అల్లుడు శీనుతో రకుల్ రెండోసారి?
on Jun 12, 2018
బెల్లంకొండ శ్రీనివాస్.. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'అల్లుడు శీను' తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో.. మిగతా యువ హీరోలకు భిన్నంగా మొదటి నుండి కమర్షియల్ సినిమాలకే ఓటేస్తున్నాడు.. అలానే తన సినిమాలో స్టార్ హీరోయిన్లు ఉండేలా చూసుకుంటాడు.. మొదటి సినిమాలోనే సమంతతో కలిసి నటించిన శ్రీనివాస్.. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' సినిమాలో రకుల్ ప్రీతి సింగ్ తో కలిసి నటించాడు.. అయితే ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా చేస్తున్న శ్రీనివాస్, తరువాత చేయబోయే సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది.. రకుల్ కూడా శ్రీనివాస్ తో సినిమా చేయడానికి అంగీకరించిందట.. చూద్దాం మరి వీళ్ళ కాంబినేషన్లో రెండో సినిమా ఎంతలా ఆకట్టుకుంటుందో.