జగన్ ఫిర్యాదుపై రోశయ్య రెస్పాన్స్

న్యూఢిల్లీ: యువకులు చేసే ఆరోపణలను నిందలు భరించే శక్తి తనకు ఉందని తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య అన్నారు. తనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ఫిర్యాదుపై ఆయన ఆ విధంగా స్పందించారు. ప్రత్యారోపణలు చేసేందుకు తాను సిద్ధంగా లేనన్నారు. ఇటీవల జగన్‌ ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసి, రోశయ్యపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌కు విశ్వాసపాత్రుడిగా ఉన్నందువల్లే అమీర్‌పేట భూకేటాయింపు కేసులో ఏసీబీ కోర్టు ద్వారా క్లీన్‌చిట్‌ ఇప్పించి, రోశయ్యను గవర్నర్‌ను చేశారని అన్నారు. జగన్‌లాంటి యువకులు మాట్లాడిన మాటలమీద తాను వ్యాఖ్యానించనని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu