రవితేజ కారణంగా ఇరకాటంలో వెంకీ, వరుణ్!
on Nov 29, 2020
2019 సంక్రాంతికి విడుదలైన హిలేరియస్ ఎంటర్టైనర్ 'ఎఫ్2'.. ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి రూపొందించిన ఈ సక్సెస్ఫుల్ మూవీకి త్వరలో 'ఎఫ్3' పేరుతో సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 14 నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 వేసవిలో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సీక్వెల్లో మాస్ మహారాజా రవితేజ అతిథి పాత్రలో కనిపిస్తారని చాన్నాళ్ళుగా ప్రచారం సాగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ క్యారెక్టర్ బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంటూ.. అటు వెంకీని, ఇటు వరుణ్ని బాగా ఇరకాటంలో పెడుతుందట. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భలే సరదాగా ఉంటాయని వినికిడి. ఈ కథనాల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.
'ఎఫ్3'లోనూ తమన్నా, మెహ్రీన్ నాయికలుగా నటించనుండగా.. దేవి శ్రీప్రసాద్ బాణీలు అందించనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది.