సుశాంత్ సూసైడ్ కేస్: చిక్కుల్లో రకుల్, రానా?
on Aug 12, 2020
సుశాంత్ ఆత్మహత్య కేసు తిరిగి తిరిగి చివరకు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు దగ్గరకూ వచ్చింది. ఈ మర్డర్ మిస్టరీ లో మొదటి నుండి సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రియా చక్రవర్తి ఎవరెవరికి ఫోన్లు చేశారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
రియా చక్రవర్తి నుండి ఫోన్లు వెళ్లిన ప్రముఖుల్లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్ ఉన్నారు. అమీర్ కి అయ్యా ఒకసారి ఫోన్ చేయగా ఆయన మూడు ఎస్ఎంఎస్ లు చేశారు. ఆదిత్య కి 16 సార్లు ఫోన్ చేయగా అతడు ఆమెకు ఏడు సార్లు ఫోన్ చేశాడు. శ్రద్ధా కపూర్ కి మూడు సార్లు ఫోన్ చేయగా ఆమె రెండు సార్లు తిరిగి ఫోన్ చేసింది.
బాలీవుడ్ నటీనటులను పక్కన పెడితే... రానా దగ్గుబాటికి రియా చక్రవర్తి నుండి ఏడు సార్లు ఫోన్ చేసింది. అతడు ఆమెకు నాలుగు సార్లు ఫోన్ చేశాడు. రకుల్ కి అయితే రియా నుండి ఏకంగా 30 సార్లు ఫోన్ వచ్చింది. రియాకి రకుల్ 14 సార్లు ఫోన్ చేసింది. రెండుసార్లు ఇద్దరు ఎస్ఎంఎస్ చేసుకున్నారు. దాంతో రియా చక్రవర్తి తో వీళ్ళిద్దరికీ సంబంధం ఏమిటని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. వీళ్ళిద్దరూ చిక్కుల్లో పడతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య విషయమై మాట్లాడడానికి ఫోన్ చేసిందా? లేక సాధారణంగా అంతకుముందు పరిచయం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. రకుల్, రియా స్నేహితులని తెలుస్తోంది.
Also Read