15 ఏళ్ళ బంధాన్ని ఒక్క మాటతో తుంచేశారు.. విడాకులపై స్టార్‌ హీరో భార్య ఆవేదన!

సాధారణంగా ఒకటి రెండు సంవత్సరాలు కాపురం చేసిన జంట కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తే ఆ సమయంలో ఎంతో బాధపడతారు. అదే 15, 20 సంవత్సరాల తర్వాత అలాంటి సమస్యలే వస్తే నిజంగా విడిపోతారా? ఖచ్చితంగా విడిపోరు. ఎందుకంటే అప్పటికే ఇద్దరి మధ్య ఎంతో బాండిరగ్‌ ఏర్పడుతుంది. సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు తప్ప విడిపోదామని, విడాకులు తీసుకుందామని అనుకోరు. కానీ, సినిమా పరిశ్రమలోని వ్యక్తుల ఆలోచనా ధోరణి దానికి భిన్నంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా, వారికి పిల్లలు కలిగినా, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా ఒక్కసారి ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు వస్తే మరో ఆలోచన లేకుండా విడాకులకు వెళ్లిపోతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా విడాకులు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువయ్యాయి. 

ఆమధ్య తమిళ్‌ హీరో ధనుష్‌, ఐశ్వర్యా రజినీకాంత్‌ 18 సంవత్సరాలు వైవాహిక జీవితంలో గడిపి కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇప్పుడు అదే బాటలో వెళుతున్నారు తమిళ్‌ హీరో జయం రవి, ఆర్తి. వీరిద్దరికీ 2009లో వివాహం జరిగింది. ఆ బంధానికి గుర్తుగా ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా కాలంగా జయం రవి దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మంగళవారం తాము విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు జయం రవి. అయితే అది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని, దీనిపై రూమర్స్‌ స్ప్రెడ్‌ చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉంటే.. ఈ విడాకుల వ్యవహారంపై జయం రవి భార్య ఆర్తి చేసిన ఆరోపణలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. తమ విడాకుల విషయాన్ని ప్రకటించే ముందు తన పర్మిషన్‌ ఏమీ తీసుకోలేదని, ఈ విషయంలో ఏక పక్షంగా వ్యవహరించారని జయం రవిని తప్పు పట్టారు ఆర్తి. అతను చేసిన ప్రకటన చూసి తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. కొంతకాలంగా తమ మధ్య ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పే ప్రయత్నం చేశానని, కానీ తనతో రవి డైరెక్ట్‌ మాట్లాడటం లేదని తెలిపారు. రవి చేసిన ప్రకటన చూడా పిల్లలు కూడా షాక్‌ అయ్యారని అన్నారు ఆర్తీ. విడాకుల విషయంలో తాను ఎంతో బాధపడుతున్నానని, అయితే బహిరంగంగా ఎలాంటి కామెంట్స్‌ చేయదలుచుకోలేదన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదన్నది తన అభిప్రాయమని ఆర్తీ అన్నారు. ఏది ఏమైనా కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు.