ఆ రోజు ఆమె నో చెప్పడంతో శ్రీదేవి దశ తిరిగింది
on Mar 12, 2018
దక్షిణాది నుండి వెళ్లి ఉత్తరాదిలో తమ ప్రాభవం చూపించిన అతి కొద్ది మంది హీరోయిన్స్ లో అతిలోక సుందరి శ్రీదేవి ఒకరు. దేశం మొత్తం ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యిందంటే, శ్రీదేవి అభిమాన గణం ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు. సహ నటుల్లో కూడా అభిమానులు ఉండడం శ్రీదేవి కే చెల్లింది. అయితే, శ్రీదేవి బాలీవుడ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా మాత్రం హిమ్మత్ వాలా అని చెప్పొచ్చు. జితేంద్ర ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమాకి మొదట రేఖ ని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ, డేట్స్ కుదరక శ్రీదేవిని తీసుకున్నారట. కానీ, శ్రీదేవి పాత్రకి రేఖ నే డబ్బింగ్ చెప్పింది. శ్రీదేవిని స్క్రీన్ పైన చూస్తూ రేఖ మెస్మరైజ్ అయిందట. అప్పుడే గొప్ప నటి అవుతుందని చెప్పిందట. ఇక హిమ్మత్ వాలా రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అవ్వడం. అనతి కాలంలోనే శ్రీదేవి అగ్ర నటిగా ఎదగడం జరిగాయి. మొత్తానికి, రేఖ నో చెప్పడం శ్రీదేవికి కలిసొచ్చింది.