ముంబై ఎఫెక్ట్.. ఆస్తులు మొత్తం పోయి రోడ్ మీదకి రాజ్ తరుణ్!

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఉహించెదరు. అదే రీతిలో రాజ్ తరుణ్(raj tarun)లావణ్య (lavanya)మాల్వి మల్హోత్రా(malvi malhotra)ల మ్యాటర్ నిమిషానికో  కొత్త  హంగులని అలుముకుంటుంది. రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకొని వదిలేసాడని  లావణ్య కేసు పెట్టింది. ఇంకో పక్క లావణ్య  అసభ్యకరమైన మెసేజెస్ చేస్తు  తన అన్నయ్య ని వేధిస్తోందని మాల్వి కేసు నమోదు చేయించింది. ఇక రాజ్ తరుణ్ అయితే లావణ్య కి మస్తాన్ సాయి అనే వ్యక్తి తో ఎఫైర్ ఉందని డ్రగ్స్ కి కూడా బానిస అయ్యిందని కంప్లైంట్ చేసాడు. ఇప్పుడు ఈ ముగ్గురి జాబితాలోకి  నాలుగో నెంబర్ వచ్చి  చేరింది. ముంబై కి చెందిన ఆమె ఏకంగా వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇంతకీ అందులో ఏముందో చూద్దాం. 
 
యోగేష్.. ముంబై కి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆ  వ్యక్తిని మాల్వి మోసం చేసిందనే న్యూస్  సంచలనం గా మారింది.  ఇది నిజం.  యోగేష్ ని మాల్వి మోసం చేసిందని సాక్షాత్తు యోగేష్ తల్లి ఒక వీడియో రిలీజ్ చేసింది.అందులో ఆమె మాట్లాడుతు ప్రేమ పేరుతో మాల్వి నా కుమారుడ్ని మోసం చేసింది. ఆస్తులు మొత్తం లాక్కొని ఆ తర్వాత  రోడ్ న పడేసింది. అంతటితో ఆగకుండా  యోగేష్ పై రివర్స్ లో పోలీసులకి  ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరు తో వెంట పడుతున్నాడని కేసు నమోదు చేయించిందని  నాలుగేళ్ళ నుంచి యోగేష్ జైలులోనే  ఉన్నాడని చెప్పుకొచ్చింది.    అదే విధంగా యోగేష్, మాల్వి కలిసి తిరిగిన ఫ్లైట్ టికెట్స్, ఇద్దరి మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ వ్యక్తి గత ఫోటోలు ని కూడా ఆమె విడుదల చేసింది.

ఇక ఇప్పుడు ఈ విషయం తెలుగు నాట హాట్ టాపిక్ అయ్యింది. కొంత మంది అయితే జరిగిన సంఘటన ని ఇమేజింగ్ చేసుకొని యోగేష్ ప్లేస్ లో రాజ్ తరుణ్ ని ఉహించుకుంటున్నారు.  యోగేష్ తల్లి చెప్పబట్టి సరిపోయింది. లేదంటే  రాజ్ తరుణ్ పరిస్థితి  కూడా ఖచ్చితంగా యోగేష్ ల ఉండేదని వాళ్ళ ఊహ యొక్క లక్ష్యం. మరి ఆ వీడియో చూసాక  రాజ్ తరుణ్ ఎలాంటి  నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.