వైకాపా నేత వడ్డేపల్లి కన్నుమూత

 

 

 

హైదరాబాద్ కూకట్ పల్లి వైకాపా సీనియర్ వడ్డేపల్లి నర్సింహ రావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో రాష్ట్ర ష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేసారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో పనిచేశారు. ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్డేపల్లి మృతి పట్ల మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, కూకట్‌పల్లి టిడిపి ఎమ్మెల్యే కృష్ణా రావు, వైకాపా అధ్యక్షుడు జగన్, తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటి రామారావు సంతాపం ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu