బభ్రువాహనుడు
Babhruvahanudu
అర్జునుడికి, చిత్రాంగదకు జన్మించిన కుమారుడు బభ్రువాహనుడు. ఇతను పుట్టిన తర్వాత తల్లి దగ్గరే పెరగడంతో అర్జునుడిని ఎన్నడూ చూడలేదు. బభ్రువాహనుడు పెరిగి పెద్దవాడయ్యే కాలానికి ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తాడు. యాగాశ్వం వెంట అర్జునుడు రాగా, అతడిని బభ్రువాహనుడు నిలువరిస్తాడు. అర్జునుడికి, బభ్రువాహనుడికి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుడు మరణించగా, పినతల్లి ఉలూచి సలహాతో బభ్రువాహనుడు నాగలోకం వెళ్ళి సంజీవని మణి తీసుకొచ్చి, అర్జునుని పునర్జీవితుడిని చేస్తాడు. అయితే అర్జునుడిని బభ్రువాహనుడు పునర్జీవితుడిని చేసే విషయంలో ఇతర కధనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.



