మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తో పూరి హీరోయిన్?
on Dec 3, 2020
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా ఈ రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి మెలోడీస్ స్పెషలిస్ట్ గోపీసుందర్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో పూజతో పాటు మరో కథానాయిక కూడా సందడి చేయనుందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. అతిథి తరహా పాత్ర అయిన ఆ క్యారెక్టర్ లో నేహా శెట్టి మెరుస్తుందని తెలిసింది. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మెహబూబా చిత్రంతో నేహ తెలుగు తెరకు నాయికగా పరిచయమైంది. మరి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయినా నేహకి సక్సెస్ ని అందిస్తుందేమో చూడాలి.
2021 జనవరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సిల్వర్ స్క్రీన్ పైకి రానున్నాడు.
Also Read