తేనెటీగల దాడిలో ఇద్దరు కూలీలు మృతి, ముగ్గురి  పరిస్థితి విషమం

 రాజమౌళి చిత్రంలో ఈగ  చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో విలన్  క్యారెక్టర్లో సుదీప్ నటించాడు. హీరో నానిని హత్య చేయడానికి ఈగ యత్నిస్తుంది. హీరోను అగ్నికి అహుతి చేయాలని ప్రయత్నించి తానే ఆ మంటల్లో అహుతి అవుతుంది. హీరో సేఫ్ గా బయటపడ్డాడు  అది రీల్ స్టోరీ. ఇది  మాత్రం రియల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో పొలం పనులు చేసుకునే కూలీలను తేనెటీగలు  దాడి చేసి హత్య చేశాయి.  లక్షలాది తేనెటీగలు ;పొలం పనులకు వచ్చిన ఇద్దరు కూలీలను పొట్టనబెట్టుకున్నాయి.   ఎప్పటి మాదిరిగా సద్దిమూట కట్టుకుని పొలం పనులకు వచ్చిన ఈ కూలీల బతుకు అదే రోజు తెల్లారిపోయింది. తాము వెంట తెచ్చుకున్న సద్ది మూటే  వారికి చివరి  మెతుకులయ్యాయి.    ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారిలో కిల్లరి కాంతమ్మ, కిల్లరి కిష్టప్ప ఉన్నారు. వీరిరువురు భార్య భర్తలు.  మరో ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కెజీహెచ్ కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేయడంతో ప్రస్తుతం అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. నేరం జరగగానే పోలీసులు సీన్లో ఎంటరయ్యారు.తేనెటీగల దాడి వివరాలను పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.