టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన ఓ జంట!!
on Jul 18, 2019
ఓ వేదిక మీదో, ఓ ఫంక్షన్ లోనో, మరే ఇతర కార్యక్రమాల్లోనో ఓ జంట పదే పదే కనిపిస్తూ...కొంచెం చనువుగా ఉంటున్నారంటే చాలు ..ఇక మనకు అనుమానాలు, ఆసక్తికర కథనాలు మొదలవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి దశలోను ఉంది టాలీవుట్ లో ఓ జంట. `గీత గోవిందం` చిత్రం లో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న కలిసి నటించారు.ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇద్దరూ పోటీపడి నటించడమే కాదు..ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కుదిరిందంటూ రివ్యూస్ వచ్చాయి. గీత గోవిందం తర్వాత `డియర్ కామ్రేడ్ లోనూ విజయ్, రష్మిక కలిసి నటించారు. ఈ సినిమా ఇక విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం ఈ జంట కొచ్చి, బెంగుళూరులో హడావిడి చేసింది. దీంతో వీరిద్దరి మధ్య మరింత చనువు పెరిగింది. ఆ చనువుని అనువుగా తీసుకుని ఇప్పుడు సోషల్ నెట్ వర్క్స్ లో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్నన్యూస్ మొదలయ్యాయి.
విజయ్ మాత్రమే కాకుండా రష్మిక గా కూడా చనువు కాస్త ఎక్కువగానే తీసుకోవడం వల్ల అందరూ ఇప్పుడు అయ్యబాబోయ్ ఏంటిది అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇక ఆ మధ్య రష్మిక నిశ్చితార్థం ఆగిపోవడం వెనకాల విజయ్ కూడా ఓ కారణం అంటూ ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇక ప్రతి విషయంలో విజయ్, రష్మకకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. త్వరలో తన `రౌడీ వేర్ ` నుంచి లేడీస్ క్లాత్స్ కూడా రానున్నాయట. దీనికి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ...వాటిని ఆమె చేత ప్రమోట్ చేయించడమే కాకుండా..ఆమెతో త్వరలో ఆ బట్టలు లాంచ్ చేయించనున్నాడని తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చిందంటే టాలీవుడ్ లో ఈ జంట హాట్ టాపిక్ అవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. చూద్దాం ఎలా ఉంటుందో మరి.