అఫిషియల్.. 'లక్ష్మీ బాంబ్' కాదు.. 'లక్ష్మీ' మాత్రమే!
on Oct 31, 2020
అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన 'లక్ష్మీ బాంబ్' సినిమా టైటిల్ మారింది. హిందూ దేవత లక్ష్మి పేరును ఈ సినిమా టైటిల్కు పెట్టడంతో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ హిందూ సేన ఆందోళనలు చేయడం, టైటిల్ మార్చకపోతే నిరసన ప్రదర్శనలకు దిగుతామని హెచ్చరించడంతో టైటిల్ లోంచి 'బాంబ్'ను తీసేశారు. ఫలితంగా టైటిల్ 'లక్ష్మీ' అని మారింది. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ కానున్నది. ఈ విషయాన్ని రిలీజ్ డేట్ పోస్టర్ ద్వారా అధికారింగా ప్రకటించారు.
అలాగే ఓవర్సీస్లో కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో 'లక్ష్మీ' సినిమా విడుదల కానున్నది. ఇండియాలో మాత్రం థియేటర్లలో ఇది విడుదల కావట్లేదు. రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ 'కాంచన'కు రీమేక్గా ఈ సినిమా తయారైంది. ఒరిజినల్లో లారెన్స్ చేసిన క్యారెక్టర్ను అక్షయ్ కుమార్ చేయగా, లక్ష్మీరాయ్ క్యారెక్టర్ను కియారా చేసింది.
Also Read