లడ్డూ వివాదం.. అన్ని రాష్ట్రాలూ అలెర్ట్!

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే కర్నాటక సర్కార్  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అధీనంలోని  అన్ని ఆలయాలలో నందినీ నెయ్యినే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడు ప్రభుత్వం అయితే తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపింది. మరో వైపు రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం నాణ్యతను పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఆదేశించింది. దీంతో రాజస్థాన్ లోని అన్ని ఆలయాలను తనిఖీ చేయాని ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 26 వరకూ రాజస్థాన్ లోని అన్ని ఆలయాలలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రసాదం నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపుతారు.