సరిలేరు నీకెవ్వరు` అనే రేంజ్ లో రష్మిక రెమ్యూనరేషన్!!
on Jul 16, 2019
`ఛలో` సినిమాతో హలో అంటూ పలకరించిన అందం, అభినయం గల నటి రష్మిక మండన్న. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బెంగుళూరు భామ ఇంత పెద్ద హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. `గీత గోవిందం` సినిమాలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ తో పోటీపడి నటించి మెప్పించింది. ప్రస్తుతం అదే హీరోతో `డియర్ కామ్రేడ్` లో నటిస్తోంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో నటిస్తూ రెమ్యూనిరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. `దేవదాస్` సినిమా అనకున్నంతగా ఆడకపోయినా, తర్వాత వరుసగా రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది రష్మిక. `డియర్ కామ్రేడ్` కోసం 75 లక్షలు పారితోషికం తీసుకున్న రష్మిక `సరిలేరు నీకెవ్వరు` కోసం ఏకండా కోటి పదిలక్షలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
ఇక నుంచి తన మార్కెట్, పెరుగుతున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా సినిమాకు రెమ్యూనిరేషన్ పెంచే ఆలోచనలో కూడా ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక సూపర్ స్టార్ సినిమాతో టాలీవుడ్ లో రష్మిక నెంబర్ వన్ హీరోయిన్ గా కొంత కాలం ఏలడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. త్వరలో `డియర్ కామ్రేడ్` సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మహేష్ సినిమా కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇలా తక్కువ టైమ్ గ్యాప్ లోనే సినిమలు రిలీజ్ కావడం కూడా రష్మిక కు బాగా కలిసొచ్చే అంశం అంటున్నారు సినీ పండితులు.