నాకు కరోనా లేదు!
on Mar 29, 2020
హీరోయిన్ రాధికా ఆప్టేకి కరోనా వచ్చిందా? వచ్చిందని రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారానికి కారణం రాధికా ఆప్టేనే. రెండు రోజుల క్రితం ఆమె ఆసుపత్రికి వెళ్లారు. మాస్క్ ధరించిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "హాస్పిటల్ విజిట్. కోవిడ్-19 కోసం కాదు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా బావుంది. సేఫ్గా క్వారంటైన్లో ఉన్నాను. రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్ కోసం ఫ్రెండ్ హాస్పిటల్కి వస్తే... తనకి తోడుగా వచ్చాను. అంతే" అని పేర్కొన్నారు. ఆ పోస్టులో రాధికా ఆప్టే ఏం రాశారన్నది ఎవరూ పట్టించుకోలేదు. హాస్పిటల్లో ఫొటో చూసి ఆమెకి కరోనా వచ్చిందని ప్రచారం చేశారు. అది నిజమని చాలామంది నమ్మారు. నేరుగా ఆమెకు మెసేజ్ చేయడం ప్రారంభించారు. దాంతో ఆమె వివరణ ఇవ్వవలసి వచ్చింది.
"డియర్ ఆల్... ఇన్స్టాగ్రామ్లో నా లాస్ట్ పోస్ట్ చూసి చాలామంది నా ఆరోగ్యం ఎలా ఉందంటూ మెసేజ్లు చేస్తున్నారు. ఒకేసారి అందరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మంచిది అనిపించింది. ఫ్రెండ్కి తోడుగా హాస్పిటల్కు వెళ్లాను. కోవిడ్ నుండి నన్ను, ఇతరుల్ని కాపాడడానికి మాస్క్ వేసుకున్నాను. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెంది వాకబు చేసిన వారందరికీ థాంక్స్" అని రాధికా ఆప్టే తెలిపారు. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' సినిమాల్లో ఆమె కథానాయికగా నటించారు.