రేపే ఆగడు ప్రారంభం

 

మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘దూకుడు' తర్వాత తెరకెక్కనున్న రెండో చిత్రం"ఆగడు". ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు రేపు ఉదయం 8 గంటలకు రామానాయుడు స్టుడియోలో జరగనున్నాయి. రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ నెలలో ప్రారంభం కానుందని తెలిసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా "దూకుడు" కంటే మరింత బ్లాక్ బస్టర్ హిట్టయ్యే సాంగ్స్ ఇవ్వాలని థమన్ ఆశిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ ఎంకౌంటర్ శంకర్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనున్నది.

మహేష్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1-నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదల కానుంది.