ఓటీటీలో త్రిష చిత్రం
on Apr 5, 2021
చెన్నై చంద్రం త్రిష త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఆమె నటించిన ఓ తమిళ చిత్రం థియేటర్స్ లో కాకుండా.. నేరుగా ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కానుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. వాస్తవ సంఘటనల ఆధారంగా త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ `పరమపదం విలయాట్టు`. కె. తిరుజ్ఞానం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఓ ప్రముఖ రాజకీయ నేతకు చికిత్సను అందించే వైద్యురాలి పాత్రలో నటించారు త్రిష. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ.. త్రిషకు నటిగా 80వ సినిమా కావడం విశేషం. కాగా, తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో `పరమపదం విలయాట్టు` స్ట్రీమ్ కానుంది. మరి.. ఈ చిత్రంతో నటిగా త్రిషకు ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రిష చేతిలో లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్`తో పాటు `సూపర్` అనే తమిళ చిత్రం ఉంది. అలాగే `రామ్` అనే మలయాళ సినిమా ఉంది. అదేవిధఃగా.. `గర్జనై`, `సతురంగ వేట్టై 2`, `రాంగి` అనే కోలీవుడ్ ప్రాజెక్ట్స్ విడుదలకు సిద్ధమయ్యాయి.