శరణార్థుల పడవ మునక..74 మంది జలసమాధి

మధ్యదరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యదరా సముద్రంలో పడవ మునిగిపోవడంతో దానిలో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. అధికారిక సమాచారం ప్రకారం 74 మంది జలసమాధి అయినట్లు తెలుస్తోంది. దీంతో లిబియా తీరానికి మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. సిరియా, లిబియాల్లో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఆ దేశాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యూరప్ దేశాలకు వలస వెళుతున్నారు. అందుకు పడవలనే నమ్ముకుంటున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో అవి మునిగిపోతున్నాయి.