అప్పటికి ఇప్పటికి ఎంత తేడా..!
on Oct 28, 2016
చిత్ర పరిశ్రమలో ఒక హీరో ఒకే హీరోయిన్తో చాలా సినిమాల్లో నటిస్తారు. అయితే ఫస్ట్ టైం చూసినదానికి తర్వాత చూసిన దానికి తేడా కనిపించడం కామన్. ఇప్పుడు అచ్చం ఇలాంటి సిట్యువేషన్లోనే ఉంది సూర్య-శృతిహాసన్ జంట. శృతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే సూర్యతో నటించింది. అప్పటికి శృతి నటించిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీసు దగ్గర సరైన విజయాన్ని అందుకోలేదు. దీంతో శృతిపై ఐరన్ లేగ్ ముద్రపడింది. అయినప్పటికి శృతికి తనపక్కన ఛాన్స్ ఇచ్చాడు సూర్య. మురగదాస్ డైరెక్షన్లో సెవెన్త్ సెన్స్ అనే సినిమాలో ఈ జంట ఆకట్టుకుంది. సినిమా ఆడకపోయినా ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీకావడంతో ఇద్దరూ మళ్లీ చేసే ఛాన్స్ దక్కలేదు.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు శృతి , సూర్య సరసన ఎస్-3లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి శృతి-సూర్యలకు సంబంధించిన ఫోటో వదిలింది ఎస్-3 టీమ్. సెవెన్త్ సెన్స్తో పోలిస్తే ఈ జంట ఇప్పుడు చూడ ముచ్చటగా కనిపిస్తోంది. నటిగా మంచి పరిణితి సాధించడంతో శృతిలో మునపటి భయం పోయి మెచ్యూర్డ్ ఉమెన్గా కనిపిస్తోంది. సింగం సిరీస్లో భాగంగా వస్తోన్న ఈ సినిమాలో సూర్య, అనుష్క, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 19న తెలుగు, తమిళ భాషల్లో భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే తొలి రెండు భాగాలు సూపర్ హిట్టవ్వడంతో ఎస్-3పై భారీ అంచనాలున్నాయి.