వర్షాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

భారత వాతావరణ శాఖ తెలంగాణకు రెయిన్ ఎలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తగూడెం, నిర్మల్, అసిఫీబాద్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఈ రోజు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు అంటే ఆదివారం నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.