కరోనాతో ప్రముఖ తమిళ నిర్మాత మృతి
on Aug 10, 2020
తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఒకరు మరణించారు. లక్ష్మీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరు అయిన వి. స్వామినాథన్ సోమవారం తుదిశ్వాస విడిచారు. కరోనా ఆయన ప్రాణాలను బలి తీసుకుంది. కొన్ని రోజుల క్రితం స్వామినాథన్కి కొవిడ్–19 పాజిటివ్ అని టెస్ట్లో తేలడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రయివేట్ హాస్పటల్లో జాయిన్ చేశారు. వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
తమిళ సీనియర్ హీరోలు విజయ్కాంత్, కార్తీక్, శరత్కుమార్, యంగ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్, సూర్య, ‘జయం’ రవి, ధనుష్, శింబు తదితరులతో లక్ష్మీ మూవీ మేకర్స్ పలు చిత్రాలు నిర్మించింది. ఆయా సినిమాల్లో కామెడీ సన్నివేశాలలో స్వామినాథన్ నటించారు. ఆయన కుమారుడు అశ్విన్ కూడా హాస్య నటుడే. ‘కుంకి’, ‘బాస్ ఎంగిర భాస్కరన్’ చిత్రాల్లో నటించారు.
Also Read