గాజు గ్లాస్ సింబల్.. హైకోర్టులో జనసేనకు పాక్షిక ఊరట

ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ పిటిషన్ పై బుధవారం (మే1)న  విచారణ జరిగింది. మంగళవారం రోజు ఎన్నికల కమిషన్ హైకోర్టును 24 గంటల సమయం కోరిన సంగతి తెలిసిందే.  జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఎంపీ స్థానాలలో అలాగే   జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు.

అంటే గాజుగ్లాసు గుర్తు విషయంలో జనసేనకు పాక్షిక ఊరట మాత్రమే కలిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది.  కాగా హైకోర్టు   పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఇంకా అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా జనసేనకు సూచించింది.