What Do You Fear?

We all have our own fears. Some of us fear animals, others fear blood and yet others fear being in closed places. We know the names of all these phobias. In this article you will discover a new verity fears, which you have probably never heard of. This could be because people in general are not encouraged to freely speak about their fears.    Have you heard of Philophobia before? It is the fear of falling in love. Strange, isn’t it? Although rare, this phobia has a damaging impact on a person’s life causing him or her to live a lonely life. Such people tend to cut off from the society. They fear human association so much that falling in love is impossible for them. Any alteration in their isolated situation, makes the world a living hell for them.   What comes to your mind when I say flower? Most of us may say a breath of fresh air, good fragrance or beautiful flowers. But for some, it is nothing less than a nightmare. The fear of flowers is called Anthophobia. People with anthophobia experience extreme anxiety at the sight or even the smell of flowers although they know flowers can do no harm to them. Mirror mirror on the wall, do you see anything pretty at all? There are people who fear mirrors. Their condition is called Spectrophobia. People suffering from this condition that looking into the mirror will either break it into pieces, or something will jump out of it or it will suck the person inside. It is said that such a fear develops after a traumatic incident or after watching a horror movie.   There are many strange things that can happen to person. There are people who are scared of little children. People with pedophobia, as it is called, experience anxiety even at the thought of babies. They dread watching, playing with or carrying them. So, we saw how normal things are not so normal after all. What is normal for you may not be normal for others. What scares you the most?   ..Kruti Beesam  

read more
చదువుకీ గుండెపోటుకీ సంబంధం ఉంది!

  బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది! అని చెబుతుంటారు తల్లిదండ్రులు. మంచిగా చదువుకుంటే నలుగురూ గౌరవిస్తారు అని హెచ్చరిస్తుంటారు శ్రేయోభిలాషులు. చదువుకుంటే విచక్షణ, విజ్ఞానం అలవడతాయి అని ఊరిస్తుంటారు పెద్దలు. కానీ బాగా చదువుకోండి నాయనా, మీకు గుండెపోటు రాకుండా ఉంటుంది అని చెబుతున్నారు పరిశోధకులు.   భారీ పరిశోధన ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశమే కావచ్చు. కానీ అక్కడ గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందట. అక్కడ ప్రతి 27 నిమిషాలకీ ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. పరిస్థితి ఇలా అదుపు తప్పిపోవడంతో, గుండె ఆరోగ్యానికి సంబంధించి అక్కడ ఓ భారీ పరిశోధన మొదలైంది. ఇందులో భాగంగా 2,67,153 మంది ఆరోగ్యాలను పరిశోధకులు గమనించారు. వీరంతా కూడా 45 నుంచి 64 ఏళ్ల వయసువారే!   డిగ్రీ - గుండెపోటు డిగ్రీ చదివినవారితో పోలిస్తే, హైస్కూలుతో చదువుని ఆపేసినవారు గుండెపోటుకి లోనయ్యే ప్రమాదం ఎక్కువని పరిశోధనలో తేలింది. వీరు గుండెపోటుకి లోనయ్యే అవకాశం, ఏకంగా 150 శాతం ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఇక ఇంటర్మీడియట్‌ చదువుని ముగించినవారేమో దాదాపు 70 శాతం ఎక్కువగా గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు.   ఇవీ విశ్లేషణలు చదువుకీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా తేలిపోవడంతో... అందుకు కారణం ఏమిటన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటంతో పోషకాహారాన్ని, మెరుగైన వైద్యాన్ని స్వీకరించే అవకాశం ఉంది. ఇక చదువు వల్ల ఆరోగ్యపు అలవాట్ల మీద, రకరకాల వ్యాధుల మీదా ఓ అవగాహన ఏర్పడే సౌలభ్యం ఎలాగూ ఉంటుంది.   ప్రయోగం వల్ల ఉపయోగం ఈ పరిశోధన ద్వారా చిన్నిపిల్లలకైతే  ‘బాగా చదువుకోండిరా బాబూ! మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయట’ అని చెప్పగలం. కానీ ఓ నలభై ఏళ్లు దాటినవారికి ఏం చెప్పాలి. అందుకనే ఈ పరిశోధన లక్ష్యం చదువు ఆవశ్యకత గురించి చెప్పడమే కాదు. చదువుకోనివారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువని తేలితే... వారిలో తగిన అవగాహననీ, వైద్య సదుపాయాలనీ కల్పించే ప్రయత్నం చేయడం.     - నిర్జర.

read more
DO THE RIGHT THING BY SLEEPING ON THE LEFT SIDE!

  Do you sleep on the left or the right side? Wondering why I’m asking this strange question? It is because your sleeping position is known to have a significant effect on your health. Read on to find out how! Research has revealed that sleeping on the left side has a positive impact on most of the organs of your body. Firstly, sleeping on your left is most beneficial to your lymphatic system. This position helps the thoracic duct (the largest lymphatic vessel of the lymphatic system) to clear the body waste more effectively. Being on the left also assists the lymphatic system in transportation of proteins and fats along with contributing to faster absorption of nutrients. Spleen being situated on the left side can work more efficiently when you sleep on your left side. Lying on your left side directs the blood flow to the left side, improving blood supply to the spleen. When this happens, the cleansing process is enhanced. If you are someone who suffers frequent heart burn every night, then its time you start sleeping on your left side. This position prevents food from coming back into the esophagus. The next organ that benefits when you sleep on your left side is your liver. Being situated in the right side of your body, the liver is pressurized when you sleep on that side. This also prevents it from getting rid of toxins and overloads it. For the benefit of so many organs of your body you should change things in your life. A change as small as sleeping on the left side. Sweet dreams! Kruti Beesam

read more
Foods For Urinary Infection

    Foods For Urinary Infection     Urinary Tract Infection (UTI) is one of the most common but least discussed problems within the community. While there are too many reasons that lead to UTI... the onset of the infection can lead to severe discomfort. From abdominal pain to burning sensation... UTI can be a menace in our daily lives. While doctors prefer the usage of antibiotics to control the infection, patients need to take some care in their diet.   Vitamin C The acidic nature of Vitamin C would control and prevent the bacteria in the urinary tract. The intake of Vitamin C rich foods such as oranges, tomatoes, guava... would restrain the growth of UTI causing bacteria. Any deficiency in the Vitamin requirement can be tackled by taking those Vitamin supplements. Some even suggest drinking lemon juice regularly until the UTI recedes.   Water Water acts as a flush and drives away the bacteria. Naturopaths strongly suggest high intake of water during the UTI. It not only restrains the bacteria, but would also protect the body from the future attacks of such bacteria. Drink lots of water and keep emptying your bladder... and that could be the best way to get rid of UTI causing organisms from the body.   Garlic and Onions Garlic and Onions are found to be miraculous in many ailments and UTI is one of them. The sulphur compounds in these foods could be highly effective in killing micro organisms. Moreover, both Garlic and Onion are thought to be anti-inflammatory as well as antibiotic which would relieve us from the symptoms of UTI and set us back to normality.   Cranberry Juice Indians might not be familiar with Cranberry Juice. But it is undoubtedly the most suggested remedy in UTI. Many studies have proved that Cranberries contain certain chemicals that prevent the foreign bodies to stick along the lining of bladder. Cranberries are proved to be effective in most commonly occurring bacterium such as Proteus mirabilis.   Baking Soda Baking soda is another household remedy that is trusted for generations together. Baking soda creates an alkaline PH that would control UTI. Thus it is highly considered in cases where UTI causes burning sensation. Drinking a glass of warm water stirred with half teaspoon of baking soda early in the morning could be soothing. But people with High Blood pressure are not advised to use Baking Soda as it is high in sodium levels.   Foods to avoid during UTI - Avoid sugary foods and drinks that would irritate the bladder and creates an environment where bacteria could thrive.   - Avoid beverages such as alcohol and coffee.   - Avoid processed and spicy foods that could provoke gastric acidity which could worsen the situation.     - Nirjara.  

read more
చిన్నారి మనసుకి గాయం అయితే

పిల్లల్ని పెంచడం ఒక కళ అని చాలామంది గ్రహించరు. పిల్లలకి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుందన్న ఆలోచనా కొద్దిమందికే ఉంటుంది. ఇక పిల్లల మనసు గాయపడితే వారి జీవితం ప్రభావితం అవుతుందన్న ముందుచూపూ జనానికి తక్కువే! కానీ అలాంటి అలక్ష్యమే వారి నిండు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.   రకరకాల బాధలు పిల్లలు పసివారే కావచ్చు. కానీ వారి మీద జరిగే దారుణాలు అసంఖ్యాయం. తెలిసో తెలియకో కుటుంబం, సమాజం వారితో ప్రవర్తించే తీరు అమానుషంగానే ఉంటుంది. శారీరిక హింస, మానసిక వేధింపులు, లైంగిక దాడులు, తల్లిదండ్రులు విడిపోవడం, ఇంట్లో గొడవలు లాంటి వ్యవహారాలు పసి మనసుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకనే అమెరికాలోని ఓ స్వచ్ఛంద సంస్థ 17,000 మందిని ప్రశ్నించినప్పుడు... వారిలో చాలామంది తాము ఏదో ఒక సందర్భంలో తీవ్రమైన వేధింపులకి గురైనట్లు పేర్కొన్నారు. వీటిలో శారీరిక హింసదే అగ్రస్థానంగా ఉంది.   దీర్ఘకాలిక ప్రభావం చిన్నతనంలో పసిమనసు దెబ్బతింటే దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉన్నట్లు తేలింది. వారిలో గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట. ఇక డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు సరేసరి! అపసవ్యమైన బాల్యాన్ని చవిచూసిన వారిలో ప్రవర్తనాపరమైన లోపాలకీ కొదవ లేదు. దుర్వసనాలకు లోనుకావడం, విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వంటి జీవనానికి అలవాటుపడతారట. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, గాయపడిన మనసుతో బాల్యాన్ని గడిపిన వారి ఆయుష్షులో కూడా మార్పులు ఉండటాన్ని గమనించారు. వీరు దాదాపు 20 సంవత్సరాలు ముందే చనిపోయే ప్రమాదం ఉందట. వీరిలో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ఐదురెట్లు అధికంగా జరిగినట్లు గమనించారు.   ఇవీ కారణాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పసిపిల్లలలో ఉండదు. కనీసం దానిని బయటకు చెప్పుకునే ధైర్యాన్ని కూడా వారు చేయలేరు. ఏ పెద్దల మీదైతే తాము ఆధారపడుతున్నామో... వారే సమస్యగా మారినప్పుడు, సమాజం మీదే వారికి నమ్మకం పోతుంది. అనుబంధాల మీదా, మానవత్వం మీదా విశ్వాసం చెదరిపోతుంది. అది మానసికంగానూ, శారీరికంగానూ, ప్రవర్తనాపరంగానూ వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.   అదృష్టవశాత్తూ ఇప్పుడు పిల్లల హక్కుల గురించీ, వారి మనస్తత్వాల గురించీ విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎవరన్నా తన చిన్నతనం తాలూకు జ్ఞపకాలూ ఇంకా తమని వెన్నాడుతున్నట్లు భావిస్తే ధ్యానం చేయడం ద్వారా, కౌన్సిలింగ్‌ తీసుకోవడం ద్వారా ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.   - నిర్జర.

read more
ఉపవాసంతో కేన్సర్‌ మాయం

  ‘లంకణము పరమౌషధం’ అంటుంటారు పెద్దలు. కాకపోతే ఇదేదో జ్వరం, అజీర్ణం, కఫంలాంటి చిన్నాచితకా వ్యాధులకి సంబంధించిన సూత్రం అనుకునేవారం. కానీ ఏకంగా కేన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులలోనూ ఉపవాసం ఉపశమనాన్ని కలిగిస్తుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ నమ్మక తప్పదు!   ALL అనగా బ్లడ్‌ కేన్సర్‌ అన్న పేరు వింటేనే చాలు ఒళ్లు జలదరిస్తుంది. మనుషుల్ని బయపెట్టి, బాధపెటట్టి కొంచెంకొంచెంగా మృత్యువుకి చేరువచేసే ఈ తరహా కేన్సర్‌ పగవాడికి కూడా రావద్దు భగవంతుడా అనిపిస్తుంది. లుకేమియా అనేది ఆ బ్లడ్ కేన్సర్‌లో ఒక రకం. అందులో Acute lymphoblastic leukemia అనే తరహా వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.   తెల్లరక్తకణాలని మార్చేసి ALL బారిన పడ్డ రోగులలో తెల్లరక్తకణాలు దెబ్బతింటాయి. దీని వలన మనిషిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం పెరిగిపోతుంది. ఉపయోగం లేని తెల్లరక్తకణాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో రక్తహీనత, నీరసం, రక్తస్రావం, జ్వరంలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.   పిల్లలలో అధికం ALL బ్లడ్‌ కేన్సర్‌ పిల్లలలో ఎక్కువ. లుకేమియా బారిన పడ్డ ప్రతి నలుగురు పిల్లలలోనూ ముగ్గురిలో ALL తరహా లుకేమియానే కనిపిస్తుంటుంది. అదృష్టవశాత్తూ 95 శాతం మందిలో కీమోథెరపీ మొదలుపెట్టిన నెలరోజులలోపే ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అయితే వీరిలో దాదాపు 20 శాతం సందర్భాలలో వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. కానీ ఉపవాసం ద్వారా ALLని సమూలంగా నాశనం చేసే అవకాశం ఉందేమో పరిశీలించేందుకు కొన్ని ఎలుకల మీద ప్రయోగం చేశారు పరిశోధకులు. ఫలితం కనిపించింది   ప్రయోగంలో భాగంగా ఎలుకలలో ALL కేన్సర్‌ కణాలను ఎక్కించారు.  ఆ తరువాత ఒకరోజు ఉపవాసం మరుసటి రోజు ఆహారం... ఇలా ఎలుకలతో ఉపవాసం చేయించారు. ఒక ఏడు వారాలు గడిచేసరికి ఉపవాసం చేసిన ఎలుకలలోని కేన్సర్‌ కణాలు కూడా ఆరోగ్యవంతమైన కణాలలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఈ ఎలుకల మూలుగు (bone marrow)లో కానీ ప్లీహం (spleen)లో కానీ లుకేమియాని కలిగించే కణాలే కనిపించలేదు.   ప్రయోగం తరువాత కొద్దిరోజులకే ఉపవాసం చేయించని ఎలుకలు చనిపోగా, ఉపవాసంతో కేన్సర్‌ను జయించిన ఎలుకలు సుదీర్ఘకాలం జీవించాయి. మన ఆకలిని నియంత్రించి, రక్తప్రసరణ మీద ప్రభావం చూపే leptin అనే హార్మోను మీద ప్రభావం చూపడం వల్లే ఉపవాసం సత్ఫలితాలనిచ్చింది అంటున్నారు పరిశోధకులు. అయితే పెద్దలకు సోకే AML అనే తరహా లుకేమియాలో ఇలాంటి ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఉపవాసం వల్ల కేన్సర్‌ సైతం నయమవుతుందని తేలిపోయింది. ఉపవాసం వల్ల ఇంకెన్ని రోగాలలో ఉపశమనం లభిస్తుందో తేలడమే తరువాయి. పెద్దలు చెప్పే ఇలాంటి ఆరోగ్య సూత్రాల వెనుక ఎంత ఉపయోగం ఉందో తెలిపే ఇలాంటి పరిశోధనలు ప్రాచీన వైద్యం పట్ల సరికొత్త విశ్వాసాన్ని అందిస్తున్నాయి.     - నిర్జర.

read more
వయసులో తాగితే మెదడు గతి అంతే!

  మ్యదపానం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకో పరిశోధనా వెలువడే కొద్దీ మద్యపానం వల్ల ఊహకి అందని సమస్యలెన్నో ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఫిన్లండులో సరికొత్తగా జరిగిన ఓ పరిశోధనతో, వయసులో మద్యపానాన్ని సేవించడం వల్ల, పిల్లలు మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తేలుస్తోంది.   టీనేజిలో ఉండగా ఫిన్లండుకి చెందిన పరిశోధకులు ఒక 62 మంది యువత నుంచి వారి ఆహారపు అలవాట్లకి సంబంధించిన వివరాలను సేకరించారు. ముందుగా ఒక పదేళ్ల క్రితం వారంతా టీనేజి వయసులో ఉన్నప్పుడు ఈ వివరాలను సేకరించారు. ఆ తరువాత ఐదేళ్ల క్రితమూ, ఏడాది క్రితమూ ఇవే వివరాలను సేకరించారు. ఇందులో భాగంగా వారి మందు అలవాట్లను గమనించారు. వీరిలో ఒక 35 మంది టీనేజిలో ఉండగా తెగ తాగేవారని తేలింది. మరో 27 మంది అప్పుడప్పుడూ మందుని రుచి చూసేవారట.   మెదడుని పరిశీలిస్తే టీనేజిలో ఉండగా బాగా తాగేవారికీ, తక్కువ తాగేవారి ఆరోగ్యానికీ మధ్య మొదట్లో ఎలాంటి వ్యత్యాసమూ కనిపించలేదు. డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులూ అగుపించలేదు. కాకపోతే బాగా మందు తాగేవారు, మందుతో పాటుగా సిగిరెట్లు కూడా ఎక్కువ తాగుతున్నట్లు మాత్రమే తేలింది. కానీ పెద్దయ్యాక వారి మెదడుని గమనిస్తే, రెండు విభాగాల మధ్య స్పష్టమైన తేడాలు బయటపడ్డాయి. వారిలో మెదడు వికసించిన తీరులో మార్పు కనిపించింది.   గ్రే మేటర్ టీనేజిలో తెగ తాగిన యువత మెదడులోని ‘గ్రే మేటర్’ అనే పదార్థం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. మనలో  జ్ఞాపకశక్తినీ, ఉద్వేగాలనీ, విచక్షణనీ, ఆత్మస్థైర్యాన్నీ నియంత్రించడంలో ఈ ‘గ్రే మేటర్‌’ది కీలక పాత్ర. మెదడులో ఇలాంటి లోటు చోటు చేసుకోవడం వల్ల టీనేజిలో బాగా తాగేసినవారిలో నానారకాల మానసిక సమస్యలూ ఏర్పడినట్లు గమనించారు. సమాజానికి దూరంగా ఉండటం, క్రుంగుబాటు వంటి సమస్యలు ఎదుర్కోవడం, చదువులో వెనబడటం వంటి ఇబ్బందులెన్నింటినో ఎదుర్కొన్నారట. దీనికి తోడు శాశ్వతంగా మద్యపానానికి బానిసైపోయే ప్రమాదంలోనూ మునిగిపోయారు.   ఖచ్చితమైన కారణం టీనేజిలో విచ్చలవిడిగా తాగితే మెదుడు దెబ్బతినడానికి కారణం లేకపోలేదు. పిల్లలు 20 ఏళ్ల వయసుకి వచ్చేవరకు వారి మెదడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ కాలంలో కనుక మద్యానికి బానిసైతే, ఎదిగే మెదడు దెబ్బతినక మానదు. అందుకనే పిల్లల అలవాట్లను తల్లిదండ్రులు, తోటిమిత్రలు, ఉపాధ్యాయులు... ఓ కంట కనిపెడుతూ ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ టీనేజి పిల్లలు తెలిసీ తెలియక మద్యానికి బానిసలైనా... వెంటనే వారిలో ఆ అలవాటుని కనుక మాన్పించగలిగితే, తిరిగి మెదడులోని గ్రే మేటర్‌ పుంజుకోవడాన్ని గమనించారు. అలా కాకుండా దీర్ఘకాలం పాటు మద్యానికి బానిసగా కొనసాగితే, మెదడుకి కోలుకోలేని నష్టం ఖాయమట.   - నిర్జర.

read more
శ్వాసతో ధ్యాస పెరుగుతుందట

  ఊపిరిని ఎప్పుడూ నాసిక ద్వారా పీల్చుకోవాలేగానీ నోటితో పీల్చుకోకూడదని పెద్దలు అంటూ ఉంటారు. ముక్కుతో కాకుండా నోటితో గాలిని పీల్చుకుని వదలడం వల్ల ఊపిరితిత్తుల బలహీనంగా తయారవుతాయని ఆధునిక విజ్ఞానం ధృవీకరిస్తోంది. పైగా ఆస్తమా, రక్తపోటు వంటి ఆరోగ్యసమస్యలు సైతం పలకరిస్తాయని హెచ్చరిస్తోంది. అయితే ముక్కుతోనే గాలిని పీల్చుకోవడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తేలడం ఆశ్చర్యకరం!   అనుకోని పరిశోధన నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొన్ని రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ రికార్డులు మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఓ ఏడుగురు రోగులవి. వీరి మెదళ్ల మీద త్వరలోనే శస్త్రచికిత్సలు జరగనున్నాయి. ఆ శస్త్రచికిత్సల కోసం జరుగుతున్న పరీక్షలలో భాగంగా వారిలో మూర్ఛవ్యాధికి మూలం ఎక్కడుందో కనుగొనేందుకు ఎలక్ట్రోడ్ల సాయంతో... వారి మెదడులో జరుగుతున్న చర్యలన్నింటినీ పరిశీలించి రికార్డులను రూపొందించారు. ఈ రికార్డులను పరిశీలిస్తున్నప్పుడు, రోగులు శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు వారి మెదడులో కొన్ని ప్రాంతాలు ఉత్తేజితం కావడాన్ని గమనించారు. ముఖ్యంగా భావోద్రేకాలు, జ్ఞాపకాలను నియంత్రించే కొన్ని భాగాలలో స్పష్టమైన మార్పులు కనిపించాయి.   మరో అడుగు ముందుకి శ్వాసకి సంబంధించి తాము గమనించిన విషయాలు ఎంతవరకు నిజమో తేల్చుకునేందుకు ఒక 60 మంది మీద ప్రయోగాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందులో భాగంగా వారు ఊపిరి పీల్చుకునే సమయంలో వేర్వేరు భావాలను ప్రదర్శించే చిత్రాలను చూపించారు. వాటిలో ఏ చిత్రం ఏ భావాన్ని సూచిస్తుందో ఠక్కున చెప్పమన్నారు. మిగతా ఉద్వేగాలకంటే భయానికి సంబంధించిన చిత్రాన్ని చూపించినప్పుడు... అభ్యర్థులు గబుక్కున వాటిని పోల్చుకున్నారట. అయితే గాలిని ముక్కుతో పీల్చుకునే సమయంలోనే ఇలా త్వరగా స్పందించగలిగారు. గాలిని బయటకు వదిలే సమయంలో కానీ, గాలిని ముక్కుతో కాకుండా నోటితో పీల్చుకున్నప్పుడు కానీ ఇలాంటి ప్రతిభ కనిపించలేదు.   జ్ఞాపకశక్తి కూడా భయాన్ని గుర్తుపట్టే లక్షణమే కాదు... ఏదన్నా వస్తువుని చూసినప్పుడు దానిని దీర్ఘకాలం గుర్తుంచుకోవడంలో కూడా శ్వాస ప్రభావం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు అభ్యర్థులకు కంప్యూటర్‌ తెర మీద వేర్వేరు వస్తువుల చిత్రాలను చూపించారు. తరువాత కాలంలో వాటిని గుర్తుచేసుకోమన్నప్పుడు, ముక్కు ద్వారా గాలిని పీల్చుకునే సందర్భంలో చూసిన చిత్రాలను వారు త్వరగా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని గమనించారు.   ఎందుకిలా! ఊపిరి పీల్చుకునే సమయంలో మెదడుకి తగినంత ప్రాణవాయువు లభిస్తుందన్నది ఈ పరిశోధనతో తేలిపోయింది. దాంతో మెదడు ఆ సమయంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకున్నప్పుడే మెదడుకి తగినంత శక్తి చేరుతోందేమో అన్న విశ్లేషణకు కూడా ఈ ఫలితం తావిస్తోంది. మరి భయానికి సంబంధించిన ఉద్వేగాన్ని గమనించడానికీ, శ్వాసకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నకు కూడా సహేతుకమైన జవాబులే వినిపిస్తున్నాయి. మనిషి ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు, అతని శ్వాస వేగవంతం కావడాన్ని గమనించవచ్చు. దీనివల్ల అతని మెదడుకి త్వరగా కావల్సినంత శక్తి చేకూరుతుంది. ఆ ఆపదని తప్పించుకునేందుకు సమర్ధవంతమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు ఆ శక్తి ఉపయోగపడుతుంది.   ఇదీ సంగతి! దీంతో ముక్కుతోనే గాలి పీల్చుకోమని నిరంతరం హెచ్చరించే మన పెద్దల మాట మరోసారి గట్టిగా వినిపించినట్లయ్యింది. పైగా శ్వాస ద్వారా చేసే ప్రాణాయామం వంటి ప్రక్రియల వల్ల మెదడు మరింత చురుగ్గా తయారవుతుందన్న భరోసానీ అందించినట్లయ్యింది.   - నిర్జర.  

read more
ఆడదిక్కు లేని సంసారం... ఆరోగ్యానికీ నష్టమే!

పిల్లల్ని పెంచడంలో ఇప్పటికీ ఆడవారే కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే! అందుకనే విడాకులు తీసుకున్నప్పుడు కూడా పిల్లల బాధ్యతలని ఆడవారే స్వీకరిస్తూ ఉంటారు. ఒకవేళ మగవారు కనుక పిల్లల బాధ్యతలని భుజాన వేసుకుంటే వారి పరిస్థితి ఏంటి? అన్న ఆలోచన వచ్చింది మారియా అనే పరిశోధకురాలికి. ఆలోచన వచ్చిందే తడవుగా ఒంటరి తల్లులతో పోలిస్తే ఒంటరి తండ్రుల ఆరోగ్యం ఏ తీరున ఉందో గమనించే ప్రయత్నం చేసింది.   ఒంటరి తండ్రులు పెరుగుతున్నారు సమాజంలో చెదిరిపోతున్న వైవాహిక బంధాల వల్ల ఒంటరిగా పిల్లల్ని పెంచే తండ్రుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే వీరి కష్టం మీద ఇప్పటివరకూ పెద్దగా పరిశోధనలు జరగలేదంటున్నారు మారియా. ఇందుకోసం ఆమె కెనడాకి చెందిన 1,058 మంది ఒంటరి తండ్రుల స్థితిగతులను గమనించారు. ఆ గణాంకాలను 20 వేల మంది సాధారణ తండ్రులతోనూ, 5,725 ఒంటరి తల్లులతోనూ పోల్చి చూశారు.   స్పష్టమైన తేడాలు ఇంట్లో ఆడదిక్కు ఉన్నవారితో పోలిస్తే ఒంటరి తండ్రుల ఆరోగ్యం అంతంతమాత్రమే అని తేలింది. పైగా వీరిలో మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఒంటరిగా పిల్లల్ని పెంచుకొస్తున్న తల్లుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయితే వారితో పోలిస్తే సగానికి సగం మంది ఒంటరి తండ్రులు మాత్రమే తమ మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారట.   మూడు కారణాలు ఒంటరి తండ్రులలో ఈ అవస్థకి మూడు కారణాలను పేర్కొనవచ్చునంటున్నారు పరిశోధకులు..   - తాము మానసికంగా క్రుంగిపోతున్నామని ఒప్పుకొంటూ, వైద్యులు సలహాని తీసుకునేందుకు మగవారు సంశయించడం.   - సమాజం కూడా ఒంటరి తల్లుల మీద చూపే జాలి, శ్రద్ధా ఒంటరి తండ్రుల మీద చూపకపోవడం.   - ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం వల్ల వారి ఆరోగ్యాన్ని పట్టించుకునేందుకు కానీ, మంచిచెడులు చెప్పేందుకు కానీ, అండగా నిలిచేందుకు కానీ ఓ తోడు లేకపోవడం.   ఒంటరి తండ్రులు కనుక మానసిక వ్యధకి లోనవుతుంటే.. ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, ఏవన్నా మనస్పర్థలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి కానీ, పిల్లల్ని పంచుకుని పెంచుకునే దాకా పోకూడదని ఈ పరిశోధన సూచిస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక ఏర్పడితే... సదరు వ్యక్తిని కనిపెట్టుకుంటూ ఉండాలని సమాజాన్ని కూడా హెచ్చరిస్తోంది.   - నిర్జర.

read more
పడుకునే ముందు పోట్లాడుకోవద్దు!

    నిద్ర గురించి కావల్సినన్ని పరిశోధనలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉదాహరణకు తగినంత నిద్రలేకుండా అదేపనిగా పనిచేసేవారిలో రక్తపోటు, గుండెదడ ఎక్కువగా ఉన్నట్లు ఇటీవలే చికాగోలో జరిగిన ఒక సమావేశంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇదంతా బాగానే ఉంది కానీ నిద్రపోయే ముందు మన ఆలోచనా విధానానికీ, జ్ఞాపకాలకీ ఏదన్నా సంబంధం ఉందా? అన్న విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు కొందరు శాస్త్రవేత్తలు. భయంకరమైన చిత్రాలు లండన్‌కు చెందిన పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా ఓ 73 మంది విద్యార్థులను ఎన్నుకొన్నారు. వీరికి నిద్రపోయే ముందు కొన్ని భయానక చిత్రాలను చూపించారు. గాయపడినవారు, ఏడుస్తున్న పిల్లలు, శవాలు... ఇలా మనసుని తొలచివేసే సన్నివేశాలు ఉన్న చిత్రాలను వీళ్లకి అందించారు. చిత్రాలను చూపించడమే కాదు, అభ్యర్థులలో కొందరికి- ‘మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ చిత్రాల గురించి అంతగా పట్టించుకోవద్దు,’ అంటూ సలహాని కూడా ఇచ్చారట. అలాంటి సలహాని అందుకున్నవారికి ఓ అరగంట తరువాత మళ్లీ అవే చిత్రాలను చూపించారు. వాళ్లంతా ఆ చిత్రాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో.... ఓ 91 శాతం మందే వాటిని గుర్తుచేసుకున్నారు. ఒక రోజు తరువాత అయితే! ప్రయోగంలోని రెండో దశలో భాగంగా మిగతా అభ్యర్థులకి ఒక రోజు తరువాత అవే చిత్రాలను చూపించారు. ఆశ్చర్యకరంగా... వారిలో 97 శాతం మంది వాటిని గుర్తుచేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- చిత్రాలను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్న కొందరు అభ్యర్థులు అరగంటలోనే వాటిని మర్చిపోవడంలో సఫలం అయితే, వాటి గురించి జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకున్నవారు... రోజు గడిచినా కూడా వాటిని మర్చిపోలేకపోయారు. జ్ఞాపకాలే కీలకం నిద్రపోయి లేచిన తరువాత చేదు అనుభవం మరింత తీవ్రంగా నిక్షిప్తం అవడానికి కారణాన్ని కనుగొనేందుకు అభ్యర్తుల మెదడుని స్కానింగ్‌ చేసి చూశారు. దానిలో తేలిన విషయం ఏమిటంటే... మనలోని తాత్కాలిక జ్ఞాపకాలన్నీ కూడా మెదడులోని ‘హిపోక్యాంపస్’ అనే చోట నమోదవుతాయి. ఇక్కడే వీటిని తుంచేస్తే అవి దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వాటిని మనసులోనే ఉంచుకుని నిద్రలోకి జారుకుంటే... ఆ ఆలోచనలు ‘హిపోక్యాపస్‌’ను దాటుకుని మెదడు అంతా పరుచుకుంటాయి. మరిన్ని సూత్రాలకు ఆధారం నిద్రపోయేటప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉండాలన్న పెద్దల మాటను ఇది నిజం చేస్తోంది. అలా కాకుండా భార్యాభర్తలు గొడవపడుతూనో, పనికిరాని పుస్తకాలు చదువుతూనే పడుకుంటే పీడకలల మాట అటుంచి... అవి మన మెదుడలోనే తిష్టవేసుకుపోయే ప్రమాదం ఉందని తేలిపోతోంది. నిద్రపోయే ముందు ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలో, మనసులో ఎలాంటి ఆలోచనలకి చోటు ఇవ్వాలో చెప్పడం మాట అటుంచి... ఏదన్నా చేదు అనుభవం తాలూకు జ్ఞాపకాలు మనసులో ఎలా నిక్షిప్తం అవుతాయో, వాటికి చికిత్స ఎలా అందించవచ్చో సూచించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతోంది. - నిర్జర.

read more
మొండి బ్యాక్టీరియాకు తిరుగులేని వైద్యం

బ్యాక్టీరియా కారణంగా శరీరంలోకి ఏదన్నా ఇన్ఫెక్షన్‌ చేరితే, దానిని సరిచేసేందుకు యాంటీబయాటిక్స్‌ను అందిస్తూ ఉంటారు. ఈ యాంటీ బయాటిక్స్‌ కారణంగా శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా చనిపోవడం, మనిషి నిస్సత్తువగా మారిపోవడాన్ని తరచూ గమనిస్తూనే ఉన్నాము. పైగా తరచూ ఇలాంటి యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల బ్యాక్టీరియా కూడా రాటుదేలే పరిస్థితులు వస్తున్నాయి. యాంటీబయాటిక్స్ కూడా పనిచేయలేని స్థితిలో ఏటా వేలమంది నిస్సహాయంగా ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇక మీదట మొండి బ్యాక్టీరియాలను ఎదుర్కొనే చికిత్స అందుబాటులోకి రానుంది.   మొండితనానికి కారణం కొన్నిరకాల బ్యాక్టీరియాల మీద రక్షణగా ఒక పొర ఏర్పడటంతో... వాటి మీద మందులు పనిచేయడం లేదని తేలింది. ఈ పొరను బయోఫిల్మ్‌ అంటారు. యాంటీబయాటిక్స్ ఈ పొరను దాటుకుని బ్యాక్టీరియాను నిర్వీర్యం చేయడంలో విఫలం అవుతుంటాయి. ఇలా యాంటీబయాటిక్స్ నుంచి నిలదొక్కుకున్న బ్యాక్టీరియా... అంతకు పదింతలై వృద్ధి చెంది ప్రాణాంతకంగా మారుతుంది.   విద్యత్తుతో చికిత్స మొండి బ్యాక్టీరియాని ఛేదించేందుకు ‘వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ’కి చెందిన పరిశోధకులు విద్యుత్తుని ప్రయోగించి చూశారు. ఇందులో భాగంగా చిన్నపాటి విద్యుత్తుని రోగి శరీరంలోకి పంపారు. ఆ విద్యుత్తుతో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అనే రసాయనం ఉత్పత్తి అయ్యేలా చూశారు. ఈ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ మొండి బ్యాక్టీరియా మీద ఉన్న బయోఫిల్మ్‌ను ఛేదించింది. దీంతో యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా మీద దాడి చేసే అవకాశం ఏర్పడుతుంది.   కొత్త కాదు కానీ... విద్యుత్తును ప్రయోగించి బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఈనాటివి కావు. దాదాపు వందేళ్ల నుంచీ ఇలాంటి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నాలేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. కానీ సరిగ్గా తగినంత మోతాదులో విద్యుత్తు అందించడం, ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా నేరుగా బ్యాక్టీరియా మీద దాడి చేయడం... వంటి అంశాలలో తాజా పరిశోధన విజయవంతమయ్యింది. పైగా ఈ చికిత్సకు బ్యాక్టీరియా కూడా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా లొంగిపోవడం కూడా పరిశోధకులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.   ‘విద్యుత్తుతో బ్యాక్టీరియా నాశనం’ అనే పరిశోధన విజయవంతం కావడంతో ఈ చికిత్సకు సంబంధించి పేటెంట్లను కూడా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చికిత్సే కనుక అందుబాటులోకి వచ్చేస్తే ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్లు, ఎంతకీ మానని గాయాలను ఇకమీదట సులభంగా లొంగదీసుకోవచ్చు. అదే కనుక జరిగితే మున్ముందు ‘ఇచట మొండి గాయాలను మాన్పబడును’ అన్న బోర్డులు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.     - నిర్జర.

read more
టెన్నిస్‌తో ఆయుష్షు పెరుగుతుంది.. ఫుట్‌బాల్‌తో పెరగదు!

ఆటలు ఆడే మనుషులు ఆరోగ్యంగానూ, దృఢంగానూ ఉంటారన్న విషయం తెలిసిందే! ఆడే తీరుని బట్టి కొన్ని రకాల ఆటల్లో ఎక్కువ శక్తి ఖర్చవుతుందనీ, కొన్నింటిలో అంతగా కొవ్వు కరగదనీ వింటుంటాము. కానీ ఆటకీ ఆయుష్షుకీ సంబంధం ఉందంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది కదా! అలాంటి సంబంధం ఏమన్నా ఉందేమో అని తెలుసుకునేందుకు సాక్షాత్తూ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు రంగంలోకి దిగారు.   14 ఏళ్ల పరిశోధన ఈ ప్రయోగం కోసం ఇంగ్లండు, స్కాట్లాండుకు చెందిన 80 వేలమందికి పైగా వ్యక్తులను... వారి జీవనశైలి గురించి ప్రశ్నించారు. 1994 నుంచి 2008 వరకు సాగిన ఈ ప్రశ్నలలో వారు ఎలాంటి ఆటలు ఆడతారు, ఎలాంటి వ్యాయామం చేస్తారు, ఎంతసేపు చేస్తారు, పొగతాగడం లాంటి అలవాట్లు ఉన్నాయా, విద్యార్హతలు ఏమిటి... వంటి ప్రశ్నలెన్నో సంధించారు. పలు దఫాలుగా సాగిన ఈ ప్రశ్నావళి ద్వారా వచ్చిన సమాచారాన్నంతా ఒకచోటకి చేర్చి పరిశీలించారు.   సంబంధం ఉంది ఈ పధ్నాలుగేళ్ల కాలంలో... పరిశోధనలో పాల్గొన్న 80 వేల మందిలో, ఓ ఎనిమిదివేల మంది చనిపోయారు. వీరిలో దాదాపు రెండువేల మంది గుండెపోటుతోనే చనిపోయారు. అయితే వీరు ఆడిన ఆటకీ ఆయుష్షుకీ సంబంధం ఉండటం పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మిగతావారితో పోలిస్తే... రాకెట్‌తో ఆడే టెన్నిస్‌ వంటి క్రీడలు అలవాటు ఉన్నవారు గుండెపోటుతో చనిపోయే అవకాశం 57 శాతం తక్కువగా ఉందని తేలింది. ఇక ఈత కొట్టేవారు 41 శాతం తక్కువగానూ, ఏరోబిక్స్‌ చేసేవారు 36 శాతం తక్కువగానూ గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు. కేవలం గుండెపోటే కాదు, ఇతరత్రా కారణాలతో మృత్యువుబారిన పడటం కూడా వీరిలో తక్కువగానే నమోదయ్యింది. ఆశ్చర్యం ఏమిటంటే ఫుట్‌బాల్‌, రగ్బీ వంటి ఆటలు ఆడేవారిలో ఆయుష్షుకీ ఆటకీ మధ్య ఎలాంటి సంబంధమూ కనిపించలేదు!   కారణం లేకపోలేదు వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా క్రీడలకు అనుగుణంగా ఆయుష్షులో మార్పులు ఉండటానికి వెనుక స్పష్టమైన కారణం ఉందంటున్నారు పరిశోధకులు. టెన్నిస్, స్విమ్మింగ్‌, సైక్లింగ్, ఏరోబిక్స్‌ వంటి క్రీడలకు వయసుతో సంబంధం ఉండదు. ఒకసారి ఈ క్రీడలకు అలవాటు పడినవారు వాటిని నిరంతరం కొనసాగించే అవకాశం ఉంటుంది. పైగా టెన్నిస్‌, ఏరోబిక్స్ వంటి క్రీడలకు కొన్ని క్లబ్బులు ఉండటం... వాటిలో చేరినవారు మిగతావారి ప్రోత్సాహంతో సుదీర్ఘకాలం క్రీడను అంటిపెట్టుకుని ఉండటం కూడా ఓ కారణం. దీనికి విరుద్ధంగా యుక్తవయస్సులో ఫుట్‌బాల్, క్రికెట్‌ వంటి క్రీడలు ఆడేవారు... జట్టు నుంచి దూరం కాగానే ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటారు. టీవీల్లో ఆటలను చూస్తూ ఆనందపడతారే కానీ తాము కూడా ఎలాగొలా ఆటని కొనసాగించేందుకు ప్రయత్నించరు. అలా నడివయసులోనే తమకు నచ్చిన క్రీడల నుంచి దూరం కావడంతో... వ్యాయామానికి సంబంధించిన ఫలితాలు వారికి అందవు.   మరేం చేయడం! పైపైన చదివితే ఈ పరిశోధన ఫుట్‌బాల్‌, క్రికెట్‌ అభిమానులకు కాస్త నిరాశనే కలిగిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న సూచనను అందుకుంటే వారి ఆయుష్షు కూడా మెరుగుపడుతుందని అంటున్నారు పరిశోధకులు. యుక్తవయసులో ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడినవారు... ఆ ఆటని ఆడటం కుదరకపోతే నిస్తబ్దుగా మారిపోవద్దని హెచ్చరిస్తున్నారు. అందుకు బదులుగా నిరంతరంగా సాగే సైక్లింగ్‌ వంటి వ్యాయామాన్ని ఎంచుకోమంటున్నారు.   - నిర్జర.

read more
హెచ్‌.ఐ.వి టీకా వచ్చేస్తోంది

  ఎయిడ్స్‌! ఈ పేరు వింటే చాలు ప్రపంచం ఇప్పటికీ వణికిపోతోంది. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేసినా, పరిశోధకులుఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... హెచ్‌.ఐ.వి అనే మహమ్మారి ఏటా లక్షలమందిని కబళిస్తూనే ఉంది. భారతీయ శాస్త్రవేత్తలతో సహా ఎంతోమంది ఈ వ్యాధికి మందులనో, టీకాలనో కనుగొన్నామని ప్రకటిస్తూనే వస్తున్నారు. అయితే అవి ఇంకా తుదిదశకు చేరుకోలేదు. ఇప్పుడు హెచ్.ఐ.విని ఎదుర్కొనే ఒక టీకాను దక్షిణాఫ్రికాలో ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారు.   దక్షిణాఫ్రికాలోనే ఎందుకు! ఈ టీకాను అమెరికన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినప్పటికీ, దానిని దక్షిణాఫ్రికాలో ప్రయోగించడానికి ఒక కారణం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఎయిడ్స్‌ ప్రబలుతున్న దేశాలలలో దక్షిణాఫ్రికా ఒకటి. అక్కడ దాదాపు 19 శాతం మంది ప్రజలు హెచ్‌.ఐ.వి వైరస్‌ను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్‌.ఐ.వీ బాధితులలో ఐదో వంతు మంది ఆ దేశంలోనే ఉన్నారు. పైగా హెచ్‌.ఐ.వి వైరస్‌లో '‘subtype C” అనే మొండిరకం అక్కడి ప్రజలలోనే ఎక్కువగా కనిపిస్తోంది.   ఇంతకుముందు ధాయ్‌లాండ్‌లో హెచ్‌.ఐ.వి టీకాను ప్రజల మీద ప్రయోగించడం ఇదేమీ కొత్త కాదు. ఒక ఆరేళ్ల క్రితం (2009) థాయ్‌లాండ్‌లో కొందరి మీద ఈ టీకాను ప్రయోగించారు. అక్కడ కొంతమేరకు టీకా విజయాన్ని సాధించింది కూడా! హెచ్‌.ఐ.వి టీకాను తీసుకున్నవారిని తిరిగి మూడున్నర ఏళ్ల తరువాత గమనిస్తే... వారిలో దాదాపు మూడోవంతు మంది హెచ్‌.ఐ.వి వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తేలింది.   మరింత శక్తిమంతం ఈసారి దక్షిణాఫ్రికాలో ప్రయోగించనున్న టీకా మునుపటికంటే మరింత శక్తిమంతమైందని చెబుతున్నారు. వైరస్‌ను మరింత ప్రభావవంతంగా ఎదుర్కొనేందుకు, రోగనిరోధక శక్తిని మరింతగా పెంచేందుకు అనువుగా ఈ టీకాను రూపొందించారట. దీనిని 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న 5,400 మందికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. వాక్సినేషన్‌లో భాగంగా అభ్యర్థులకు ఏడాదికాలంలో రెండు సార్లు టీకాను అందిస్తారు. టీకాను అందించి మూడేళ్లు ముగిసిన తరువాత వారిలో ఎంతమంది హెచ్‌.ఐ.విని సమర్థంగా ఎదుర్కొన్నారో పరీక్షిస్తారు. పరిశోధకుల అంచనా మేరకు కనీసం 50 శాతం మందైనా ఈ టీకాతో హెచ్‌.ఐ.విని ఎదుర్కొనే అవకాశం ఉంది.   ఇప్పటివరకూ హెచ్‌.ఐ.విని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. కేవలం ‘యాంటి రిట్రోవైరల్‌’ అనే చికిత్స ద్వారా హెచ్‌.ఐ.వి వైరస్ తీవ్రతను కాస్త తగ్గించే ప్రయత్నమే జరుగుతోంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న పరీక్షలు కనుక సత్ఫలితాలను ఇస్తే మున్ముందు హెచ్.ఐ.విని ఎంతోకొంత మేర ఎదుర్కోవచ్చుననే ఆశ కలుగుతోంది. ఆ ఆశ ఎంతమేరకు ఫలిస్తుందో తెలుసుకోవాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే!   - నిర్జర.

read more
ఊబకాయానికి కారణం తెలిసిపోయింది

  ఈ రోజుల్లో ఊబకాయం లేనివారు అరుదు. ఆ ఊబకాయం నుంచి విముక్తి పొందుదాం అని ఎవరికి వారు ఏవో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కడుపు మాడ్చుకుంటూ, కఠినమైన వ్యాయామాలు చేస్తూ... ఎలాగొలా కాసింత బరువు తగ్గుతారు. కానీ బరువు తగ్గాం కదా అని అలా ఓ నాలుగు ముద్దలు నోట్లో వేసుకుంటారో లేదో... మళ్లీ ఎప్పటిలాగే బరువు పెరిగిపోతుంటారు. ఈ తరహా ఊబకాయాన్ని Yo-Yo ఊబకాయం అంటారు. Yo-Yo అనేది చిన్నపిల్లలు లాగి వదిలే బంతిలాంటి పరికరం. దాన్ని అలా నేలకి వదలగానే తిరిగి చేతిలోకి వచ్చేస్తుంది. అలాగే కొందరిలో ఊబకాయం కూడా మళ్లీ మళ్లీ వస్తుందన్నమాట. ఈ తరహా శరీర తత్వానికి Yo-Yo obesity అంటూ మంచి పేరైతే పెట్టారు కానీ, దానికి కారణం ఏమిటో ఇంతవరకూ తెలుసుకోలేకపోయారు.   ఇజ్రాయేలుకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు Yo-Yo ఊబకాయానికి కారణం తెలుసుకునేందుకు ఎలుకల జీర్ణవ్యవస్థను నిశితంగా పరిశీలించారు. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన ఫలితం వెలువడింది. మన పేగులలో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడతాయన్న విషయం తెలిసిందే కదా! వీటిలో ఒక సూక్ష్మజీవి ఊబకాయులలో చిత్రంగా ప్రవర్తించడాన్ని గమనించారు. ఒక మనిషి విపరీతంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు తాము ఎలా పనిచేస్తున్నామో గుర్తుంచుకునే ఈ సూక్ష్మజీవి, అతను డైటింగ్‌లో ఉన్నంతకాలమూ నిశబ్దంగా ఉండి... మళ్లీ ఓ నాలుగు ముద్దలు అదనంగా పేగులలోకి చేరగానే ఊబకాయానికి తోడ్పడుతోందట.   ప్రయోగంలోని రెండో దశలో- ఊబకాయం పునరావృతమవ్వడానికి సదరు సూక్ష్మజీవే కారణమా కాదా అని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించారు పరిశోధకులు. అందుకోసం ఎలుకలకి కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌ ఇవ్వడం ద్వారా సదరు సూక్ష్మజీవిని నిర్వీర్యం చేశారు. అప్పుడు ఎలుకలలో ఊబకాయం తిరిగి రాకపోవడాన్ని గమనించారు. మరోవైపు ఊబకాయానికి అలవాటు పడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన ఎలుకలలో ప్రవేశపెట్టినప్పుడు, అవి వెంటనే ఊబకాయంతో సతమతమవ్వడాన్ని గమనించారు.   మళ్లీ మళ్లీ వచ్చే ఊబకాయానికి కారణమైన సూక్ష్మజీవిని కనుగొన్నారు సరే! మరి సదరు సూక్ష్మజీవి ఊబకాయానికి ఎలా తోడ్పడుతోంది? అన్న ప్రశ్నకి కూడా జవాబు దొరికింది. ఆ సూక్ష్మజీవులు, మన శరీరంలోకి చేరే ఫ్లేవనాయిడ్స్ అనే పోషక పదార్థాలను నిర్వీర్యం చేస్తాయట. కొవ్వుని శక్తిగా మార్చడంలో కీలకపాత్రని వహించే ఇలాంటి ఫ్లేవనాయిడ్స్‌ని నిర్వీర్యం చేయడం ద్వారా... శరీరంలో కొవ్వు ఎప్పటికప్పుడు పేరుకుపోయే ప్రమాదం ఏర్పుడుతుంది.   ఎలుకల మీద జరిగిన ఈ పరిశోధన ఆధారంగా ఊబకాయంతో బాధపడే మనుషులకు కూడా తగిన చికిత్సను అందించవచ్చు అంటున్నారు. కొవ్వుని కరిగించే ఫ్లేవనాయిడ్స్‌ను ఎప్పటికప్పుడు శరీరానికి అందించడం ద్వారా ఊబకాయాన్ని సులువుగా జయించవచ్చునంటున్నారు. ఊబకాయం కేవలం ఆకృతికి సంబంధించిన సమస్యే కాదు! దాని వల్ల గుండెజబ్బులు, షుగర్‌, రక్తపోటు వంటి నానారకాల ఆరోగ్య సమస్యలూ మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి మున్ముందు చిన్నపాటి చికిత్సతోనే ఈ ఊబకాయం అనే మహమ్మారి నుంచి బయటపడితే, ఇతరత్రా సమస్యల నుంచి కూడా దూరం కావచ్చునేమో!                  - నిర్జర.

read more
చెమట చుక్కతో ఆరోగ్యాన్ని పసిగట్టేస్తుంది

  ఒక చిన్న స్టిక్కర్‌ని చేతికి అంటించుకుంటే... అది మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఈ ఆశ్చర్యం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పుణ్యమా అని రాబోయే రోజుల్లో వైద్య పరీక్షల తీరే మారబోతోంది.   సరికొత్త పరికరం ఒక మనిషి గుండె ఎంత వేగంతో కొట్టుకుంటోంది, అతని రక్తపోటు ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు చెప్పేందుకు రకరకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వ్యాయామం చేసేవారు తమ శరీరంలో ఎన్ని కెలొరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకునేందుకు, వ్యాయామం శృతి మించుతోందేమో గమనించుకునేందుకు ఈ పరికరాలు వాడుతున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమిక సమాచారాన్ని అందించగలవే కానీ మన ఒంట్లోని నీరు, లవణాల శాతం ఎలా ఉందో చెప్పవు. పైగా ఈ పరికరాలు శరీరానికి తగులుతూ కాస్త చిరాగ్గా ఉంటాయి. ఇవి పనిచేయాలంటే బ్యాటరీలు కూడా కావాల్సి ఉంటుంది. కానీ కొత్త స్టిక్కర్‌ తీరే వేరు.   రసాయనాల ఆధారంగా ఒక రూపాయి నాణెం అంత ఉండే ఈ స్టిక్కర్‌లో నాలుగు భాగాలు ఉంటాయి. ఆ నాలుగు భాగాల్లోనూ నాలుగు రకాల రసాయనాలు ఉంటాయి. ఈ నాలుగు రసాయనాలూ మన ఒంట్లోంచి వెలువడే చెమటతో కలిసినప్పుడు ప్రతిచర్య జరిగి వాటి రంగు మారతాయి. అప్పుడు మన దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ఇలా రంగు మారిన స్టిక్కర్‌ను ఒక ఫొటో తీస్తే.... ఫోన్లో వాటికి సంబంధించిన యాప్‌, రంగులని బట్టి మన ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది.   నాలుగు రకాలు స్టిక్కర్‌లో ఉన్న నాలుగు రకాల రసాయనాలూ మన శరీరంలో నాలుగు రకాల పరిస్థితులను అంచనా వేస్తాయి. మన శరీరంలోని ఆమ్లశాతం, లాక్టేట్‌ పరిమితులు, క్లోరైడ్‌ నిల్వలు, గ్లూకోజ్ స్థాయిలను ఇవి పసిగడతాయి. వీటి ఆధారంగా మన ఒంట్లో నీరు తగినంత ఉందా లేదా! సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి లవణాలు (Electrolytes) తగిన మోతాదులో ఉన్నాయా లేదా అన్నది అంచనా వేస్తాయి. లాక్టేట్‌ పరిమితులను అంచనా వేయడం వల్ల వ్యాయామం గాడితప్పుతోందా? శరీరంలోని కణాలకి ఆక్సిజన్‌ తగినంతగా అందుతోందా లేదా? గుండె, లివర్ పనితీరు సవ్యంగా ఉందా లేదా? అన్న వివరాలను అంచనా వేయవచ్చు.   మరికొన్ని వివరాలు - ఇంతకీ ఈ స్టిక్కర్‌ అన్ని సందర్భాలలోనూ పనిచేస్తుందా లేదా అని పరీక్షించేందుకు ఇటు ఇంట్లో వ్యాయామం చేసేవారికీ అటు ఎడారిలో సైక్లింగ్ పోటీలలో పాల్గొనేవారి చేతులకి స్టిక్కర్‌ను అంటించి చూశారు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇది శుభ్రంగా పనిచేస్తున్నట్లు తేలింది. - ఈ స్టిక్కర్‌లోని రసాయనాలు ఒంట్లోని చెమటతో ప్రతిచర్య జరపడం ద్వారా రంగులు మారిపోతాయి కాబట్టి, ఒకసారి వాడిన స్టిక్కర్‌ మరోసారి పనికిరాదు. అయితే ఎలాంటి బ్యాటరీల అవసరం లేకపోవడం, కేవలం ఒకటిన్నర డాలరు ఖరీదు మాత్రమే ఉండటంతో ఇది సామాన్యులకు అందుబాటులోనే ఉందని భావించవచ్చు.   - ప్రస్తుతానికి ఓ నాలుగైదు రకాల ఆరోగ్య పరిస్థితులను మాత్రమే అంచనా వేస్తున్నప్పటికీ... ఈ స్టిక్కర్‌ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా మున్ముందు షుగర్‌ వంటి పరీక్షలను కూడా నిర్వహించవచ్చని భావిస్తున్నారు.     - నిర్జర.

read more
హోదాతో పాటే ఆరోగ్యం కూడా!

వంశపారంపర్యంగా మనకి లభించిన జన్యువులు అంత బలంగా లేకపోవచ్చు, చిన్నాచితకా ఆరోగ్యసమస్యలు మనల్ని వేధిస్తుండవచ్చు- కానీ సమాజంలో పేరుప్రతిష్టలు ఉంటే సుదీర్ఘకాలం బతికేస్తామా! ఆరోగ్యం కూడా డబ్బున్నవాడికే సాయపడుతుందా! అంటే అవుననేలా ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది.     ఇప్పటికే కొన్ని ప్రయోగాలు డబ్బుకీ ఆరోగ్యానికీ లంకెపెడుతూ ఇప్పటికే కొన్ని పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. ఆదాయంలో అట్టడుగున ఉండే పేదలతో పోల్చుకుంటే బాగా ధనవంతులు 10 నుంచి 15 ఏళ్లు ఎక్కువ బతుకుతారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇది కేవలం సమాజంలో మంచి హోదాలో ఉండటం వల్ల సాధ్యమవుతోందా! లేకపోతే ఆహారానికీ, వైద్యానికీ కావల్సినంత ఖర్చుపెట్టుకునే స్తోమత ఉండటం వల్ల సాగుతోందా! అన్నది తేలలేదు. అందుకోసం అమెరికాకి చెందిన కొందరు పరిశోధకులు ఓ 45 కోతుల మీద సామాజిక హోదాకి సంబంధించిన ఓ ప్రయోగాన్ని తలపెట్టారు.     ఐదు బృందాలుగా పరిశోధనలో భాగంగా 45 కోతులని ఐదు బృందాలుగా విభజించి వేర్వేరుగా ఉంచారు. సహజంగానే కొద్ది రోజులు గడిచేసరికి ఒకో బృందంలో ఒకో కోతిది పైచేయి అయ్యేది. బృందంలోని మిగతా కోతుల మీద వాటి ఆధిపత్యం సాగేది. కొన్నాళ్ల తరువాత ఈ కోతులని గమనించినప్పుడు, తక్కువ హోదాతో సరిపెట్టుకున్న కోతులలోని రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నట్లు బయటపడింది. వీటిలోని రోగనిరోధకశక్తిని నియంత్రించే జన్యువులను గమనించినప్పుడు... 9,000 జన్యువులలో ఏకంగా 1,600 జన్యువుల లోపభూయిష్టంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా సదరు కోతులకి ఏదన్నా ఇన్షెక్షన్‌ సోకినప్పుడు, అవి తొందరగా వ్యాధులకు లోనవ్వడం కనిపించింది. అంతేకాదు! వీటిలోని కణాలు అపసవ్యంగా ప్రవర్తించడం వల్ల గుండెజబ్బులు, అల్జీమర్స్‌ వంటి రోగాలు సైతం వాటిని బలిగొనే అవకాశం ఉన్నట్లు గమనించారు.     ప్రయోగంలో రెండో దశ 45 కోతులను ఐదు బృందాలుగా విభజించిన పరిశోధకులు, ఒక ఏడాది గడిచిన తరువాత వాటిని అటూఇటూ మార్చారు. అంటే ప్రతి కోతికీ ఒక కొత్త బృందం ఏర్పడిందన్నమాట. ఈ మార్పుతో సహజంగానే ఆయా బృందాలలో కొత్త హోదాలు ఏర్పడే అవకాశం ఉంది. విచిత్రమేమిటంటే ఒకప్పుడు తక్కువ హోదాలో ఉన్న కోతులు ఇప్పుడు తమ బృందంలో పైచేయి సాధించే పరిస్థితులు వస్తే... హోదాతో పాటుగా వాటిలోని రోగనిరోధక శక్తిలో కూడా మార్పు వచ్చిందట! అంటే హోదాతో పాటుగా వాటి ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయన్న విషయం ఖచ్చితంగా రుజువు అయిపోయింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏదన్నా ఒక కోతి తక్కువ హోదాలో ఉన్నప్పటికీ, దానికి బృందంలోని మరో కోతి అండగా నిలబడితే... వాటి ఆరోగ్యంలో పెద్దగా లోటు కనిపించలేదు.   కోతుల హోదాల మీద విజయవంతంగా సాగిన ఈ పరిశోధన మనుషులకు ఏమేరకు వర్తిస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు శాస్త్రవేత్తలు. అంతవరకూ మనం హోదా సంగతి పక్కన పెడితే, ఒకరికొకరు అండగా నిలబడే ప్రయత్నం చేస్తే సరి!                          - నిర్జర.  

read more
మగవాడి కష్టాలు పగవాడికి కూడా వద్దు

కాలం మారుతోంది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగవారితో సమానంగా తిరగగలుగుతున్నారు!... ఇలాంటి మాటలు మనకి తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆడవారి పట్ల వివక్ష ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉందని మనకి తెలుసు. అంతేకాదు! ‘మగవాడు’ అన్న పదానికి నిర్వచనంలో కూడా పెద్దగా మార్పు రాలేదు. కానీ ‘మగవాడు’గా నిరూపించుకోవాలంటే భారీమూల్యం చెల్లించక తప్పదంటోంది ఓ పరిశోధన.   11 లక్షణాలు గెలవాలనే పట్టుదల, భావోద్వేగాల మీద అదుపు, తెగింపు, హింసాత్మక ధోరణి, తమదే పైచేయి కావాలనుకోవడం, ఆడవారితో తిరగడం (Playboy), ఎవరి మీదా ఆధారపడకపోవడం, పనికి ప్రాధాన్యతని ఇవ్వడం, ఆడవారి మీద ఆధిపత్యం చెలాయించడం, స్వలింగ సంపర్కం అంటే ఏవగింపు, హోదా కోసం తపించిపోవడం... అనే 11 లక్షణాల ఆధారంగా సమాజం దృష్టిలో ‘మగవాడు’ అనే పదానికి నిర్వచనం ఇచ్చేందుకు ప్రయత్నించారు అమెరికాలోని ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.   ఆరోగ్యానికి లక్షణాలకీ లంకె పైన పేర్కొన్న ‘మగవాడి’ లక్షణాలకీ వారి మానసిక ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఏమన్నా ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం ఇప్పటివరకూ జరిగిన 78 పరిశోధనల తాలూకు గణాంకాలను సేకరించారు. వీటిలో 19,453 మంది ఆరోగ్యం, వ్యక్తిత్వాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇమిడి ఉంది. వీటిలో ప్లేబాయ్‌ మనస్తత్వం కలిగినవారు, ఆడవారి మీద ఆధిపత్యం చెలాయించే అలవాటు ఉన్నవారు ఇతరులతో పోలిస్తే మానసికమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది.    కారణం లేకపోలేదు సమాజం దృష్టిలో ‘మగవాడు’ అనిపించుకోవాలనే తపనలో, వ్యక్తి తన మనసుని కఠినంగా మార్చేసుకుంటాడట. ఈ ప్రయత్నంలో అతను స్త్రీల నుంచి, తోటి మగవారి నుంచే కాదు... తన సహజమైన వ్యక్తిత్వం నుంచి కూడా దూరమైపోతాడు. ఫలితం! అతనిలోని సున్నితమైన భావోద్వేగాలను విలువ ఉండదు. అనేక మానసిక సమస్యలు చుట్టముట్టడం మొదలవుతుంది. వ్యసనాలబారిన పడటం, డిప్రెషన్‌కు లోనవడం వంటి సమస్యల దగ్గర్నుంచీ ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుల వరకూ అతని జీవితం ఛిద్రమైపోతుంది.   ఆగని కథ ఎవరికైనా మానసిక సమస్యలు రావచ్చు. మనసులో అలజడి చెలరేగవచ్చు. అయితే వీటికి స్పందించే విషయంలో కూడా ‘మగవాడి’ తీరు వేరుగా ఉండటాన్ని గమనించారు. ‘మగవాడు’ కాబట్టి తను డిప్రెషన్‌లో ఉన్న విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి మొహమాటపడతాడు. ఎలాంటి కష్టాన్నయినా తనకు తానుగా ఎదుర్కోవడమే మగతనం అనుకుంటాడు. తనలోని క్రుంగుబాటు పరాకాష్టకి చేరుకున్న తరువాత కూడా వైద్యులను సంప్రదించేందుకు వెనకాడతాడు. ఫలితం! పగవాడికి కూడా కలగకూడని మనోవేదనలో క్రుంగిపోతాడు.   అదీ విషయం! కాబట్టి ఎవరో మనకు ‘వాడు మగాడ్రా బుజ్జీ!’ అని బిరుదు ఇస్తారనుకుని మనలోని సున్నితమైన వ్యక్తిత్వాన్ని అణచివేసుకోకూడదని ఈ పరిశోధనతో తేలిపోతోంది. పైగా తోటివారిని గుర్తించాలనీ, ఆడవారిని గౌరవించాలనే విలువైన విలువలను గుర్తుచేస్తోంది.   - నిర్జర.

read more