రాజీనామా చేస్తా

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవర్టుగా తనపై ముద్ర వేయడంపై గుంటూరు జిల్లా నర్సారావుపేట తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొందరు పార్టీ సీనియర్ నాయకులు తనపై జగన్ కోవర్టుగా చెప్పడంతో వేణుగోపాల్ రెడ్డి ఆదివారంనాడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. తాను పార్టీకి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. తనపై విశ్వాసం లేనప్పుడు పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని ఆయన చంద్రబాబుతో అన్నట్లు తెలుస్తోంది. జగన్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు కొంత మంది తనపై ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu