హెబ్బా పటేట్ తనకు జస్ట్ ఫ్రెండ్ అంటోన్న బుజ్జిగాడు!
on Sep 18, 2020
యంగ్ హీరో రాజ్ తరుణ్కి పాతికేళ్లు వచ్చాయి. మామూలుగా అయితే పెళ్లికి సరైన సమయం అనుకోవాలి. టాలీవుడ్ లెక్కల ప్రకారం చూస్తే... చిన్న వయసే. ఎందుకంటే... లాక్డౌన్లో లవ్ మ్యారేజీలు చేసుకున్న రానా దగ్గుబాటి, నితిన్, నిఖిల్ వయసు 30 పైనే. వాళ్ళను ఆదర్శంగా తీసుకున్నాడో? ఏమో? తన పెళ్లికి మూడు, నాలుగు ఏళ్లు టైమ్ ఉందని రాజ్ తరుణ్ అంటున్నాడు.
రాజ్ తరుణ్ నటించిన ‘ఓరేయ్ బుజ్జిగా’ అక్టోబర్ 2న ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. అలాగే, హీరోయిన్ హెబ్బా పటేల్తో తన రిలేషన్ గురించి వివరణ ఇచ్చాడు. ‘కుమారి 21ఎఫ్’లో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించారు. ఆ తరవాత ‘అంధగాడు’, ‘ఈడో రకం ఆడో కరం’ సినిమాలు చేశారు. ‘ఓరేయ్ బుజ్జిగా’లోనూ హెబ్బా పటేల్ ఉంది. వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని గుసగుసలు వినిపించాయి. అవన్నీ పుకార్లే అని రాజ్ తరుణ్ అన్నాడు. హెబ్బా తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అన్నాడు. గతంలో ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయితో రిలేషన్లో ఉన్నాననీ, ఇప్పుడు మాత్రం సింగిల్ అనీ అతడు చెప్పుకొచ్చాడు. అంటే.. బ్రేకప్ అయిందన్నమాట.
ఆల్రెడీ మంచు విష్ణుతో రాజ్ తరుణ్ మల్టీస్టారర్ సినిమా చేశాడు. ఛాన్స్ వస్తే... మహేశ్బాబు, ఎన్టీఆర్తో మల్టీస్టారర్ చేయాలనుందని చెప్పాడు. అది విన్నవాళ్లంతా బుజ్జిగాడి కోరిక మామూలుగా లేదంటున్నారు.
Also Read