కోబలి పరిశోధనలో మాటల మాంత్రికుడు

 

"అత్తారింటికి దారేది" వంటి ఇండస్ట్రీ రికార్డ్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం చాలా సాదాసీదాగా తన పనేదో తను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే త్రివిక్రమ్ మళ్ళీ త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి "కోబలి" చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్ర విశేషాల గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ....“కోబలి అనేది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే పదం. అమ్మవారికి బలి ఇవ్వడాన్ని కోబలి అంటారు. ఈ కథపై పరిశోధన జరుగుతోంది. కొంచం కష్టంతో కూడిన కథ ఇది. అంటే రిస్క్ వుంది. అందుకే ఆ రిస్కేదో మేమిద్దరమే చేయాలనుకున్నాం. వీలైనంత త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం” అని చెప్పారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియట్లేదు. ఎందుకంటే పవన్ ప్రస్తుతం "గబ్బర్ సింగ్ -2" సినిమా కోసం బిజీగా ఉన్నాడు. మరి ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళేవరకు వేచి చూడాల్సిందే.