లాక్డౌన్ స్టోరీ: పాయల్ తెలుగు పాఠాలు
on Mar 26, 2020
'ఆర్ఎక్స్ 100' సౌండ్ వింటే చాలు... ఆటోమేటిక్గా పాయల్ రాజ్పుత్ గుర్తుకు వచ్చేస్తుంది. ఒక్క సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు అటువంటిది. ఇక్కడ చెప్తున్నది ఆవిడ గురించే! పాయల్ తెలుగు పాఠాలు అంటే... తెలుగు పాఠాలు పాయల్ చెప్తుందని అనుకునేరు. అసలు మేటర్ ఏంటంటే... తెలుగు పాఠాలను పాయల్ వింటున్నారు. 'ఆర్ఎక్స్ 100' తర్వాత తెలుగులో 'వెంకీ మామ', 'డిస్కో రాజా' సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించారు. 'యన్.టి.ఆర్: కథానాయకుడు'లో జయసుధగా అతిథి పాత్రలో మెరిశారు. 'సీత'లో ఐటమ్ సాంగ్ చేశారు. తెలుగులో ఇన్ని సినిమాలు చేసినప్పటికీ... ఆవిడకు తెలుగు పూర్తిగా రాదు. ఆ మాటకొస్తే... కొంచెం కొంచెం కూడా రాదు.
లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం పాయల్ ముంబైలో ఉన్నారు. ఆమె ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. ఒకవేళ ఫ్యామిలీతో పాయల్ కూడా ఢిల్లీలో ఉంటే కబుర్లు చెప్పుకొంటూ కాలక్షేపం చేసేవారేమో. ముంబైలో కరోనా ఎఫెక్ట్ వల్ల దొరికిన ఈ ఫ్రీ టైమ్లో తెలుగు నేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. బుధవారం తెలుగు పాఠాలు వినడం స్టార్ట్ చేశారు. లాక్ డౌన్ అయ్యేటప్పటికి ఎంత నేర్చుకుంటారో చూడాలి. రోజుకి కనీసం 20 చిన్న చిన్న సెంటెన్సులు నేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇంగ్లీష్ సెంటెన్స్ కి తెలుగులో మీనింగ్ రాసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు.