రోడ్డు ప్రమాదానికి గురైన వైసీపీ ఎమ్మెల్యే...

 

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వివరాల ప్రకారం... ప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా పులివెందుల మీదుగా బెంగళూరుకు వెళుతుండగా నామాలగుండు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు స్వల్ప గాయాలయ్యాయి. వారిని పులివెందులలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu