టీ కాంగ్రెస్ నేతలను కాకా పడుతున్న జూపల్లి

మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల శానసభా నియోజకవర్గంలో మంత్రి జూపల్లి పాదయాత్రకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఉదయం అల్పాహార విందు నిచ్చారు. ఈ విందుకు ఎంపీలు వివేక్, మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్ తదితరులు పాల్గొన్నారు. తన నియోజకవర్గం గద్వాలలో జూపల్లి కృష్ణారావు పాదయాత్రను మరో మంత్రి డికె అరుణ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ అల్పాహార విందు జరిగింది. డికె అరుణ వ్యతిరేకతతో జూపల్లి కృష్ణారావు తన పాదయాత్రను నాలుగు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆయన తన పాదయాత్రను గద్వాలలో చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల మద్దతును ఆయన కూడగట్టుకుంటున్నారు. జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమర్థిస్తున్నారు. కాంగ్రెసు విధానం మేరకే జూపల్లి కృష్ణారావు పాదయాత్ర జరుగుతోందని మందా జగన్నాథం అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu