టీడీపీలో చేరిన మోపిదేవి, బీదా మస్తాన్‌రావు!

రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంకటరమణ, మస్తాన్‌రావులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.