ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాస్తో?
on Aug 12, 2020
'కెజిఎఫ్'తో ప్రశాంత్ నీల్ పేరు తెలుగు, హిందీ సినిమా ఇండస్ట్రీలలో విపరీతంగా వినిపించింది. హీరోయిజమ్ బేస్ చేసుకుని సినిమాలు తీసే దర్శకులను తెలుగు, హిందీ హీరోలు అమితంగా ఇష్టపడతారు. అటువంటిది ఏకంగా హీరోయిజమ్ మీద సన్నివేశాలు రాసుకుని రెండున్నర గంటలు ప్రేక్షకులను థియేటర్లలో హ్యాపీగా కూర్చోబెట్టిన దర్శకుడిని వదులుతారా? యుంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో అతడితో సినిమా ఓకే చేశాడు. పరోక్షంగా దర్శకుడు కూడా అదే విషయం ట్వీట్ చేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుంది. అయితే, ఈ సినిమా కంటే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడట.
మైత్రీకి కంటే ముందు 'కెజిఎఫ్' నిర్మాతలకు ఒక సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ ఓకే అన్నాడు. అతడిని నమ్మి కోట్లు ఖర్చుపెట్టి, దేశవ్యాప్తంగా అతడికి గుర్తింపు రావడానికి కారణమైన నిర్మాతలకు మరో సినిమా చేయడానికి ఒప్పుకోవడంలో తప్పు లేదు. ఎన్టీఆర్ సినిమా తరవాత వాళ్లకు సినిమా చేయాలని అతడు అనుకున్నాడు. ప్రభాస్ హీరోగా 'కెజిఎఫ్' నిర్మాతలు సినిమా ప్లాన్ చేస్తుండటంతో మొత్తం సీన్ మారేలా ఉంది. నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా సమాంతరంగా చేయడానికి ప్రభాస్ ఓకే అంటే ఈక్వేషన్లు మారతాయి. ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాస్తో ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి వస్తుంది.
Also Read