అల్లు అరవింద్ ను చెర్రీ తప్పించుకుంటున్నాడా..?
on May 26, 2016
అల్లు ఫ్యామిలీది మెగా కుటుంబానిది విడదీయలేని అనుబంధం. ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడ్పడుతూ, రెండు కుటుంబాలు ఇండస్ట్రీలో ఎదిగాయి. చిరు, అల్లు అరవింద్ ల జమానాలో అద్భుతంగా ఉన్న వీళ్లిద్దరి రిలేషన్, ఇప్పుడు వీక్ అవుతోందా..? కొత్త జనరేషన్ డిస్టన్స్ మెయింటెయిన్ చేస్తున్నారా..? ఫిల్మ్ నగర్ లో ప్రస్తుతం ఈ విషయం మీదే చర్చ నడుస్తోంది. చెర్రీ అల్లు అరవింద్ ను అవాయిడ్ చేస్తున్నాడంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ నిర్మాణంలోనే తనీ ఒరువన్ రీమేక్ తెరకెక్కుతోంది. అయితే, ప్రకటించి చాలాకాలమే అయినా ఇప్పటి వరకూ సినిమా షూట్ స్టార్ట్ అవలేదు. ఇప్పటికే రెండు సార్లు చరణ్ షూటింగ్ ను క్యాన్సిల్ చేయించాడట. షెడ్యూల్ ఎందుకు క్యాన్సిల్ చేయించాడనేదానికి, వెరైటీ రీజన్స్ చెబుతున్నాడట చరణ్.
ఓ పక్క బయటి హీరోలు, మెగా హీరోలు అందరూ వరసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను స్పీడప్ చేసే పనిలో ఉంటే, చెర్రీ మాత్రం ధృవను లేట్ చేస్తూ, అరవింద్ ను అవాయిడ్ చేస్తున్నాడని ఫీలవుతున్నారు మెగాభిమానులు. మరోపక్క విలన్ గా చేస్తున్న అరవింద్ స్వామికి భారీ రెమ్యునరేషన్ ముట్ట చెప్పి డేట్స్ తీసుకున్నారు. ఆ డేట్స్ అయిపోయాయంటే, ఇక మళ్లీ ఎమౌంట్ చెల్లించాల్సిందే. ఇది అరవింద్ కు కూడా తలకు మించిన భారంగా మారుతుంది. సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా కూడా ఈ ఆలస్యం గురించే తప్పుకున్నాడని అంటున్నారు. సరైనోడు సక్సెస్ తో పాటు, ఆలిండియా అల్లు ఫ్యాన్స్ సెపరేట్ గా ఏర్పడటం, పవన్ గురించి బన్నీ మాట్లాడకపోవడం లాంటివన్నీ ఈ విభేదాలకు కారణాలని చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే, బన్నీ వెళ్లిపోయిన తర్వాతే చెర్రీ ఒక మనసు ఆడియోకు వచ్చాడట. ఏదేమైనా ఈ విభేదాలు సమసిపోవాలని, మళ్లీ అల్లు, కొణిదెల కుటుంబాలు కలిసి సక్సెస్ సాధించాలనేది మెగా ఫ్యాన్స్ ఆశ.