు. శ్రీ తేజ భవిష్యత్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ఆయన మీడియాతో పంచుకున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ... సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ మరియు అరవింద్ ఇద్దరు స్పందించడమే కాకుండా శ్రీ తేజ పేరుతో రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించానని చెప్పారు. 

అయితే ఆ రెండు కోట్ల రూపాయలతో వచ్చే వడ్డీని ప్రతి నెల శ్రీ తేజ తండ్రికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఘటన అనంతరం ఆస్పత్రిలో జరిగిన చికిత్స కోసం అల్లు అర్జున్ మరియు అతని తండ్రి అరవింద్ దాదాపు రూ. 70 లక్షల వరకు చెల్లించినట్లు కూడా ఆయన వెల్లడించారు. అదే సమయంలో, శ్రీ తేజ పునరావాసానికి అవసరమైన రిహాబిలిటేషన్ ఖర్చులను పూర్తిగా అల్లు అర్జున్ భరిస్తున్నారని దిల్ రాజు తెలిపారు. అల్లు అర్జున్ టీం ఘటన జరిగిన మొదటి రోజు నుంచే సమగ్రంగా స్పందించారని, అవసరమైన అన్ని సహాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అనంతరం శ్రీ తేజ తండ్రి మాట్లాడుతూప్రమాదం జరిగిన తర్వాత నుంచి చిత్రపరిశ్రమ అనేక విధాలుగా తమకు అండగా నిలుస్తోందని,అల్లు అర్జున్ టీం నుంచి వచ్చిన సహాయం ముఖ్య భరోసాగా మారిందని తెలిపారు.ఇంకా కొంత ఆర్థిక సహాయం అవసరమున్న నేపథ్యంలో దిల్ రాజుతో మాట్లాడగా, ఆయన అన్ని విధాల సహాయానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.శ్రీ తేజ ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో, కుటుంబ సభ్యులు, పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu