వ్యాయామం మీద అతి పెద్ద పరిశోధన

ఆరోగ్యానికి నడక ఎంత అవసరమో కొత్తగా చెప్పేదేమీ లేదు. జాగింగ్‌ చేయడం, సైకిల్‌ తొక్కడం, ఈత కొట్టడం... ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ఇచ్చే వ్యాయామాలే అయినప్పటికీ... సులువుగా సహజంగా చేసే నడకే మన ఆరోగ్యాలను కాపాడుతూ వస్తోంది. కానీ ఈ నడక ఎంతసేపు ఉండాలి, ఎలా ఉండాలి అన్నదాని మీద ఇప్పటివరకూ ఎవరూ సరైన జవాబు చెప్పలేకపోతున్నారు. రోజుకి 10,000 అడుగులు నడిస్తే మంచిదన్న మాట ఉన్నప్పటికీ... అదేమీ అంత శాస్త్రీయం కాదని కొట్టి పారేస్తున్నారు నిపుణులు. ఈ 10,000 అడుగులు అన్నమాట జపాన్‌లోకి ఒక వాణిజ్య సంస్థ మొదలుపెట్టిన ప్రచారం అని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో వారానికి ఓ రెండు రోజుల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందిలే... మిగతా రోజుల్లో ఆఫీసుకి పోవాలి కదా! అంటున్నారు. మరి నడకకు సంబంధించి లోగుట్టును రట్టు చేసేదెలా!     అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌కు చెందిన ‘అలెన్‌ యూంగ్‌’ అనే కార్డియాలజిస్టుకి ఇదే అనుమానం వచ్చింది. వేలమంది జనాల రోజువారీ కదలికలను క్షుణ్నంగా పరిశీలిస్తే కనుక.... వారి జీవిత విధానం, అందులో భాగంగా వారు ఎంతసేపు నడుస్తున్నారు, ఎలాంటి వ్యాయామం చేస్తున్నారు తెలిసిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల వాళ్ల ఆరోగ్యం ఏమన్నా మెరుగుపడిందా! అన్న విషయమూ బయటపడుతుంది. కానీ ఇందుకోసం వేలమంది జీవితాలను దగ్గరగా పరిశీలించడం ఎలా సాధ్యం?     తన పరిశోధనను ఎలా ముందుకు తీసుకుపోవాలా అని బుర్ర బద్దలుకొట్టుకుంటున్న అలెన్‌కు హఠాత్తుగా ఓ ఉపాయం తోచింది. అప్పటికే యాపిల్‌ సంస్థ విడుదల చేసిన ఒక యాప్‌ గుర్తుకువచ్చింది. మన శరీర కదలికలు ఎలా ఉన్నాయి? మనం ఎంత దూరం నడుస్తున్నాం? అని పసిగట్టగలిగే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమంటూ ఒక పిలుపుని ఇచ్చారు. అలెన్‌. అలెన్ పిలుపునిచ్చిన తొలివారంలోనే దాదాపు 53,000 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతానికి లక్షమంది ఈ యాప్‌ ద్వారా అలెన్‌కు తమ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అలెన్‌కు అందిస్తున్నారు. అందుకే వ్యాయామానికి సంబంధించి అతి పెద్ద పరిశోధనగా ఇది పేరుగాంచింది.     అలెన్‌ మొదలుపెట్టిన ఈ పరిశోధన ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు అందేందుకు కొంత కాలం పట్టక తప్పదు. లక్షమందికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించాలంటే అంత తేలికైన విషయం కాదు కదా! కానీ ఈపాటికే ఈ గణాంకాలు కాస్త భయపెట్టేవిగా ఉంటున్నాయట. మనలో చాలామంది అసలు కదలనే కదలడం లేదంటూ ఈ యాప్ ద్వారా తేలుతోందట. ‘అందులో ఆశ్చర్యం ఏముంది? మన సమయాన్ని పూర్తిగా కూర్చునే గడిపేస్తున్నాం. అటూఇటూ వెళ్లడం మాట అటుంచి, కనీసం లేచి నిలబడేందుకు కూడా ప్రయత్నించడం లేదు’ అంటున్నారు అలెన్. మరి ఈ పరిశోధన ముగిసేసరికి ఇలాంటి భయంకరమైన వాస్తవాలు ఎన్ని బయటపడతాయో! మరైతే ఎంతసేపు నడవాలి? ఎలా నడవాలి? అన్న విషయమై అలెన్‌ తన పరిశోధనని పూర్తి చేసేదాకా మనం ఆగాలా! అమెరికాలోనే సుదీర్ఘ కాలం నడక గురించి అధ్యయనం చేస్తున్న ‘ట్యూడర్‌ లాక్‌’ అనే నిపుణుడి ప్రకారం మనషి రోజుకి కనీసం 8,000 అడుగులన్నా నడిస్తే మంచిది. సాధారణంగా మనిషి ఓ 5,000 అడుగుల వరకు తనకు తెలియకుండానే నడుస్తుంటాడనీ, దానికి మరో 3,000 అడుగులు జోడించేందుకు, ఓ అరగంటపాటు ప్రత్యేకంగా నడకసాగించమని చెబుతున్నారు ట్యూడర్‌. మరి అలెన్‌ పరిశోధన, ట్యూడర్‌ మాటను ఎంతవరకు రుజువు చేస్తుందో చూడాలి. - నిర్జర.

read more
గొంతు నొప్పికి చక్కటి పరిష్కారం..!

చలికాలం వచ్చిందే చాలు అనేక అనారోగ్యసమస్యలు ముసురుకుంటాయి. కరోనా మహ్మమారి వ్యాప్తి కారణంగా ఏ మాత్రం జబులు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించినా భయంతో హస్పిటల్స్ కు పరిగెత్తుతున్నారు. అయితే అన్ని సమస్యలను కరోనా దృష్టిలో చూడటం మంచిది కాదు. ముఖ్యం గొంతు నొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జీర్ణక్రియ అస్తవ్యస్తం కావడంతో కొందరిలో గొంతు ఒరుసుకుపోతుంది. గొంతు వద్ద ఏదో నొక్కుతున్న భావన కలగడం, తెమడ జిగటగా ఉండి బయటికి రావడం కష్టం కావడం, కొండనాలుకలో వాపు కనిపిస్తాయి. ఈ స్థితిలో సల్ఫర్‌, సేఫియా, ఆర్సెనిక్‌ ఆల్బ్‌ం  వంటి మందులు బాగా పనిచేస్తాయి. బ్రయోనియా, పల్సటిల్లా,  మందులు కూడా ఉపయోగించవచ్చు. కొందరిలో జీర్ణాశయ సమస్యల వల్ల గొంతు, గవద బిళ్లలు ఎర్రబారడం, గొంతు ఒరిపిడికి గురికావడంతో పాటు  గొంతు పొడిబారినా దప్పిక అనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో సాయంత్రం వేళ ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. చలివేయడంతో పాటు గొంతులో జిగటగా అంటుకుపోతున్న భావన కలుగుతుంది. ఇలాంటి వారికి పల్సటిల్లా మందు బాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి రాగానే భయపడకుండా గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
మీ వయస్సు 30 ఏండ్లు దాటిందా.. అయితే వీటికి దూరంగా ఉండండి

శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. అయితే మనం తీసుకునే ఆహారం ఆయా వయసులను బట్టి ఉంటుంది. మనిషి జీవితంలో వివిధ దశల్లో ఆహారం మారుతూ ఉంటుంది. పాపాయిగా ఉన్నప్పుడు ఆరునెలల వరకు అమ్మ పాలే ఆహారం. ఆ తర్వాత తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో అలా అలా జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకుంటాం. అయితే యుక్తవయసులో బండలు తిన్నా కరిగించుకునే శక్తి ఉంటుంది అంటారు.కానీ, మూడు పదులు దాటిన తర్వాత కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఎంటో చూద్దాం.. 1. మీగడ పెరుగు : మీగడ పెరుగు, పండ్లను కలిపి తినాలని మీరు అనుకుంటే వాటిని వేరువేరుగానే తినడం మంచిది. షాపుల్లో  రుచికరమైన పెరుగును కొని ఆరోగ్యకరమైన వాటిని తింటున్నామని మీరు అనుకోవచ్చు కానీ అది ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. వీటిలో తరచుగా చక్కెర కలిసి ఉంటుంది. 30 ఏండ్లు నిండిన వాళ్ళు  ఇటువంటి వాటికి  దూరంగా ఉంటేనే మంచిది. 2. సోడా. సోడాలో అధిక మోతాదులో ఫ్రాక్టోల్ కార్న్ సిరఫ్ ఉంటుంది.  ఇది మనుషులు తీసుకునే అతి అనారోగ్యకరమైన పదార్థాల్లో ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైంది కూడా. ఇది డైరెక్టుగా లివర్ లోకి చేరుకొని అక్కడే క్రొవ్వు రూపంలో పేరుకుపోయి ఉండటమే కాకుండా ఆకలిని తగించే హార్మోన్ లెఫ్టిన్ నిరోధానికి కూడా కారణం అవుతుంది. మనుషుల శరీరంలో క్రొవ్వు పెరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం. 3. కృత్రిమ తీపి పదార్థాలు చెక్కరను తగ్గించి వాటిని బదులుగా కృత్రిమ తీపి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని మీరు అనుకోవచ్చు. కానీ అది చాలా పెద్ద పొరపాటు. వాస్తవానికి అటువంటి వాటిని కేవలం రుచి కాపాడేందుకే కలుపుతూ ఉంటారు. అది ఒకరకంగా చెక్కరను తీసుకోవడం కన్నా అతి ప్రమాదకరం. కృత్రిమ తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని  అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీనిని నిర్ధారించడానికి ఇంకా పరిశోధన కొనసాగుతూనే ఉంది. 4. బీర్ ఇది మనుషులు తీసుకున్నే అనారోగ్యకరమైన  మద్యంలో ఒకటి. దీన్ని పులియబెట్టిన ధాన్యాల ద్వారా తయారు చేస్తారు. అంటే ఒకరకంగా ఫంగస్ ను కలిగి ఉంటుంది. ముదురు బీర్ లో ఇంకా ఎక్కువ మోతాదులో ఆకుపచ్చని బూజు ఉంటుంది. ఇది కాకుండా, తాగేవారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచే కొన్ని కార్బోహైడ్రేట్లు ఇందులో ఉంటాయి. 5. నిల్వచేసిన సూప్ లు నిల్వచేసి ఉంచబడినది సూప్‌లు లేదా తయారుచేయబడి ఉన్న ఏ సూప్ లు ఆరోగ్యానికి మంచివి కావు. తయారుచేయబడిన సూప్‌లో చాలా ఎక్కువ మోతాదులో సోడియం ఉంటుంది. ఎందుకంటే వాటిని సంరక్షించే ఏకైక మార్గం అదే కాబట్టి. ఆ ద్రవ పదార్థాలను సంరక్షించేందు కోసం సోడియం మాత్రమే కాకుండా చక్కెరను కూడా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారనే విషయం చాలా మందికి తెలియదు. ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.  కాబట్టి రెడీ టూ  ఈట్ , రెడీ టూ డ్రింగ్ సూప్ లను తీసుకోవద్దని డాక్టర్లు  సూచిస్తున్నారు. 6. మైదా పిండి : మైదా పిండి ఆరోగ్యకరమైనదే అనుకుంటారు. దాని వినియోగం చాలా సాధారణం అయిపోయింది.  ప్రతి ఒక్కరూ దీనిని వినియోగిస్తున్నారు. 30 ఏండ్ల వయసు తర్వాత దీన్ని ఉపయోగించడం మానేయాలి. ఇది వృద్ధాప్యా లక్షణాలు తర్వతగా కనిపించే  రసాయన ఏజెంట్‌గా పనిచేస్తుంది.  కాబట్టి  వృధ్యాప్యాన్ని కొనితెచ్చుకోకూడదు అనుకునే వాళ్ళు  30 ఏండ్లు దాటాక దీన్ని మానివేయడం మంచిది. 7. సొయా ఇది జన్యుపరంగా చాలా మార్పులు చేయబడింది. ఇది థైరాయిడ్ అసమతుల్యకు దారితీసేందుకు దోహదపడటమే కాకుండా ఇది శరీరంలో మంటను పెంచుతుంది. ఈ సోయాలో మొక్కల ఆధారిత ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉన్నాయని సెంటర్ స్టేట్ కు చెందిన డాక్టర్ ప్రూడెన్స్  హాల్ బృందం నిర్ధారించారు. అది శరీరంలోకి ప్రవేశించి థైరాయిడ్ పెంచేందుకు దారి తీస్తుంది. ఒక వేళ మీరు ఇప్పటికీ థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటుంటే వీటిని తీసుకోవడం మానేస్తేనే మంచిది. 8. ప్రాసెస్డ్ మీట్ శుద్దిచేసిన మాంసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం ప్రమాదకరం. ఇలా ప్రాసెస్ చేసిన మాంసంలో అధిక మోతాదులో సోడియం, క్రొవ్వు ఉంటుంది. ఇది రుచికరంగా బాగుంటుందని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే  హైపర్ టెన్షన్ కు గురికావడమే కాకుండా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇతర సమస్యలతో పాటు గుండెకు కూడా ప్రమాదకరం. 9. బాగెల్స్ రుచికరమైన బాగెల్స్  తినడాన్ని ఎవరు ఆపలేరు. అది రుచిపరంగా బాగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో సుమారుగా 250 కాలరీలు ఉన్నప్పటికీ పోషకాలు, పీచుపదార్థాలు ఉండవు. గోధుమ పిండితో తయారు చేసిన బాగెల్ తీసుకుంటున్నప్పటికీ అందులో  575 మి.గ్రా సోడియం  కలిసి ఉంటుంది. అది ఒక రకంగా రోజంతా తీసుకోవాల్సిన ఉప్పును కేవలం ఒక్క స్నాక్ లో తీసుకుంటున్నారని అర్థం. సో, మీరు మూడు పదుల వయసు దాటిన వారైతే మీరు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.. జివ్వ రుచి కన్నా జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అన్న విషయం గుర్తుంచుకోవాలి.

read more
గుప్పెడు గింజలతో బోలెడు ఆరోగ్యం

ఎర్రగా, చూడగానే నాలుగు గింజలు నోట్లో వేసుకునేలా ఊరించే దానిమ్మలో మన ఆరోగ్యానికి పనికివచ్చే ఎన్నో పోషకాలు వున్నాయి. దానిమ్మ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో తెలుసా?... నోటి పూతగా వుంటే ఒక దానిమ్మని వలచి గుప్పెడు గింజలు నోట్లో వేసుకోండి చాలు. దానిమ్మలోని యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి.  ఆడవారు నెలసరి రోజుల్లో దానిమ్మని తింటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆ సమయంలో వుండే ఇతర శారీరక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇవేకాదు.. దానిమ్మని రోజూ తినడం అలవాటుగా చేసుకుంటే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. అలాగే దీనిని సహజ యాస్పిరిన్ అనచ్చు. ఎందుకంటే రక్త సరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. రోజుకి పావు కప్పు దానిమ్మరసం చాలు గుండె భద్రంగా వుండటానికి. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలామంచిది.  ఆస్టియో ఆర్ద్రస్టియస్‌తో బాధపడేవారు రోజూ దానిమ్మ తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. వయసు పెరిగేకొద్దీ ఏర్పడే చర్మం ముడతలను నివారించే గుణం కలిగిన దానిమ్మ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది కూడా. దీనిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది. రుచిగా, చూడగానే తినాలనిపించే దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిశాక తినకుండా వుంటామా! రోజూ తప్పకుండా గుప్పెడు గింజలని నోట్లో వేసుకుందాం. ఆరోగ్యంగా వుందాం.   -రమ 

read more
పిండివంటల్ని బెల్లంతోనే ఎందుకు చేస్తాం!

  పండుగ వస్తోందంటే చాలు... మనకి పూజలు, పిండివంటలే గుర్తుకువస్తాయి. పూజల సంగతి పక్కనపెడితే, పిండివంటల వెనకాల కూడా బోలెడు ఆరోగ్య రహస్యాలు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా ఉగాది పచ్చడిలో భాగంగా మనం పుచ్చుకునే బెల్లం గురించి కొన్ని విశేషాలు ఇవిగో....   జీర్ణశక్తికి - బెల్లపు రుచికి, క్షారగుణానికీ జీర్ణరసాలు ఎక్కువగా ఊరతాయి. వీటి వల్ల అంతకుముందు తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమైపోతుంది. అందుకనే భుక్తాయాసంగా ఉన్నప్పుడు ఒక పలుకు బెల్లం తినమని చెబుతూ ఉంటారు పెద్దలు.   కావల్సినన్ని ఖనిజాలు - చెరుకుగడలోని పోషపపదార్థాలన్నీ కూడా పంచదారలోకి వచ్చేసరికి మాయమైపోతాయి. పంచదార తెల్లగా, శుభ్రంగా కనిపించడం కోసం దానిలో ఉపయోగపడే పదార్థాలన్నింటిని తొలగించి పారేస్తారు. కానీ బెల్లంలో మాత్రం అలా కాదు. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా కనిపిస్తాయి.    రక్తహీనత బలాదూర్‌- బెల్లంలో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత సమస్య దూరమైపోతుంది. అందుకనే గర్భిణీ స్త్రీలనీ, బాలింతలనీ బెల్లం తినమని చెబుతుంటారు. 50 గ్రాముల బెల్లం తిన్నా కూడా మనకు రోజువారీ అవసరమయ్యే ఇనుములో చాలావంతు శరీరానికి అందుతుంది.   కాలేయం శుద్ధి - మన శరీరంలో పేరుకున్న కల్మషాలన్నింటినీ బెల్లం బయటకు పంపేస్తుందట. కాలేయం వంటి అవయవాన్ని కూడా శుద్ధి చేసే ప్రభావం బెల్లానికి ఉందని చెబుతారు. కాలేయం శుభ్రంగా ఉంటే శరీరానికి వచ్చే సగం సమస్యలు తీరిపోయినట్లే!   రుతుసమస్యలు - మహిళల రుతుసమస్యల గురించి ఎంత చెప్పుకున్నా వేదన తీరదు. ముఖ్యంగా రుతుక్రమం సమయంలో నిస్సత్తువగా ఉండటం, కండరాలు లాగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లం తినడం వల్ల నిస్సత్తువ ఎలాగూ తగ్గుతుంది. ఇక బెల్లంతో శరీరంలో ఎండోమార్ఫిన్స్‌ అనే హార్మోన్లు ఉత్తేజితం అవుతాయట. వీటివల్ల మనసు కూడా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు.   ఒంటికి చల్లదనం - బెల్లపు నీరు వల్ల ఒంట్లోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పకుండా ఉంటాయట. వేసవిలో బెల్లంతో చేసిన పానకంతో కడుపు చల్లగా ఉంటుంది. అందుకనే కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకించి బెల్లపు షర్‌బత్‌ చేసుకుని తాగుతారు. మనకా అవసరం లేకుండా శ్రీరామనవమి సందర్భంగా కావల్సినంత బెల్లపు పానకం వాడవాడలా దొరుకుతుంది.   కావల్సినంత శక్తి - పంచదార ఒక కృత్రిమ పదార్థం. దాని వల్ల పంచదారలోని చక్కెరలు ఒక్కసారిగా రక్తంలోకి కలిసిపోయి షుగర్‌ స్థాయి ఆసాంతం పెరిగిపోతుంది. కానీ బెల్లం అలా కాదు. అందులోని చక్కెరలు నిదానంగా రక్తంలోకి కలుస్తూ కావల్సినంత శక్తిని అందిస్తాయి. దాని వల్ల ఒంటికి నిరంతరం శక్తి లభిస్తూ ఉంటుంది.   కీళ్లసమస్యలకి ఉపశమనం - కీళ్లనొప్పులు, బెణుకులు, వాపులని నివారించడంలో బెల్లం గొప్ప పాత్ర పోషిస్తుంది. నాలుగు నుంచి ఆరువారాలపాటు రోజు కాస్త బెల్లాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులకి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.   ఇప్పుడంటే ఇంట్లోకి రకరకాల తినుబండారాలు బయటనుంచే తెచ్చకొంటున్నాము. కానీ ఒకప్పుడు నువ్వులు, బెల్లంతో చేసిన పాకమే ఇంటింటా కనిపించేది. పిల్లలకి ఇలాంటి నువ్వుల ఉండని పెట్టడం వల్ల... వారికి తగినంత శక్తి ఎలాగూ లభిస్తుంది. దాంతోపాటుగా చిన్నతనంలో వారిని వేధించే శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుందట!!!   చెప్పుకొంటూ పోతే బెల్లం వల్ల చేకూరే ప్రయోజనాల చిట్టా చేంతాడంత తేలుతుంది. అవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి... పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరం అన్న విషయం గుర్తెరిగితే చాలు.   - నిర్జర.

read more
కషాయాలు ఎందుకు.. మిరియాలు.. లవంగాల్లో ఏముంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఎన్నో ఇంటి చిట్కాలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ ప్రధాని సైతం కషాయాలతో కరోనాను తరిమి కొట్టవచ్చని చెప్పారు. పక్కింటివారు చెప్పినా.. ప్రధాని చెప్పినా వాటిలో మనకు కామన్ గా కనిపించేవి మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్క, శొంఠి, లవంగాలు. వీటి కాంబినేషన్ తో తయారు చేసే కొన్ని రకాల కషాయాలు కరోనా మన దరికి రాకుండా తరిమికొడతాయి అని చెప్తున్నారు. మరి ఇంతకీ వీటిలో ఏముంది? వీటిని ఎందుకు ఔషధాలుగా మనం చెప్పవచ్చు. అది తెలుసుకోవాలంటే మనం మన సాంప్రదాయ ఆహార పద్ధతులలో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకోవాల్సిందే... క్రీస్తు పూర్వం  2000 కన్నా ముందు బంగారం కన్న గొప్ప విలువ సంపదగా సుగంధ ద్రవ్యాలను భావించేవారు.  దాల్చిన చెక్క, నల్ల మిరియాల తదితర దినుసుల  వాణిజ్యం ద్వారా ఆయా దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించేవి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సుగంధద్రవ్యాల్లో 70శాతం మన దేశంలోనే పండుతాయి. వీటిని పండించే రాష్ట్రాల్లో కేరళదే అగ్రస్థానం.  క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలవబడే నల్ల మిరియాలను మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికే కాదు ఔషధంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మిరియాలను వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. సుగంధ ద్రవ్యాలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.. అందుకు కారణం వాటిలో ఉండే  ఆక్సిజన్ రాడికల్ అబ్సర్వేషన్ కెపాసిటీ. దీన్నే మనం ఓఆర్ఏసి గా పేర్కొంటారు జింజర్, తులసి, పసుపు మొదలైనవాటిలో ఓఆర్ఏసి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  విటమిన్ సి, ఒమేగా త్రీ, విటమిన్ డి వంటి సూక్ష్మ పోషకాలను మనం తీసుకున్న ఆహారం నుంచి  శరీరం గ్రహించడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి.

read more
శరీర బరువు ఎక్కువయినా ప్రమాదమే...!

వయసు పెరుగుతున్నా కొద్దీ ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వాటిలో ఎక్కువ శాతం ఇబ్బంది పెట్టే సమస్య కీళ్ల నొప్పులు. పెరిగే వయసుతో పాటు మోకాళ్ళ అరుగుదలా పెరుగుతుంది. అయితే, మోకీళ్లు ఎక్కవ కాలం దృఢంగా ఉండాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు పెరిగే కొద్దీ కీళ్ల మీద ఒత్తిడి పెరిగి, మృదులాస్థి పలుచనై, కీళ్లు ఒకదానికొకటి రాసుకోవడం మొదలవుతుంది. ప్రారంభంలో నొప్పి తగ్గించే మందులు, మృదులాస్థిని పరిరక్షించే మందులు వాడవలసి ఉంటుంది. రెండు, మూడు దశలు దాటి, కీళ్లు ఒరిపిడికి గురయ్యే నాలుగో దశ వచ్చిందంటే మాత్రం మోకాలి మార్పిడి చేయక తప్పదు. కాబట్టి  శరీర బరువును అదుపులో ఉంచుకుంటూ మోకాలి కండరాలు, లిగమెంట్లను బలపరిచే క్వాడ్రాసెప్స్‌, హ్యామ్‌స్ట్రింగ్స్‌ తరహా వ్యాయామాలు చేస్తూ ఉండాలి.

read more
వెన్న పూస్తున్నారా బాబూ!

రోజులు మారిపోతున్నాయి. రోజులతో పాటుగా అలవాట్లూ మారిపోతున్నాయి. కాస్త ఆకలి వేసినప్పుడు ఇడ్లీలో, పకోడీలో తినే పరిస్థితి దాటిపోయి... బ్రెడ్డు మీద వెన్న రాసుకునే అలవాటు మొదలైంది. కానీ ఇలా దేని మీద పడితే దాని మీద వెన్నని రాస్తే ఆకలి తీరడం మాట అటుంచి అనారోగ్యం పాలవుతామని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వెన్న భారతీయులకి కొత్తేమీ కాదు. మన రోజువారీ జీవితంలో పాలు, వెన్న, నెయ్యి శుభ్రంగా కలిసిపోయాయి. ఈ పదార్థాలు లేనిదే మన ఆహారాన్ని ఊహించుకోవడమే కష్టం. కానీ కొద్ది రోజులుగా వెన్న మీద పరిశోధకుల కన్ను పడింది. ఇందులో ఉండే విపరీతమైన కొవ్వు వల్ల గుండెపోటు, చక్కెర వంటి సమస్యలు ఏర్పడతాయంటూ హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇలాంటి మాటలు విన్న భారతీయులు కూడా అనాదిగా వస్తున్న తమ అలవాట్లలో లోపం ఏదన్నా ఉందేమో అని భయపడి అసలు వెన్నకే దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు వెన్న జోలికే పోవడం మానుకున్నారు. నిజానికి ఆయుర్వేదం ప్రకారం వెన్నకి అద్భుతమైన గుణాలెన్నో ఉన్నాయి. ఆకలిని పెంచడంలోనూ, వాతపిత్త దోషాలను నివారించడంలోనూ, జీర్ణవ్యవస్థని మెరుగుపరచడంలోనూ, శక్తిని అందించడంలోనూ... వెన్నకు తిరుగులేదంటారు ఆయుర్వేద నిపుణులు. ఇక పిల్లలపాలిట అయితే ఇది అమృతంలా పనిచేస్తుందట. మరి అలాంటి వెన్నకి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారేంటా అని జనం సందిగ్థంలో పడిపోయారు. కానీ బోస్టనుకు చెందిన డా॥లారా చేసిన ఒక పరిశోధనతో అసలు విషయం బయటపడింది. వెన్నకీ గుండెజబ్బులు, చక్కెర వంటి వ్యాధులకీ పెద్దగా సంబంధం లేదని తేల్చిపారేశారు లారా. నేరం వెన్నది కాదనీ, దాంతో పాటుగా పుచ్చుకునే బ్రెడ్‌, బంగాళదుంపలు వంటి పదార్థాలదే అంటున్నారు ఈ పరిశోధకురాలు. దేని మీద పడితే దాని మీద వెన్నని పూసేసుకొని, ఆ తరువాత వచ్చే అనారోగ్యాలకు వెన్నను దోషిగా నిలబెట్టడం మంచిది కాదంటున్నారు. లారా తన పరిశోధన కోసం దాదాపు ఆరు లక్షలమంది ఆరోగ్యవిధానాలను నిశితంగా పరిశీలించారు. అదీ విషయం! రోజుకి కాస్తో కూస్తో వెన్నని మితంగా పుచ్చుకోవడంలో తప్పులేదనీ... అయితే ఆ వెన్నని దేని మీద పూస్తున్నారో కూడా గమనించుకోవాలని ఈ పరిశోధనతో తేలుతోంది. పైగా వెన్న పేరుతో బయట లభించే కృత్రిమ వెన్న (margarine) పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కృత్రిమ వెన్నని తయారుచేసేందుకు రకరకాల నూనె పదార్థాలని ఉపయోగిస్తారనీ, ఇవి శరీరంలోనే పేరుకుపోతాయని చెబుతున్నారు. అచ్చు వెన్నలాగే ఉండే ఈ margarineని బేకరీలలో విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు. సహజమైన వెన్నని చూసి భయపడేకంటే ఇలాంటి కృత్రిమ పదార్థాలకు, బేకరీ ఆహారాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.

read more
16/8 డైట్‌ అంటే ఏంటి?

  ఇప్పుడు ఎవర్ని చూసినా ఒబెసిటీతోనే బాధపడుతున్నారు. దాంతో పాటే వచ్చే డయాబెటిస్‌, గుండెపోటులాంటి సమస్యలూ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. శరీర శ్రమ లేని లైఫ్‌ స్టైల్‌, ఏదిపడితే అది ఎడాపెడా తినేయడం మన ఒబెసిటీకి కారణం అని చిన్నిపిల్లాడికి కూడా తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. అందుకే దీన్ని నివారించడానికి అప్పుడప్పుడూ రకరకాల చిట్కాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటైన 16/8 డైట్‌ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. ఆ 16/8 డైట్‌ కథ ఏంటో మీరే చూడండి...   ఒకప్పుడు తిండి తినడానికి కూడా సమయం ఉండేది. రాత్రి చీకటిపడేలోగా తినేసి పక్కల మీదకి చేరేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు! పొద్దన్న ఆరింటికి మొదలుపెడితే రాత్రి పదకొండు గంటల వరకూ పొట్టలో ఏదో ఒకటి పడుతూ ఉండాల్సిందే! దీనికి విరుగుడుగానే 16/8 డైట్‌ని కనిపెట్టారు. ఇది పాటించేవాళ్లు రోజులో 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. మిగతా 16 గంటలూ కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు మన తిండి అంతా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల లోపే ముగించేయాలి. మర్నాడు ఉదయం పదిగంటల వరకూ ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. మిగతా సమయంలో శరీరం నీరసించిపోకుండా ఉండేందుకు షుగర్‌ ఉండని లిక్విడ్స్ (నీళ్లు, బ్లాక్‌ టీ, నిమ్మరసం...) తీసుకోవచ్చు.   ఈ 16/8 డైట్‌లో మిగతా 16 గంటలూ ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరం ఒంట్లో పేరుకున్న కొవ్వుని కరిగించడం మొదలుపెడుతుంది. ఓ మూడు నెలల పాటు ఈ పద్ధతిని పాటించినవాళ్లలో ఒబెసిటీ తగ్గినట్లు, బీపీ కూడా అదుపులో ఉన్నట్లు తేలింది.   వినడానికి ఈ పద్ధతి బాగానే ఉంది. పాటించడానికి తేలికగా కూడా ఉంది. కానీ ఎవరు పడితే వాళ్లు ఈ డైట్‌ ఫాలో అయ్యేందుకు సిద్ధపడితే మాత్రం ప్రమాదం తప్పదు. షుగర్‌, గ్యాస్ట్రిక్‌ లాంటి సమస్యలు ఉన్నవారు దీని జోలికి పోకపోవడమే బెటర్‌. ఏదన్నా తిని మందులు వేసుకోవాల్సినవాళ్లు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకి కూడా ఈ పద్ధతి సరిపడదని చెబుతున్నారు. మిగతావాళ్లు మాత్రం అలా ఓసారి ఈ పద్ధతిని పాటించి చూడవచ్చునట. మరెందుకాలస్యం... ఓ రాయి వేయండి. ఏమో ఎవరికి తెలుసు- ఏ పుట్టలో ఏ రాయి ఉందో!  https://www.youtube.com/watch?v=UFOfu35n7l8 - నిర్జర.  

read more
డీఎన్‌ఏలో మార్పుతో రోగాలన్నీ దూరం

ఇప్పుడు శరీరానికి కూడా కావల్సినన్ని మరమ్మతులు చేయవచ్చునని ఓ పరిశోధన రుజువు చేస్తోంది.   డీఎన్‌ఏ ఎడిటింగ్‌ మన శరీరంలో ప్రతి కణాన్నీ కూడా అందులో ఉండే డీఎన్ఏ శాసిస్తుందనే విషయం తెలిసిందే! కాబట్టి ఏదన్నా అవయవం దెబ్బతిన్నదంటే ఆ అవయవ నిర్మాణంలో ముఖ్యమైన డీఎన్‌ఏ కూడా దెబ్బతిన్నట్లు లెక్క. అందుకనే ఒక వ్యక్తి డీఎన్ఏలో తగిన మార్పులు చేయడం ద్వారా అతనికి మళ్లీ ఆరోగ్యాన్ని కలిగించే ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అందులో ఓ ముఖ్యమైన ప్రయత్నమే డీఎన్‌ఏ ఎడిటింగ్. ఇందులో ఇప్పటికే Crispr-Cas9 అనే తరహా చికిత్స దాదాపు అందుబాటులోకి వచ్చేసింది. చైనా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని ఉపయోగించి క్యాన్సర్‌ను సైతం నయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. Crispr-Cas9 చికిత్సలో భాగంగా కొన్ని మార్పులు చేసిన కణాలను శరీరంలోకి ప్రవేశపెడతారు. అవి డీఎన్ఏలోని హానికారకమైన భాగాలను తొలగించే కత్తెరలా ఉపయోగపడతాయట. మొండి క్యాన్సర్లను సైతం నిర్మూలించడంలో ఈ ప్రక్రియ అమోఘంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.   మరో అడుగు చైనా శాస్త్రవేత్తలు కృషి ఇలా ఉండగా, మరో పక్క అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు అసలు ఏకంగా డీఎన్‌ఏలో తెగిపోయిన భాగాలను అతికించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఈ విధానం కేవలం చర్మం, జీర్ణవ్యవస్థ వంటి చిన్ని చిన్న అవయవాలకే పరిమితం అయ్యేది. ఎందుకంటే అక్కడి కణాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. కానీ మెదడు, కళ్లు, కాలేయం, గుండె వంటి అవయవాలు దెబ్బతింటే వాటిలోని డీఎన్ఏ మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టం. అందుకోసం ఇప్పుడు  అమెరికాకు చెందిన పరిశోధకులు మరో తరహా డీఎన్‌ఏ ఎడిటింగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదన్నా ముఖ్యమైన అవయవం దెబ్బతింటే, అందులోని డీఎన్ఏను మళ్లీ సరిదిద్దేందుకు, డీఎన్‌ఏల మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి సరిచేసేందుకు రోగి శరీరంలోకి సరికొత్త కణాలను ప్రవేశపెడతారు. ఈ తరహా చికిత్సను HITI టెక్నాలజీ అంటున్నారు.   ఫలితాలు మొదలయ్యాయి HITI టెక్నాలజీ ద్వారా ఇప్పటికే అంధత్వం వచ్చిన ఎలుకలలో మళ్లీ చూపుని తీసుకువచ్చారు. మున్ముందు ఈ సాంకేతికను మరింత అభివృద్ధి చేయగలిగితే ఎలాంటి రోగాన్నైనా నివారించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, మనలో వృద్ధాప్యం వచ్చేందుకు డీఎన్ఏలో వచ్చే మార్పులే కారణం కదా! కాబట్టి, డీఎన్‌ఏలో తగిన మార్పుని తీసుకురావడం ద్వారా వృద్ధాప్యాన్ని కూడా వాయిదా వేయవచ్చునంటున్నారు.   - నిర్జర.

read more
A WALK TOWARDS GOOD HEALTH!

vamana avatar story,vamana jayanti,Vamana Jayanti 2019,Vaman Jayanti Festival, Vaman Dwadashi ,vamana avatar,vamana avatar story in telugu So what can we do to stay healthy? Walking! It may sound like a simple activity but it will take care of your body like you never dis before. To start with a walk for a good amount of time can keep your heart away from the bad cholesterol [LDL] and increases the good one [HDL]. Spend 30 minutes in this activity and stay away from high blood pressure by 27%Walking also keeps diabetes at bay. This is the claim of the British Medical Journal. If you are a habitual walker you reduce your risk of colon, breast or womb cancer by 20%. This is definitely an easy way to live longer. An obvious advantage walking everyday is that you can stay in shape, with the least effort. A person who weighs 60 kilos burns 75 calories simply by walking. What can be a better motivation to get you to walk? But if you still think you need a motivating factor to walk, find a walking partner or take your pet out. This way you will have a change from your routine while getting some ‘’me time’’. Dementia and osteoporosis are a few among many problems you can avoid just by walking. Walking benefits your arms too! You may not realize it, but each time you swing your arms rhythmically you tone your arms, shoulders and upper back. Your walking time can also help you get some vitamin D. Walking in the sun will give your body this essential vitamin. Many people in UK are deficient of this nutrient because of lack of exposure to sunlight. You don’t let this happen to yourself, okay?

read more
ఇవి తింటే క్యాన్సర్‌ని ఆహ్వానించినట్టే!

చిన్నా పెద్దా ధనిక పేదా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కనికరం లేకుండా కబళిస్తోన్న వ్యాధి క్యాన్సర్. దీన్ని అరికట్టడం చేతకాక ప్రపంచం దేశాలన్నీ పరిశోధనల్లో మునిగి తేలుతున్నాయి. ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కాని మహమ్మారి క్యాన్సర్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల జోకిలి పోకుండా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు అన్నది మాత్రం సత్యం.    బిస్కట్లు, కేకులు వంటి వాటి దగ్గర్నుంచి బొబ్బట్లు వంటి సంప్రదాయ వంటకాలన్నిటికీ ప్రధాన దినుసు మైదాపిండి. ఇది పాంక్రియాస్ మీద తీవ్ర ఒత్తిడి కలిగించి ఇన్సులిన్ లెవెల్స్ ని అస్తవ్యస్తం చేస్తుంది. అదే విధంగా చక్కెర కూడా ఎక్కువ తీసుకోకూడదు. స్థూలకాయం, మధుమేహాలకు కారణమయ్యే చక్కెర పాంక్రియాస్, కాలేయాలతో పాటు జీర్ణవ్యవస్థను కూడా పాడు చేస్తుంది. అందుకే పండ్లు, తేనె వంటి వాటి ద్వారా అందే సహజ చక్కెర తప్ప నేరుగా చక్కెరను తీసుకోవడం మంచిది కాదు.    పాలు తాగితే ఎముకలు గట్టి పడతాయని అందరూ అంటారు. అయితే వయసు పెరిగేకొద్దీ పాలలో ఉండే ల్యాక్టోజ్ ను అరాయించుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వయసు పెరిగేకొద్దీ పాలు మోతాదు దాటి తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ప్యాట్రిక్ హాఫార్డ్.    వీటితో పాటు సరిగ్గా ఉడికించకుండా క్షణాల్లో తయారుచేసే జంక్ ఫుడ్... చక్కెరతో పాటు కెమికల్స్ ఎక్కువగా ఉండే సోడాలు...  మైదా, పాలు, చక్కెర కలిపి తయారు చేసే డోనట్స్ కూడా  ఎంతో కీడు చేస్తాయి. ఒకేసారి పది చెంచాల చక్కెరని కడుపులోకి పంపించే ఏ ఆహార పదార్థమైనా ప్రమాదకరమేనంటారు న్యూయార్క్ టైమ్స్ సృష్టికర్త, ప్రముఖ వైద్యులు అయిన డాక్టర్ జోసెఫ్ మెర్కోలా.   ఇక సోడియం, నైట్రేట్ ఎక్కువగా ఉండే మాంస పదార్థాలని ముట్టవద్దనేది అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ సూచన. ఉప్పు ఎక్కువ వేసి, నూనెలో వేయించే బంగాళాదుంప చిప్స్ జోలికి పోవద్దంటున్నారు మసాచుసెట్స్ లోని క్లార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ డేల్ హ్యాటిస్. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తరచుగా తీసుకుంటే ఉదర క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని 2005లొ క్యాన్సర్ సైన్స్ మ్యాగజైన్ చేసిన పరిశోధనలో సైతం వెల్లడైంది. అదే విధంగా క్యాన్స్ లో నిల్వ చేసి అమ్మే ఆహార పదార్థాలు,  మార్గరీన్ చీజ్ వంటివి కూడా ఎక్కువ తీసుకోకూడదనేది నిపుణుల సూచన.   కాబట్టి వీలైనంత వరకూ వీటి జోలికి పోకుండా జాగ్రత్తపడండి. క్యాన్సర్ ని మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకోండి.  - sameeranj

read more
కడుపులో మంటగా ఉంటే....?

చాలామంది ఉన్నట్లుండి కడుపులో మంట పుడుతోందంటూ కుర్చీలో అలాగే వాలిపోతుంటారు. దీనికి అసిడిటీయే కారణం. అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే... 1. సరిగా నిద్ర లేకపోవడం. 2. ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం. 3. ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం. 4. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం. 5. ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. రుచిగా ఉందని ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా జరుగదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది. 6. సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు. అసిడిటీ మరియు గుండెల్లో మంటను అదుపు చేసేందుకు కొన్ని చిట్కాలు : 1. అసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 2. ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడిన ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. 3. యాపిల్ పండు రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది 4. పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. 5. తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. 6. ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. భోజనం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించకండి. 7. మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి. 8. తులసి ఆకులను ఉదయంపూట తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

read more
ఇలా చేస్తే కేన్సర్ పరార్!

కేన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. దీని నివారణకు ఎన్ని కొత్త మందులు వచ్చినా దాన్ని అదుపు చేయడం కష్టమైనపనే అవుతోంది. ఈ సమయంలో వెల్లుల్లి కేన్సర్‌ని అడ్డుకుంటుందన్న విషయం తాజా పరిశోధనలో తేలింది. వెల్లుల్లికి 14 రకాల కేన్సర్లను మరెన్నో ఇతర జబ్బులు రాకుండా చేసే శక్తి ఉందని అమెరికా ఇనిస్టిట్యూట్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. కేన్సర్ పేషెంట్లు రోజుకు ఐదు లేదా ఆరు దంచిన వెల్లుల్లి రెమ్మలు తినాలని వారు సూచిస్తున్నారు. వీటిని వెంట వెంటనే తినకూడదట. ఒక్కో రెమ్మను 15 నిమిషాల వ్యవధి ఇచ్చి తినాలట. ఈ 15 నిమిషాల్లో వెల్లుల్లి రెమ్మల నుంచి అలినేస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ కేన్సర్ తత్వాలు ఉంటాయి. ఇవి కేన్సర్‌ని నిరోధించడమే కాకుండా 166 రకాల జబ్బులు రాకుండా అడ్డుకుంటాయనీ పరిశోధకులు అంటున్నారు. అయితే వెల్లుల్లి కేన్సర్‌ను నివారించలేదనీ, దాన్ని అడ్డుకుంటుందని మాత్రమే వారు స్పష్టం చేస్తున్నారు.

read more
ప్లాస్మా ఎవరి నుంచి సేకరించాలి.?

కోవిడ్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పట్లో అందరికీ అందుబాటులోకి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. దాంతో కరోనా సోకిన వారికి ప్లాస్మా చికిత్సను అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు వైద్యులు. కరోనా సోకి తగ్గిపోయిన వారి నుంచి సేకరించే ప్లాస్మాతో మరికొంతమందికి మెరుగైన చికిత్స అందించ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరీ కరోనా నుంచి బయటపడిన వారంతా ప్లాస్మా ఇవ్వవచ్చునా అంటే కాదనే చెప్పాలి.    ప్లాస్మాను అందరి నుంచి తీసుకోవటం కుదరదు. దీనికి పరిమితులున్నాయి. కరోనా జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నవారే ప్లాస్మాను ఇవ్వటానికి అర్హులు. కోలుకోవటానికి ముందు రెండు సార్లు వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యిండాలి. అలాగే 28 రోజుల తర్వాత కూడా జబ్బు లక్షణాలేవీ ఉండకూడదు. రక్తంలో హిమోగ్లొబిన్‌ 12.5శాతం కన్నా ఎక్కువగా , శరీర బరువు 55 కిలోల కన్నా ఎక్కువగా ఉండాలి. 18-50 ఏళ్ల మధ్యలో ఉన్నవారి నుంచే ప్లాస్మాను సేకరించాల్సి ఉంటుంది. వీరికి గుండె వేగం, రక్తపోటు వంటివన్నీ మామూలుగా ఉండాలి. రక్తం ద్వారా సంక్రమించే హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ వంటి జబ్బులేవీ ఉండకూడదు. రక్తం గ్రూపులూ ఒకటే అయ్యిండాలి. ఇవన్నీ సరిపోయిన వారి నుంచే ప్లాస్మాను తీసుకుంటారు. యాంటీబాడీల సంఖ్య ఎక్కువగా ఉండటమూ ముఖ్యమే. మహిళల విషయంలో- గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరు నెలల లోపు అబార్షన్లు అయినవారు ప్లాస్మా ఇవ్వటానికి అర్హులు కారు.   ఒక వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాతో ఇద్దరికి వైద్యం అందించవచ్చు. అలాగే ఒక వ్యక్తి ఏడాది కాలంలో 24సార్లు ప్లాస్మా ఇవ్వవచ్చు. అంటే 15రోజులకు ఒకసారి ప్లాస్మా దానం చేయవచ్చు. ఇలా చేస్తే ఒక వ్యక్తి ద్వారా 48మంది ప్రాణాలను కాపాడే వీలు ఉంటుంది. అయితే ప్లాస్మా దానం చేసే వ్యక్తి సరైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్నికాపాడుకోవాలి.

read more