వరద బాధితుల కోసం భారీగా విరాళాలు!

ఆంధ్రప్రదేశ్‌లో  వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.   అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్   రూ.67,29,398 చెక్కును ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కి అందించింది.  అలాగే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందించారు.  అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అలాగే టాలీవుడ్‌ యువ నటుడు  హైపర్‌ ఆది  3 లక్షల రూపాయలు  విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి చెక్కు అంద చేశారు.