రాహుల్ గాంధీని ఉస్మానియాలో అడుగుపెట్టనీయం

 

తెలంగాణా కోసం తెరాస పోరాడింది. కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది. వీటిపై ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. కానీ తెలంగాణా కోసం పోరాడిన తెరాస దాని ఫలాలు పూర్తిగా పొందగలిగినా కాంగ్రెస్ మాత్రం పొందలేకపోయింది. పొందలేక పోతే పాయె కనీసం ఆ గౌరవం అయినా దక్కించుకోగలుగుతోందా అంటే అదీ లేదు. రాష్ట్ర విభజన చేసినందుకు ఆంద్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని తరిమికొడితే, సుమారు 1,000 మందికి పైగా తెలంగాణా యువకులు బలిదానాలు చేసుకొన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, ఆనాడు వారి మరణాల గురించి నోరు విప్పని రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఉస్మానియా విద్యార్ధులతో మాట్లాడేందుకు వస్తున్నారని తెలంగాణా టీ.యస్. జెఎసి చైర్మెన్ డి. బలరాజ్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక రాజకీయ నిరుద్యోగి కనుకనే మళ్ళీ తెలంగాణాలో తిరుగుతున్నాడని అయన ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణా ప్రజలకు, ఆత్మహత్యలు చేసుకొన్న యువకుల కుటుంబాలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పిన తరువాతనే ఉస్మానియాలో అడుగుపెట్టాలని లేకుంటే ప్రతిఘటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అనుబంద జెఎసికి చెందిన ఉస్మానియా విద్యార్ధులు కొందరు డిల్లీ వెళ్లి సోనియా గాంధీతో మాట్లాడటాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీ 2009 లో తెలంగాణా ఇస్తామని ప్రకటన చేసి మళ్ళీ వెనక్కి తగ్గిన తరువాత అనేక మంది విద్యార్ధులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారి మరణాలకు సోనియా, రాహుల్ గాంధీలే కారణమని అటువంటి వారితో ఉస్మానియా విద్యార్ధులే స్వయంగా వెళ్లి మంతనాలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu