ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. తెల్లవారుజామున నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా..మరో ఐదుగురు జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానిక మహిళ ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అదనపు బలగాలు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.