బాలీవుడ్డా.. మై ఫుట్!
on Nov 13, 2017
హీరోయిన్లందరూ బాలీవుడ్ వైపు చూస్తుంటే... మన జేజమ్మ మాత్రం ‘బాలీవుడ్డా మై ఫుట్’ అనేసింది. దర్శకుడు కరణ్ జోహార్ తనంతట తానొచ్చి అవకాశం ఇస్తానంటే.. సున్నితంగా తిరస్కరించింది. దటీజ్ అనుష్క. వివరాల్లోకెల్తే..‘బాహుబలి’ లో అనుష్కను చూసినప్పుడే.. కరణ్ అనుకున్నాడట. ‘ఎలాగైనా.. ఈ అమ్మాయితో ఓ సినిమా చేయాలి’ అని. తాను చేస్తున్న ‘తమాషా’ సినిమాలో అనుష్కను కథానాయికగా తీసుకోవాలనుకున్నాడు. కానీ.. జేజమ్మ.. ‘ఆ పాత్రను నేను కరెక్ట్ కాదు. ఇంకెవర్నయినా చూసుకోండి’ అని తిరస్కరించిందట.
దీని వెనుక ప్రభాస్ హ్యాండ్ ఉందని కూడా చాలామంది అంటున్నారు. ప్రభాస్ తో కూడా కరణ్ జోహార్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. అయితే... ప్రభాస్ 20 కోట్లు పారితోషికం అడగడంతో వెనక్కుతగ్గాడు. దీనిపై సెటైరికల్ గా ఓ ట్వీట్ కూడా చేశాడు. ఆ దురహంకారానికి అడ్డుకట్ట వేస్తూ.. జేజమ్మ ఇలా షాక్ ఇవ్వడం కరణ్ జోహార్ కి అస్సలు మింగుడు పడటం లేదని టాక్. ఏది ఏమైనా కరణ్ కు తగిన శాస్తి జరిగింది. ఏమంటారు.