రకుల్తో మరో సాంగ్ మాత్రమే బ్యాలన్స్
on Oct 24, 2020
పర్ఫెక్ట్ ప్లానింగ్తో షెడ్యూల్ టైమ్లోపు సినిమాలు తీసే దర్శకులలో క్రిష్ ఒకరు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ఓ సినిమా తెరెకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా భాగ్య నగరానికి కొంత దూరంలో ఉన్న వికారబ్ అడవుల్లో చిత్రీకరణ చేస్తున్నారు. 35 రోజుల నాన్ స్టాప్ షెడ్యూల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కి సంబంధించిన సన్నివేశాలు, పాటలు పూర్తి చేశారు క్రిష్.
రకుల్, వైష్ణవ్ తేజ్ మీద మరో సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. అది పూర్తి చేయడానికి కొంత టైమ్ ఉండటంతో హీరోయిన్కి బ్రేక్ ఇచ్చారు. శుక్రవారం వరకు హైదరాబాద్ లో క్రిష్ సినిమా షూటింగ్ చేసిన రకుల్... తరువాత ముంబై వెళ్లారు. అర్జున్ కపూర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. క్రిష్ సినిమాలో ఆమె పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనున్నారు. అది తనకు డ్రీమ్ రోల్ అని చెబుతున్నారు.
Also Read