కొత్త ట్విస్ట్... పవన్తో నితిన్?
on Oct 27, 2020
'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్లో పవన్ కళ్యాణ్ ఓ కథానాయకుడిగా నటించనున్న సంగతి ప్రేక్షక లోకానికి తెలుసు. విజయ దశమి సందర్భంగా పవన్తో సినిమా తీస్తున్నట్టు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఇప్పుడు పవన్ చేయనున్న పాత్రకు మొదట బాలకృష్ణను అనుకున్నారు. కానీ, పని జరగలేదు. ఆ తరువాత రవితేజ దగ్గరకు వెళ్ళింది. నటించడానికి ఆయన ఓకే అన్నారు. కానీ, పవన్ సినిమా చూసి చేస్తానని చెప్పడంతో లెక్కలు మారిపోయాయి.
రవితేజను ఓ కథానాయకుడిగా అనుకున్నప్పుడు మరో కథానాయకుడి పాత్రకు రానా దగ్గుబాటి పేరు వినిపించింది. కానీ, ఇప్పుడు రానా బదులు నితిన్ పేరు వినపడుతోంది. పవన్కి నితిన్ వీరాభిమాని. అందుకని, అతడిని తీసుకుంటే బావుంటుందని అనుకుంటున్నారట. ఇంకా ఏదీ డిసైడ్ కాలేదు. ఈ సినిమాను నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ లో 'భీష్మ'తో హిట్ అందుకున్న నితిన్, ప్రస్తుతం 'రంగ్ దే' చేస్తున్నాడు. అదీ కాకుండా పవన్ సినిమా కావడంతో అతడు 'నో' అనే ప్రసక్తే లేదు. అయితే, దర్శక నిర్మాతలు ఏమనుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడు.
Also Read