కాంగ్రెస్ కు షాక్.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్..

 

మణిపూర్ కాంగ్రస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కసారే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుండి జంప్ అయ్యారు. ఎమ్మెల్యే  సుర్చంద్రసింగ్, నామ్‌థాంగ్‌ హావోకిప్‌,  శ్యామ్‌ కుమార్‌, జిన్సువుహౌ జౌ లు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు టిఎన్ హవోకిప్‌ మాట్లాడుతూ... ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలు మారిపోయాయని, శత్రువులు మిత్రులుగా మారారని, పార్టీ సిద్ధాంతం, భావజాలం పనిచేయలేదని వ్యాఖ్యానించారు. కాగా మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూలింగ్‌ పార్టీ కాంగ్రెస్‌ 28 స్థానాలు దక్కించుకోగా, 21 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ మాత్రం ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.