"కాల్ మనీ"..జగన్ సైలెంట్ అందుకేనా..?

ప్రస్తుతానికి ఏపీలో పొలిటి"కాల్ మనీ" వార్ జరుగుతుంది.దీనికి సంబంధించి ఇప్పటికే ఎంతో మంది నేతల పేర్లు కూడా బయటపడుతున్నాయి.దీనిలో కొంత మంది తెలుగు తమ్ముళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే  ఎప్పుడు అధికార పక్షం తప్పులు దొరుకుతాయా..ఎప్పుడు అధికార పార్టీపై విమర్శలు చేద్దామా అని ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ ఎదురుచూస్తుంటారు.అలాంటిది ఇప్పుడు కాల్ మనీ దందాలో టీడీపీ నేతల పేర్లు వినిపిస్తున్నా జగన్ ఎందుకు ఏమాత్రం నోరు మెదపడంలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే జగన్ కు తమ పార్టీ నేతలపై ఉన్న నమ్మకంతోనే ఈ విషయంలో అధికార పార్టీపై నోరు జారడంలేదట.ఒకవేళ ఇప్పుడు కనుక తను అధికార పార్టీపై విమర్శలు చేసి..తరువాత పొరపాటున విచారణలో వైకాపా పార్టీ నేతల పేర్లు ఏవైనా భయటపడితే అప్పుడు పరువుపోతుందని ఆలోచిస్తున్నారంట.అంతేకాదు ఈ కేసుకు సంబంధించి అటు పోలీసు విచారణలో ఎవరెవరి పేర్లు వస్తున్నాయో చూసుకుంటుండడంతో పాటు తాను స్వయంగా దీనిపై వివరాలు తెప్పించుకునే పనిలోనూ ఉన్నారట.ఇంక రెండు రోజులు ఆగి..తమ నేతల పేర్లు లేని పక్షంలో ఆ తరువాత ప్రభుత్వం పై విమర్శలు చేయోచ్చులే అని భావిస్తున్నారంట.మొత్తానికి జగన్ కు తమ బంగారాల మీద అంత నమ్మకం ఉందన్నమాట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu