ఓటీటీలోకి ఒకేసారి రెండు క్రేజీ సినిమాలు!

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఇటీవల చిన్న సినిమాలుగా విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకొని.. మంచి విజయం సాధించిన సినిమాలుగా 'ఆయ్', 'కమిటీ కుర్రోళ్ళు'ను చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేరోజు ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం.

11 మంది యువ నటులను ప్రధాన పాత్రల్లో పరిచయం చేస్తూ య‌దు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు' (Committee Kurrollu). ఆగ‌స్ట్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా 90s బ్యాచ్ ఈ మూవీలోని సీన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో మంచి వసూళ్లతో సత్తా చాటిన 'కమిటీ కుర్రోళ్లు'.. ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో ఈరోజు(సెప్టెంబర్ 12) నుంచి స్ట్రీమ్ అవుతోంది.

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం 'ఆయ్' (Aay). జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి అంజి కె. మణిపుత్ర దర్శకుడు. ఆగస్టు 16 థియేటర్లలో అడుగుపెట్టిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. ఘన విజయం సాధించింది. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.