LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భవిష్యత్ ను దర్శించడంలో దిట్ట. ఆయన ఏం చేసినా తరతరాలు నిలబడిపోయేలా ఉంటుంది. సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా అంతే. ఆయన ఒక ట్రెండ్ సృష్టిస్తారు. ముందు విమర్శలు చేసిన వారు కూడా తరువాత ప్రశంసలు గుప్పించేలా ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కార్యాచరణ ఉంటుంది. అందుకే ఆయనపై ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్ని విమర్శలు గుప్పించినా, ఆరోపణలు చేసినా జనం వాటిని విశ్వసించరు.  గతంలో చంద్రబాబు ఆరంభించి, ప్రారంభించిన పలు పథకాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవ్వడమే చంద్రబాము ముందు చూపుకూ, వాస్తవిక దృక్ఫథానికీ నిదర్శనంగా పరిశీలకులు చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గతంలో ప్రారంభించి అమలు చేసిన ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు. అంతే కాదు.. ఆ పథకానికి అప్పట్లో చంద్రబాబు పెట్టిన పేరునే కంటిన్యూ చేస్తూ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆ పథకం ఏమిటనుకుంటున్నారా.. రంజాన్ తోఫా. ఔను రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ ను పురస్కరించుకుని వారి ఇళ్లల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు దోహదం చేసేలా రంజాన్ తోఫా అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద ముస్లింలకు అవసరమైన పండుగ సరుకులను అందజేశారు. అంతేనా హిందువులకు సంక్రాంతి కానుక, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక అందజేశారు. ఈ పథకాలకు బ్రహ్మాండమైన ప్రజాదరణ లభించింది.   ఇప్పుడు  మోడీ కూడా ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రంజాన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న 32 లక్షల పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన రంజాన్ తోఫాను యాజ్ ఇట్ ఈజ్ గా అదే పేరుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.  
 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ పగడాల  ప్రవీణ్ కుమార్(46)  అనుమానాస్పదస్థితిలో మరణించాడు. డెడ్ బాడీపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ పక్కనే ప్రవీణ్ మృతదేహం పడి ఉంది. స్పాట్ లోనే రక్తపు మరకలతో ఉన్న కర్ర ముక్కలు ముక్కలుగా ఉండటంతో డెత్ మిస్టరీ వీడలేదు. పాస్టర్ మృతితో ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనమైంది. డెడ్ బాడీ రాజమండ్రి  రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం చేస్తున్నారు.  రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని  గామన్ బ్రిడ్జి రహదారిపై మృతదేహం కనిపించింది.  క్రైస్తవ సంఘాలు డెత్ మిస్టరీ చేధించాలని నిరసనకు దిగాయి. పోస్టర్లు అంటించాయి.  హైద్రాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ లగేజి కట్టుకుని రాజమహేంద్రవరం బయలు దేరారు.  గామన్ బ్రిడ్జి టోల్  గేట్ దాటగానే పాస్టర్ మృతదేహం కనిపించింది. కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద ప్రవీణ్ కుమార్ బుల్లెట్ పల్లపు ప్రాంతంలో పడిపోయింది.  ప్రమాదవశాత్తు ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న బుల్లెట్  లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.  పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై ఐటీ మంత్రి లోకేశ్  దిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. 
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫార్మ్ డి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పని చేస్తున్న అంజలి అనే ఫార్మసీ విద్యార్థిని  బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది.  హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ దీపక్ లైంగిక వేధింపులకు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నానంటూ అంజలి రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ దీపక్ తనను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు అంజలి పేర్కొంది.   ఏలూరు జిల్లా జీలుగుమిల్లికి చెందిన అంజలి   అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ అంజలి బంధువులు, విద్యార్థులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. దీపక్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి పరిస్థితి అదుపు చేశారు. అంజలి తండ్రి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజమహేంద్రవరం, రాజానగరం ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు వచ్చి అంజలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.   
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తునకు కేంద్రం పచ్చ జెండా ఊపేసిందా?  ఏపీ మద్యం కుంభకోణంపై లోక్ సభలో ప్రస్తావించిన నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) ప్రత్యేకంగా భేటీ అయ్యి తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అంద చేశారు.  అయితే విశ్వసనీయ సమాచారం మేరకు లావు అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనతో భేటీ కాలేదనీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే స్వయంగా లావును పిలిపించుకుని మద్యం కుంభకోణంపై ఆరా తీశారు. ఆ సందర్భంగా ఎంపీ ఇచ్చిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఇది జరిగిన తరువాత ఎంపీ లావు బుధవారం (మార్చి 26) అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వరుసగా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై తెలుగుదేశం ఎంపీ డిమాండ్ కు కేంద్ర హోంమంత్రి  సానుకూలంగా స్పందించారనీ, ఈడీని రంగంలోకి దించేందుకు అంగీకరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.   వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో  అమలు చేసిన మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. జగన్ మద్యం పాలసీ దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా తెలుగుదేశం మొదటి నుంచీ చెబుతూ వస్తున్నది. ఏపీ మద్యం కుంభకోణంతో పోలిస్తే.. ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని తెలుగుదేశం వాదిస్తోంది. ఏపీ మధ్యం కుంభకోణం వేల కోట్లేనని అంటోంది. ఏపీలో మూడు మద్యం విషయంలో మూడు స్థాయిలలో అవినీతి జరిగిందని లోక్ సభ వేదికగా లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆరోపించారు.   ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్.. మూడింటినీ వైసీపీ నేతలు తమ అధీనంలో ఉంచుకుని అక్రమాలకు పాల్పడ్డారని లావు లోక్ సభలో సోదాహరణంగా చెప్పారు. అంతే కాకుండా ఈ మద్యం కుంభకోణం సొమ్ము దాదాపు 4 వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించేశారని లావు ఆరోపించారు.  మొత్తం మీద లావు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించిన తరువాత కేంద్రం కూడా ఏపీ మద్యం కుంభకోణం నిగ్గు తేల్చాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. దీనిపై   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనీ, ప్రస్తుతం ఏపీ మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణలో విదేశాలకు మద్యం సొమ్ము తరలినట్లు నిర్ధారణ కావడంతో ఇక ఈడీని కూడా రంగంలోకి దింపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ఆ కారణంగానే కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నారు.  
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు టూరిజంను బాగా ప్రమోట్ చేశారని  తెలంగాణలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘ గతంలో  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజం ప్రధానం  అనేవారు. ఏ ఇజం లేదన్నప్పుడు మాకు కోపం వచ్చేది. నిజంగా ఖర్చులేనిది ఏదైనా ఉందంటే అది టూరిజం’ అని  కూనంనేని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ మీద ప్రసంగిస్తున్న సమయంలో కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. వామ పక్ష పార్టీలకు బిజెపి బద్ద శత్రువు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి టిడిపి మిత్రపక్ష పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి  సిపిఐ మిత్ర పక్షంగా ఉంది. కాంగ్రస్కు బద్ద శత్రువు బిజెపి.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో సిపిఐ పోటీ చేసింది. ఉమ్మడి పది జిల్లాల్లో 30 సీట్లలో సిపిఐకి 10 వేల ఓట్ బ్యాంక్ ఉందని కూనం నేని పలు సందర్బాల్లో చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు  బిఆర్ఎస్ కు మిత్ర పక్షంగా ఉన్న సిపిఐకి  మిత్ర ధర్మంగా ఒక్క స్థానం ఇస్తామని కెసీఆర్ ఖరాఖండిగా  చెప్పడంతో బిఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో రావడానికి సిపిఐ ముఖ్య భూమిక వహించింది. పార్టీలకు, పొత్తులకతీతంగా కూనంనేని కుండబద్దలు కొట్టి మాట్లాడటం చర్చనీయాంశమైంది
ALSO ON TELUGUONE N E W S
  ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా.. తనని తాను మార్చుకోవడం ఎన్టీఆర్ కి అలవాటు. ప్రతి సినిమాలోనూ లుక్స్ పరంగా ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తుంటాడు. కానీ, ఆఫ్ స్క్రీన్ లుక్స్ పరంగా మాత్రం.. తారక్ పెద్దగా కేర్ తీసుకోడనే పేరుంది. అయితే ఇప్పుడు దానికి కూడా చెక్ పెడుతున్నాడు. (Jr NTR)   ఎన్టీఆర్ బయట ఎక్కువగా క్యాజువల్ వేర్ లోనే కనిపిస్తుంటాడు. స్టైలింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా కనిపించడు. అలాంటి తారక్ ఉన్నట్టుండి పూర్తిగా స్టైల్ మార్చేశాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ మార్చి 28న జపాన్ లో విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన తారక్.. తన ఆఫ్ స్క్రీన్ లుక్స్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఎప్పుడూ కనిపించని విధంగా సరికొత్త స్టైలింగ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. స్టైలింగ్ విషయంలో ఎన్టీఆర్ లో ఒకేసారి ఇంత మార్పు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.    'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ పొందాడు. అలాగే ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. భవిష్యత్ లోనూ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేసే ఆలోచనలో తారక్ ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' నుంచి ఎన్టీఆర్ సంబంధించిన న్యూస్ నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో రావడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో ఆయన లుక్స్ గురించి కూడా చర్చ జరిగే అవకాశముంది. అందుకే స్టైలింగ్ విషయాన్ని ఇంతకాలం పెద్దగా పట్టించుకోని ఎన్టీఆర్.. ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. దాని ఫలితంగానే జపాన్ టూర్ లో ఎన్టీఆర్ స్టైలింగ్ లో ఇంత మార్పు కనిపించిందని అంటున్నారు. తారక్ లేటెస్ట్ స్టిల్స్ చూసి, ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ విషయంలో.. ఎప్పుడూ ఇలాగే కేర్ తీసుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.  
స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara)ప్రస్తుతం 2020 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న'మూకుత్తి అమ్మన్‌'(Mookuthi Amman)కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'మూకుత్తి అమ్మన్‌ 2 (Mookuthi Amman 2)లో చేస్తున్న విషయం తెలిసిందే.మొదటి భాగం 'అమ్మోరు తల్లి'గా తెలుగులోకి కూడా డబ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందింది.ప్రముఖ నటుడు,దర్శకుడు ఆర్జే బాలాజీ పార్ట్ 1 కి దర్శకత్వం వహించగా, రెండవ భాగానికి సీనియర్ దర్శకుడు సుందర్ సీ(Sundar c)దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా అసిస్టెంట్ డైరెక్టర్,నయనతారకి మధ్య లొకేషన్ లో గొడవ జరిగిందని, దీంతో సుందర్ షూట్ ని ఆపేశారనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పుడు ఈ విషయంపై సుందర్ వైఫ్ ప్రముఖ నటి ఖుష్బూ 'ఎక్స్' వేదికగా స్పందిస్తు రూమర్స్ సృష్టించే వాళ్ళు రెస్ట్ తీసుకోండి.ఎందుకంటే ఇలాంటి రూమర్స్ ని సుందర్ అసలు పట్టించుకోరు.అనుకున్న ప్రకారమే మూకుత్తి అమ్మన్‌ 2 రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకుంటుంది.నయనతార చాలా మంచి నటి.గతంలో ఆమె చేసిన క్యారక్టర్ ని మళ్ళీ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.మా సినిమాకి ఎప్పడు మీ సపోర్ట్ కావాలి.సుందర్ నుంచి మరో బ్లాక్ బస్టర్ వస్తుంది రెడీ గా ఉండండని ట్వీట్ చేసింది.దీంతో మూకుత్తి అమ్మన్‌ 2 షూట్ ఆగిందనే న్యూస్ నిజంగానే రూమర్ గా మిగిలింది. తమిళనాట ఉన్న అగ్ర దర్శకుల్లో సుందర్ సి కూడా ఒకరు.రజనీకాంత్ హిట్ మూవీ 'అరుణాచలం' మూవీకి సుందర్ నే దర్శకుడు.అదే పేరుతో తెలుగులో కూడా విడుదలై   మంచి విజయాన్ని అందుకుంది.కమల్ హాసన్,శరత్ కుమార్ వంటి అగ్ర హీరోలతో కూడా సుందర్ సినిమాలని తెరకెక్కించాడు.సుమారు 30 సినిమాల దాకా ఆయన లిస్ట్ లో ఉన్నాయి.    
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం చేస్తున్న 'విశ్వంభర'(Vishwambhara)తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం'ఫేమ్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.షూటింగ్ స్టార్టింగ్ కాకముందే 2026 సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు.దీంతో అనిల్ రావిపూడి ఈ మూవీకి సంబంధించిన అన్ని విభాగాలకి చెందిన పనుల్లో బిజీగా ఉన్నాడు.   ఇప్పుడు ఈ మూవీ ఈ నెల 30 న పూజా కార్యక్రమాలతో ఉగాది రోజున ప్రారంభం కానుంది.ఆ తర్వాత జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.చాలా కాలం తర్వాత చిరు కుటుంబ నేపథ్యంతో పాటు పూర్తి వినోదాత్మకంతో కూడిన కథలో చేస్తుండటం,అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో ఈ మూవీపై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.చిరు తరహా యాక్షన్ సన్నివేశాలకి కూడా లోటు లేని విధంగా అనిల్ స్క్రిప్ట్ ని రూపొందించినట్టుగా కూడా  తెలుస్తుంది.చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారని,ఒక హీరోయిన్ గా అదితిరావు హైదరి చేస్తుందనే ప్రచారం జరుగుతుంది.అదితి పలు తెలుగు,హిందీ భాషల్లో ఎన్ని సినిమాలు చేసింది.ఇటీవల ప్రముఖ హీరో సిద్దార్ధ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా చిత్రాన్ని బాలకృష్ణ(Balakrishna)తో భగవంత్ కేసరి ని నిర్మించి హిట్ ని అందుకున్న'సాహు గారపాటి',చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.'సంక్రాంతికి వస్తున్నాం'ని మ్యూజికల్ హిట్ గా కూడా నిలిపిన భీమ్స్ సిసోరియా(Bheems Ceciroleo)సంగీతాన్నిఅందిస్తున్నాడు.    
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)పుష్ప 2(Pushpa 2)తర్వాత త్రివిక్రమ్(trivikram)తమిళ దర్శకుడు అట్లీ(Atlee)తో తన తదుపరి  చిత్రాలు కమిట్ అయిన విషయం తెలిసిందే.కొన్నినెలల క్రితం త్రివిక్రమ్ మూవీ అధికారకంగా ప్రారంభమయ్యింది.దీంతో త్రివిక్రమ్ మూవీనే ముందుగా సెట్స్ పైకి  వెళ్తుందని అందరు భావించారు.కానీ అట్లీ మూవీనే ముందుగా షూట్ కి వెళ్తుందనే ప్రచారం జరుగుతుంది.ఏది ఏమైనా అల్లుఅర్జున్ తదుపరి చెయ్యబోయే సినిమా విషయంలో  మరికొన్నిరోజుల్లో క్లారిటీ రానుంది. అల్లుఅర్జున్,త్రివిక్రమ్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై చినబాబు,నాగవంశీ(Nagavamsi)నిర్మిస్తున్నారు.రీసెంట్ గా నాగవంశీ ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు బన్నీ,త్రివిక్రమ్ మూవీ పౌరాణిక చిత్రంగా తెరకెక్కనుంది.మన పురాణాల్లో ఒక దేవుడు గురించి అందరకి తెలిసినప్పటికీ,ఆయన జీవితంలో ఏం జరిగిందో పెద్దగా ఎవరకి తెలియదు.ఆ కోణాన్నే మా చిత్రంలో భారీగా చూపించబోతున్నాం.అలా అని అల్లుఅర్జున్ క్యారక్టర్ పూర్తిగా ఫిక్షనల్ ఏమి కాదు.తెలుగు చిత్ర పరిశ్రమ పౌరాణిక చిత్రాలని తెరకెక్కించడం ఎందుకు ఆపేసిందో అర్ధం కావడం లేదు.మేము నిర్మించే ఈ మూవీ స్థాయిని చూసి భారతదేశం మొత్తం ఆశ్చర్యపోతుందని చెప్పుకొచ్చాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి,సన్ ఆఫ్ సత్య మూర్తి,అల వైకుంఠపురం వంటి చిత్రాలు వచ్చి ఒక దాన్ని మించి ఒకటి విజయం సాధించాయి.దీంతో రాబోయే మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు.నాగ వంశీ మాటలు అంతకు మించి ఉండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.        
భారతీయ సినిమాకి సరికొత్త కథల్ని,టేకింగ్ ని పరిచయం చేసిన దర్శకుల్లో భారతిరాజా(Bharathiraja)కూడా ఒకరు.పేరుకి తమిళ దర్శకుడే అయినా,ఆయన తమిళంతో పాటుఇతర భాషల్లోను సినిమాలు తెరకెక్కించి నాలుగు దశాబ్డల క్రితమే పాన్ ఇండియా డైరెక్టర్ గా తన హవా కొనసాగించారు.తెలుగులో చిరంజీవితో చేసిన ఆరాధన,కార్తీక్,ముచ్చర్ల అరుణల గ్రేటెస్ట్ లవ్ స్టోరీ సీతాకోక చిలుక,ఎర్రగులాబీలు,టిక్ టిక్ టిక్,జమదగ్ని,కొత్త జీవితాలు,యువతరం పిలిచింది,ఈ తరం ఇల్లాలు వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.బాలకృష్ణ వన్ ఇయర్ మూవీ మంగమ్మగారి మనవడుకి కథ కూడా భారతి రాజా నే ఇచ్చారు.గత సంవత్సరం విజయ్ సేతుపతి(Vijaysethupathi)తో కలిసి 'మహారాజ'(Maharaja)మూవీలో 'క్షురకుడు' గా నటించి తన సత్తా చాటారు.  భారతి రాజాకి మనోజ్ భారతిరాజా(Manoj bharathiraja)అనే కొడుకు,జనని ఐశ్వర్య అనే కూతురు ఉన్నారు. నిన్న రాత్రి కుమారుడు మనోజ్ భారతీరాజాకి  గుండె పోటు రావడంతో చెన్నై లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు.చివరకి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.మనోజ్ వయసు 48 సంవత్సరాలు కాగా భార్య నందన ఇద్దరు పిల్లలు ఉన్నారు.తన తండ్రి దర్సకత్వంలో వచ్చిన 'తాజ్ మహల్'మూవీతో తమిళంలో హీరోగా పరిచయమైన మనోజ్ ఆ తర్వాత సముదిరం,అల్లిఅర్జున,పల్లవన్ ఇలా సుమారు 14 చిత్రాల దాకా ప్రాధాన్యత గల పాత్రల్లో నటించారు.చివరిగా 2022 లో 'విరుమన్' అనే చిత్రంలో కనపడ్డాడు. ఒక సినిమాకి కూడా మనోజ్ దర్శకత్వం వహించడం జరిగింది. ఇక మనోజ్ మృతి పట్ల తమిళ చిత్ర సీమతో పాటు దక్షిణ సినీ పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.        
Siddharth, Madhavan have come together to star in a Netflix original, Test. People did not see them together regularly on screen post a film like Yuva. Mani Ratnam brought these powerhouse talents together in their raw form for his political drama. Now, they are back together with Test.  Nayanthara is playing the leading lady role in the film. The movie talks about lives of three people whose future depends on an International Test Match. Madhavan needs funding for his eco-friendly project while Siddharth is playing the role of cricketer, Arjun. Nayanthara is playing wife of Madhavan and friend of Arjun.  A bookie gets involved in the Test match and Rs.50,000 crores are put on line. Who will prosper in this kind of a test of character? We have to wait and see. The movie looks well produced and very interestingly made. The trailer doesn't give us a feel of other underwhelming Netflix projects.  It intrigues while also engaging us with this well made trailer. Meera Jasmine will be seen playing the role of Arjun's wife in the film. The movie is releasing on 4th April on Netflix and we have to wait and watch, if the movie delivers on the promising trailer. 
Thalapathy Vijay has announced that he will acting in onne last film before completely shifting his focus to Politics. He started huge public meetings for his party TVK and started finishing his commitment for Jana Nayagan, his final film. He will finish shooting for the film by August and then will be campaigning, it seems.  Now, the makers have announced Jana Nayagan release date for 9th January 2026, Pongal. On the other hand, Dawn Pictures have announced Sivakarthikeyan's Parasakthi release for Pongal. The producer has officially confirmed this. Vijay fans started abusing Sivakarthikeyan and producer for clashing with their idol's swan song.  Several reports suggest that DMK, the ruling party, is behind Dawn Pictures and they have encouraged this clash further. Few suggest that Dawn Pictures have announced release timing while starting the shoot itself and hence, Vijay came for clash not viceversa.  Majorly, reports suggest that Sivakarthikeyan normally doesn't want to clash with big stars but he even doesn't want to lose Pongal advantage. He believes two big films can survive during Pongal festival and hence, he has asked his close circles to see it as coming together for festival than a clash.  Vijay, on the other hand, wants to use these tactics as advantage to promote his political agenda, stating that big parties fear him and his presence. Well, the political rivalry between DMK and TVK is the major fuel for this Sivakarthikeyan vs Vijay clash at the box office, say observers.  But Vijay fans are upset that when their idol himself nominated him as his successor, why is Sivakarthikeyan looking to clash with him. While Ajith and Rajinikanth fans are happy that a solo Pongal release would not be possible for Vijay. Interesting times, ahead, we have to say.
Robinhood starring Nithiin, Sreeleela movie has got ticket hikes from AP Government upto Rs.50 in Single Screens and Rs.75 in Multiplexes. Reports started going afloat that the hikes will be applied all over AP, raising prices for a Nithiin film, too. But the makers have clarified that it is not the case.  They have stated that they do not intend to hike prices for every film, rather they wish to provide a wholesome entertainer in theatres at affordable prices. They clarified that the hikes will be applicable only at few premium places and not everywhere. They clearly stated that in Telangana, they did not apply for hikes.  Their official statement reads, "There are unverified reports & news that Robinhood will have hiked prices in theatres. All these are completely baseless. Our intention with the film is to give wholesome entertainment at affordable prices. The hikes are only applicable at a few select premium locations in Andhra Pradesh. The rest of Andhra Pradesh and total Telangana will have normal prices at all centres. Enjoy Robinhood at your nearest theatres and get entertained to the fullest." Well, the Venky Kudumula directorial is releasing on 28th March and inclusion of David Warner has increased its hype and buzz. The movie bookings have been opened all over and we have to see if it performs better over MAD Square, a sequel to a popular blockbuster. 
నార్నేనితిన్(Narne Nithin)సంగీత్ శోభన్(Sangeeth Shobhan)రామ్ నితిన్,విష్ణు,ప్రియాంక జువాల్కర్(Priyanka jawalkar)త్రయంలో 2023 లో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'మాడ్'.యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా మంచి విజయాన్నే నమోదు చేసింది.దీంతో ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న మాడ్   సీక్వెల్'మాడ్ స్క్వేర్' పై అందరిలోను భారీ అంచనాలున్నాయి.రీసెంట్ గా 'మాడ్ స్క్వేర్’కి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇదేనంటు ఒక వార్త  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ప్రేక్షకులకి 'మాడ్' ని మించిన ఎంటర్ టైన్ మెంట్ 'మాడ్ స్క్వేర్' ద్వారా దొరకడం ఖాయం.మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ కార్డు వరకు ఎక్కడా కూడా ఈ ఫ్లో మిస్ అవ్వకుండా సాగిందని,సీక్వెల్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని సెన్సార్ వాళ్ళు అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.సెకండ్ పార్ట్ అంతా లడ్డు పెళ్లి చుట్టూ తిరుగుతుంది.ఆ పెళ్లి కోసం అందరూ కలిసి గోవాకు వెళ్తారు.అక్కడ ఏం జరిగింది అనేది అసలు కథ అని కాకపోతే రన్ టైం 2 గంటల 10 నిమిషాలే ఉందని,మరో 20 నిమిషాలు నిడివి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని కూడా సెన్సార్ వాళ్ళు వ్యక్తం చేసారని కూడా అంటున్నారు.మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు.ఆల్రెడీ యూనిట్ కూడా పొట్ట చెక్కలయ్యే ఎంటర్టైన్మెంట్ ఖాయమని ప్రమోషన్స్ లో చెప్తున్న విషయం తెలిసిందే.  మాడ్ స్క్వేర్ కి  భీమ్స్ సిసిరోలియో(Bheems ceciroleo)సంగీతాన్ని అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్(Thaman)అందించాడు.మొదటి భాగాన్ని నిర్మించిన సితార ఎంటర్ టైన్  మెంట్ నే ఈ చిత్రాన్నికూడా నిర్మించింది.కళ్యాణ్ శంకర్(Kalyan Shankar)దర్శకత్వం వహించాడు.  
  'రాబిన్ హుడ్'  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు. (David Warner)   నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాబిన్ హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్ర పోషించాడు. మార్చి 23న 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. వార్నర్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే ఈ వేడుకలో ఆయనకు ఊహించని అవమానం జరిగింది. (Robinhood)   'రాబిన్ హుడ్'లో కీలక పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్ ఈ ప్రీ ఈవెంట్ లో వార్నర్ గురించి మాట్లాడుతూ నోరు జారారు. "వెంకీ కుడుముల, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ ని పట్టుకొచ్చారు. ఈ వార్నర్ ని క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్పులేస్తున్నాడు. దొంగ ముండా కొడుకు.. మామూలోడు కాదు. రేయ్ వార్నర్.. బి వార్నింగ్" అని రాజేంద్రప్రసాద్ అన్నారు. (Rajendra Prasad)   రాజేంద్రప్రసాద్ సరదాగా మాట్లాడుతున్నాను అనుకొని ఉండొచ్చు. కానీ, ఒక పబ్లిక్ ఈవెంట్ లో.. 'దొంగ ముండా కొడుకు' అని ఒక స్టార్ క్రికెటర్ ని అనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయంపై క్షమాపణలు చెబుతూ తాజాగా రాజేంద్రప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశారు.   "నాకు వార్నర్ అంటే ఇష్టం. అతని క్రికెట్ అంటే ఇష్టం. అలాగే వార్నర్.. మన తెలుగు సినిమాలను, తెలుగు నటులను ఇష్టపడతాడు. మేము ఒకరికొకరం బాగా క్లోజ్ అయిపోయాం. నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాకపోయినా, జరిగిన సంఘటన వల్ల మీ మనసు బాధపడినట్లయితే.. మీ అందరికీ క్షమాపణలు." అని రాజేంద్రప్రసాద్ అన్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.
  మూర్ఛ.. చాలా మందికి పెద్దగా అవగాహన లేని వ్యాధి ఇది.  ఈ వ్యాధి బారిన పడేవారు ఆ కుంటుంబానికి తప్ప ఈ జబ్బు గురించి తెలిసిన వారు తక్కువే. నాడీ మండలాన్ని ప్రభావితం చేసే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది.  ఈ మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం మార్చి 26వ తేదీన మూర్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ మూర్ఛ దినోత్సవాన్ని  పర్పుల్ డే అని కూడా పిలుస్తారు. మూర్ఛ అవగాహనకు మద్దతుగా  ఊదా రంగును ధరించమని,  ఊదా రంగు రిబ్బన్ ఈ మూర్ఛ వ్యాధిని సూచిస్తుందని చెబుతారు.   నాడీ సంబంధిత పరిస్థితి మూర్ఛ, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, దీనివల్ల మూర్ఛ మాత్రమే కాకుండా  ఇతర లక్షణాలు కనిపిస్తాయి. మూర్ఛ  కారణం,  రకాన్ని బట్టి  దీని చికిత్స  మారుతుంది.  మూర్ఛ వ్యాధికి  అసలు కారణాలు ఏంటి?  దీని నివారణకు ఏం చేయాలి? తెలుసుకుంటే.. మూర్చకు కారణాలు.. ప్రమాదవశాత్తు మెదడు గాయం కావడం వల్ల మూర్ఛ  వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. జన్యుపరంగా కొందరిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.  కుటుంబంలో ఎవరికైనా వంశ పారంపర్యంగా మూర్ఛ వస్తూ ఉంటే ముందు జాగ్రత్తగా చిన్నతనంలోనే వైద్యులను సంప్రదించాలి. జీవక్రియ లోపాలు ఉన్నవారిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో,  రోగ నిరోధక శక్తికి సంబంధించి ఏవైనా అనారోగ్యాలు ఉండే వారిలో మూర్ఛ వ్యాధి తొందరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న దాదాపు 70 శాతం మంది మందులతో తమ మూర్ఛలను నియంత్రించుకుంటారు. మూర్ఛ ఉన్న వ్యక్తులు  ప్రమాదాలకు ఎక్కువగా గురవుతారు. ముఖ్యంగా మూర్ఛలు హెచ్చరిక లేకుండా వస్తుంటాయి.  దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఉబ్బసం లేదా మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక సమస్యల మాదిరిగానే మూర్ఛ కూడా కొన్ని ప్రమాదాలతో వస్తుంది. వీటిని అదుపు చేయకుండా వదిలేస్తే చాలా తీవ్రంగా మారవచ్చు. మూర్ఛ సంబంధిత ప్రమాదాలను తగ్గించడంలో  మూర్ఛ నియంత్రణ మొదటి అడుగు. మూర్ఛలు కొన్నిసార్లు గాయాలు లేదా పడిపోవడానికి దారితీయవచ్చు. అవి అప్పుడప్పుడు మరింత తీవ్రంగా  మరణానికి కూడా కారణమవుతాయి. వివిధ రకాల మూర్ఛలు వేర్వేరు ప్రమాదాలను కలిగి ఉంటాయి.  వచ్చే మూర్ఛల రకం,  జీవనశైలిపై  ప్రమాద స్థాయి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సరిగా నియంత్రించబడని టానిక్-క్లోనిక్ మూర్ఛలు అత్యధిక ప్రమాదాన్ని కలిగిస్తాయి. మూర్చ సమస్య ఉంటే ఎప్పుడూ ప్రమాదం ఉంటుందని లేదు. కానీ వైద్యులను సంప్రదించి మూర్చ వ్యాధికి తగిన చికిత్స,  జాగ్రత్తలు, నియంత్రణ తీసుకుంటే సాధారణ వ్యక్తులలా జీవితాన్ని గడపవచ్చు. మూర్ఛ వ్యాధికి ప్రథమ చికిత్స.. ప్రశాంతంగా ఉండాలి. మూర్ఛ వచ్చిన  వ్యక్తితోనే ఉండాలి. మూర్ఛ వచ్చిన వ్యక్తిని  సురక్షితంగా ఉంచాలి. గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. మూర్ఛ వచ్చిన వారి తల కింద మెత్తని వస్తువును ఉంచాలి.  బిగుతుగా ఉన్న దుస్తులను వదులుగా చేయాలి. . మూర్ఛ ముగిసిన తర్వాత శరీరంలో  వంకర పోయిన అవయవాలను మెల్లిగా వాటి యథా స్థానాలలో ఉంచాలి.  వాటి నోటిలో ఆహారం లేదా ద్రవం ఉంటే, వెంటనే వాటిని  బయటకు పోయేలా చేయాలి. మూర్చ్ వచ్చిన వ్యక్తి కోలుకునే వరకు వారికి  ధైర్యం చెప్పాలి.వారు ప్రమాదంలో ఉంటే తప్ప వారి నోటిలో ఏమీ పెట్టకూడదు. మూర్ఛ ఎందుకు వస్తుంది..  మెదడులో విద్యుత్ అవాంతరాలు ఏర్పడటం వల్ల మూర్ఛ వస్తుంది.  మూర్చలో వివిధ రకాలు ఉన్నాయి. ఏమి జరుగుతుందో అర్థం కాని వ్యక్తులకు ఇది భయానక పరిస్థితి కావచ్చు. మైగ్రేన్లు, స్ట్రోక్‌లు,  అల్జీమర్స్ తర్వాత ఇది నాల్గవ అత్యంత సాధారణ నాడీ సంబంధిత రుగ్మత. మూర్ఛ వచ్చిన తర్వాత వ్యక్తిని వీలైనంత త్వరగా వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.                                         *రూపశ్రీ.
  బంధాల విషయానికి వస్తే బాధ్యతలు చాలా ఉంటాయి.  చిన్నవైనా, పెద్దవైనా బాధ్యతలు నిర్వహించడం ప్రతి ఒకరి కర్తవ్యం.  అయితే అంతా తమదే బాధ్యత అనుకోవడం చాలా మంది చేసే తప్పు. ప్రతి ఒక్కరూ నిర్వహించాల్సిన బాధ్యతలకు ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆ పరిమితికి మించి బాధ్యతలు తీసుకునేవారు మంచివారు అనే ట్యాగ్ నేమ్ పొందగలరు ఏమో కానీ.. జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. చాలామంది తరచుగా బాధ్యతల పేరుతో  కష్టాలలోకి జారిపోయి  జీవితాంతం వాటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.  అసలు బాధ్యతల విషయంలో ఏవి పట్టించుకోకూడదు.  ఏ విషయాలు మనుషులను జీవితాంతం బాధపెడతాయి. తెలుసుకుంటే.. ఇతరుల ఆనందానికి బాధ్యత.. ఇతరులను సంతోషపెట్టే బాధ్యత మీకు లేదు. మీరు వారి ఆనందానికి సహాయం చేయవచ్చు. కానీ నిజమైన ఆనందం వారి లోపలి నుండే వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగ శ్రేయస్సును తమ చేతుల్లోకి తీసుకోవాలి,  వారి వ్యక్తిగత జీవితాల్లో సంతృప్తిని పొందాలి. మీరు వేరొకరి ఆనందం భారాన్ని మోయలేరు. అలాగే వారి దుఃఖాన్ని తగ్గించాల్సిన బాధ్యత మీకు ఉండకూడదు. ముందుగా మీ స్వంత ఆనందంపై దృష్టి పెట్టాలి. ఇతరులు వారి స్వంత శాంతిని కనుగొననివ్వగలగాలి.  అంతేకానీ ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసమే బ్రతకడం పనిగా పెట్టుకుంటే మీకంటూ జీవితం, జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. ఎంపిక.. ఏదైనా ఒకటి ఎంపిక చేసుకుంటే అది అందరికీ అర్థమయ్యేలా చెప్పడం,  అందరూ ఆమోదం తెలపాలని అనుకోవడం మీ పని కాదు. మీ విషయంలో ఇతరులు గందరగోళంలో ఉంటే, అలాగే ఉండండి. మనందరికీ జీవితంలో విభిన్నమైన ఆలోచనలు,  అనుభవాలు ఉంటాయి. అవి మన నిర్ణయాలను రూపొందిస్తాయి. ఆమోదం,  ధృవీకరణ కోరుకోవడం సహజం. కానీ అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేరని అంగీకరించాలి. మీ ఎంపికలు మీ విలువలు, మీ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి.  ఇతరులు వాటిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు మీ పట్ల నిజాయితీగా ఉండటమే ముఖ్యం. భావోద్వేగాలు.. మీరు ఎవరికైనా మానసికంగా సహాయం చేయవచ్చు, కానీ వారి భావాలను నిర్వహించడం మీ బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ వారి స్వంత భావాలు,  రియాక్షన్స్ కు బాధ్యత వహిస్తారు. ఇతరులను ఓదార్చాలని కోరుకోవడం సాధారణమే కావచ్చు. కానీ వారి భావాలను నియంత్రించడానికి లేదా సరిదిద్దడానికి ప్రయత్నించడం చికాకు లేదా ఆగ్రహానికి దారితీస్తుంది. సానుభూతిని తెలపడం,  మాట్లాడటం  ముఖ్య.  కానీ ఇతరులు ఇలా మాట్లాడటాన్ని కొన్నిసార్లు తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే భావోద్వేగాల పరంగా ఇబ్బంది పడుతున్నవారికి పదే పదే మాట్లాడించడం సరికాదు.  వారికంటూ కొంత సమయం ఇవ్వాలి. అంతేకాదు.. ఇతరుల భావోద్వేగాలు మీ మీద ఆధారపడటం కూడా తప్పే.. మీ తప్పు ఉంటే సరిదిద్దుకోవచ్చు. కానీ తప్పు లేకపోయినా ఇతరులు భావోద్వేగాలు తగ్గించడానికి మీరు మీ జీవితాన్ని,  సంతోషాన్ని త్యాగం చేసే పని పెట్టుకోకూడదు. విలువ.. ప్రతి మనిషి విలువైనవారే.. ఆ విలువను ఇతరుల ముందు  నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు.  విలువ అనేది దానికదే అర్థం కావాలి. ముఖ్యంగా మిమ్మల్ని చూడటానికి లేదా అభినందించడానికి ఇష్టపడని వారికి. మీ విలువకు ఇతరుల ప్రశంసలు లేదా గుర్తింపు అవసరం లేదు. మీ విలువను గుర్తించని వ్యక్తుల నుండి ఆమోదం పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపిస్తే  అది మీ శక్తిని హరిస్తుంది. బదులుగా మిమ్మల్ని అభినందిస్తున్న,  ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులతో కలిసిపోవడం మంచిది అంచనాలు..  అందరికీ అన్ని విధాలుగా అందరూ నచ్చరు. అందరి అంచనాలను అన్నివేళలా తీర్చడం సాధ్యం కాదు.  అలా చేయడానికి ప్రయత్నించడం వల్ల నిరాశ,  ఆగ్రహమే వస్తుంది.  పరిమితులను నిర్ణయించుకోవడం,  వేరొకరికి ఎంత ఇవ్వగలరో,  ఎంత ఇవ్వకూడదో స్పష్టంగా చెప్పడం ముఖ్యం.                               *రూపశ్రీ.  
    పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కూడా పెరుగు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు నిల్వ ఉండేలా చూసుకుంటారు.  బయట మార్కెట్లో కూడా పెరుగు అమ్మకాలు,  మజ్జిగ అమ్మకాలు బాగా పెరుగుతాయి.  పెరుగును చిలికి రోజంతా కొద్ది కొద్దిగా మజ్జిగ రూపంలో తీసుకుంటూ ఉంటే అస్సలు వడదెబ్బ కొట్టదు.  వేసవి కారణంగా వేధించే వేడి దరి చేరదు.    కానీ పెరుగు  కొన్ని కారణాల వల్ల పెరుగు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలతో  తినడం వల్ల  చాలా నష్టం చేకూరుస్తుంది.  కొన్ని పదార్థాలతో తింటే పెరుగు పాయిజన్ గా మారుతుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ఇంతకీ  పెరుగుతో తినకూడని 4 ఆహారాలు ఏంటి? తెలుసుకుంటే.. సిట్రస్ పండ్లు పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా చెడ్డది. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. పుల్లని పండ్లలో ఉండే ఆమ్ల గుణం పెరుగుతో కలిసి కలుపులో వాయువులు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఇది ఉబ్బరం,  గ్యాస్,  ఛాతీలో మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది. డెజర్ట్‌లు స్వీట్లు తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?  కానీ పెరుగుతో కలిపి స్వీట్లు తినడం కొందరికి సరదా.. మరికొందరికి ఇష్టం కూడా.  కానీ ఇలా పెరుగుతో స్వీట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. పెరుగు,  స్వీట్ల  కలయిక  కడుపులో మంటను కలిగిస్తుంది. బంగాళాదుంపలు.. పెరుగుతో బంగాళాదుంపలు తినడం  చూసే ఉంటారు.  చాలా రకాల స్నాక్స్ లో బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్ పైన పెరుగును చాలా ధారగా వేసి మరీ ఇస్తుంటారు. కానీ పెరుగు,  బంగాళాదుంపల కలయిక ఆరోగ్యానికి చాలా చెడ్డదట. బంగాళాదుంపలను ఎక్కువగా తినడమే మంచిది కాదు.. ఇక పెరుగుతో తింటే అది ఇంకా నష్టం కలిగిస్తుంది మాంసాహారం.. పెరుగుతో కలిపి మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది.  ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కానీ చాలామంది నాన్ వెజ్ వండేటప్పుడు మాంసాన్ని మసాలా మిశ్రమం లో నానబెడతారు.  ఈ మసాలాలో పెరుగు ఖచ్చితంగా వేస్తారు. అంతేకాదు.. నాన్ వెజ్ వంటకాలు తినేటప్పుడు అదనంగా పక్కనే పెరుగు కూడా ఉంటుంది. కానీ మాంసాహారం,  పెరుగు శరీరానికి ప్రోటీన్ పరంగా దెబ్బ కొడుతుంది.                                      *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పిల్లలు చాలా తెలివిగా, చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఎందుకంటే ఇలా ఉన్నపిల్లలే చదువులో బాగా రాణిస్తారు.  పిల్లల చిన్నతనం అంతా చదువులు, ర్యాంకులు,  ప్రైజులు,  పుస్తకాల ప్రపంచంలో గడుస్తుంది.  ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా ఆలోచించాలన్నా,  ఏదైనా సరే తొందరగా నేర్చుకోవాలన్నా, తెలివైన పిల్లలు అనిపించుకోవాలన్నా వారి మెదడు పనితీరు చురుగ్గా ఉండాలి. మందబుద్దిగా ఉన్న పిల్లలు తరగతిలోనే కాదు.. ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర చివాట్లు తింటారు. అయితే పిల్లలు మందబుద్ది స్థాయి నుండి తెలివిగా మారాలంటే వారి మెదడును యాక్టీవ్ చేసే ఆహారాలు ఇవ్వాలి.  పిల్లల మెదడుకు పదును పెట్టే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వాల్నట్స్.. పిల్లల మెదడును పదును పెట్టడానికి వాల్‌నట్స్ అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  యాంటీఆక్సిడెంట్లు వంటి అంశాలు  మెదడు శక్తిని పెంచుతాయి. వాల్నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే దాని మీద ఉన్న లేత పొరను తొలగించి తినమని చెప్పాలి. ఇది  చాలా మంచి మార్గం. ఇలా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే డ్రై ఫ్రూట్స్ బార్ లేదా లడ్డు వంటి వాటిలో వాల్నట్స్ ను యాడ్ చేసి రోజుకు ఒకటి ఇస్తుండాలి. ఆకుకూరలు పాలకూర, మెంతికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు  మెదడు ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఐరన్, ఫోలేట్,  విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూరలు  మెదడును బలపరుస్తాయి.  అయితే పిల్లలు పాస్ట్ ఫుడ్స్,  బయటి ఫుడ్స్ ను ఇష్టపడినట్టు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు.  అందుకే  ఆకుకూరలతో సూప్,  కట్లెట్, పనియారం వంటి వాటిలో ఆకుకూరలు జోడించాలి. చపాతీ చేసేటప్పుడు మెంతికూర ఆకులు లేదా పాలకూర పేస్ట్ వేసి పిండిని కలుపుకోవాలి. వంటల్లో ఆకుకూరలను జోడించాలి. బెర్రీలు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు,  రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు  మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండ్లు  మెదడును పదునుపెడతాయి. పిల్లలకు ఈ విదేశీ పండ్లంటే చాలా ఇష్టం.  వాళ్లను బ్రతిమలాడకపోయినా తినేస్తారు.  అయితే ఖరీదు కారణంగా వీటిని అవాయిడ్ చేస్తుంటారు. కానీ నేరేడు,  రేగు పళ్లు.. వంటి లోకల్ పండ్లను కూడా పిల్లలకు ఇవ్వచ్చు.  ఇవి కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. గుడ్డు.. గుడ్లు తినడం  ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్  మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా గుడ్డులోని పచ్చ సొనను పడేస్తుంటారు. కానీ గుడ్డులోని పచ్చసొన కూడా తినాలి.  రోజుకు ఒక గుడ్డు పిల్లలకు ఇస్తూ ఉంటే వారి శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. పైన చెప్పుకున్న నాలుగు ఆహార పదార్థాలను పిల్లల ఆహారంలో తప్పనిసరిగా బాగం చేస్తూ ఉంటే పిల్లలు చాలా చురుగ్గా మారతారు.  వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. చదువులో రాణిస్తారు.  అయితే పిల్లలను చదువులో ప్రోత్సహించడం,  వారిని ఇన్ప్రైర్ చేయడం తల్లిదండ్రులు తప్పక చేయాలి.                                     *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                                   
   నెయ్యిని భారతీయ ఋషులు అమృతంతో సమానమైన ఔషదంగా పేర్కొన్నారు.  ఆహారంలో నెయ్యిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తినడం,  ఉదయాన్నే నెయ్యిని వేడి నీటితో తాగడం లాంటి చిట్కాలు వినే ఉంటారు.  కానీ నెయ్యిలో నల్ల మిరియాలు కలిపి తింటే ఆరోగ్యానికి బోలెడు లాభాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. దేశీ ఆవు నెయ్యి చాలా  ఆరోగ్యకరమైనది అని ఆయుర్వేదం చెబుతుంది.  ఎందుకంటే దేశీ ఆవు నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడతాయి.  ఇక  మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది.  ఈ పైపెరిన్ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్యాస్,  ఎసిడిటీ వంటి సమస్యతో బాధపడేవారు ఒక మిరియాలు వాడితే చాలా మంచి ఉపశమనం ఉంటుంది.  అయితే ఒక స్పూన్ దేశీ ఆవు నెయ్యిలో ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుని తీసుకున్నా లేదా ఒక స్పూన్ నెయ్యితో ఒక మిరియం గింజ తీసుకుని నమిలి తిన్నా చాలా మంచి ఉపశమనం ఉంటుంది. దేశవాళీ ఆవునెయ్యి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు దేశ వాళీ ఆవు నెయ్యిలో కాస్త మిరియం పొడి కలిపి తీసుకుంటే మంచిది.  పేగుల దారిని ఇది సుగమం చేస్తుంది.  ఆహారం ప్రేగులలో సులువుగా కదిలేందుకు సహాయపడుతుంది. తద్వారా పేగులలో వ్యర్థపదార్థాలు మలం రూపంలో సులువుగా విసర్ఝించబడతాయి. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఈ లక్షణాలు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి.  నెయ్యిలో కాసింత మిరియాల పొడి తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.                                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...