'దృశ్యం 2' రీమేక్ కి ముహూర్తం ఫిక్స్
on Feb 21, 2021
మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ 'దృశ్యం' (2013).. తెలుగుతో సహా పలు భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్ల విజయం సాధించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం 'దృశ్యం'కి సీక్వెల్ గా మలయాళంలో `దృశ్యం 2` రూపొందించారు. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో డైరెక్ట్గా రిలీజయ్యింది. దీనికి వీక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పర్ ఫెక్ట్ సీక్వెల్ గా `దృశ్యం 2`ని కొనియాడుతున్నారు.
ఈ సీక్వెల్ ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. `దృశ్యం`లో నటించిన విక్టరీ వెంకటేశ్ నే ఈ సీక్వెల్ లోనూ కొనసాగుతున్నారు. అంతేకాదు.. మార్చి తొలి వారం నుంచి ఈ సీక్వెల్ రీమేక్ కి సంబంధించిన చిత్రీకరణని మొదలుపెట్టి.. కేవలం రెండు నెలల్లో సినిమాని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. అలాగే, జూన్ లేదా జూలైలో `దృశ్యం 2` రీమేక్ ని రిలీజ్ చేస్తారని వినికిడి.
తెలుగు దృశ్యంకు శ్రీప్రియ దర్శకత్వం వహించగా, ఈ సీక్వెల్కు మాత్రం ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ నే డైరెక్ట్ చేయనున్నాడు. ఈ మూవీని సురేశ్ బాబు భాగస్వామ్యంలో నిర్మించనున్నారు. త్వరలోనే `దృశ్యం 2` రీమేక్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read